logo

IT Eemployees: సైబరాబాద్‌లో ‘లాగౌట్‌’ మరో 2 వారాలు

భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో కంపెనీలకు ప్రత్యేక లాగౌట్‌ సమయాన్ని మరో 2 వారాలు పొడిగిస్తున్నట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రకటించారు.

Updated : 28 Jul 2023 09:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో కంపెనీలకు ప్రత్యేక లాగౌట్‌ సమయాన్ని మరో 2 వారాలు పొడిగిస్తున్నట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయ చర్యలపై కమిషనరేట్‌లోని పబ్లిక్‌ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ సెంటర్‌(పీఎస్‌ఐవోసీ)లో సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా కొన్ని చెరువుల్లో ప్రవాహ తీరు పరిశీలించారు. అదనపు కమిషనర్‌ అవినాష్‌ మహంతి, ట్రాఫిక్‌ సంయుక్త కమిషనర్‌ నారాయణ నాయక్‌, క్రైమ్స్‌ డీసీపీ కల్వేశ్వర్‌ సింగెనవార్‌, డీసీపీలు హర్షవర్ధన్‌, సందీప్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని