logo

తెలంగాణ బరిలో తమిళ పార్టీ

తెలంగాణలో తొలిసారిగా ఓ తమిళపార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. తమిళనాడు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడుతలై చిరుతైగల్‌ కట్చి (వీసీకే) పార్టీ తరఫున హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులుగా జె.పద్మజ, పగిడిపల్లి శ్యామ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

Updated : 28 Apr 2024 05:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో తొలిసారిగా ఓ తమిళపార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. తమిళనాడు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడుతలై చిరుతైగల్‌ కట్చి (వీసీకే) పార్టీ తరఫున హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులుగా జె.పద్మజ, పగిడిపల్లి శ్యామ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్‌ లోక్‌సభకు పోటీచేస్తున్న జె.పద్మజ ముషీరాబాద్‌లో ఉంటుండగా.. సికింద్రాబాద్‌ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న పగిడిపల్లి శ్యామ్‌ కుత్బుల్లాపూర్‌లోని సూరారం కాలనీలో ఉంటున్నారు. తమిళనాడులో బహుజనులు, దళితుల హక్కుల కోసం విడుతలై చిరుతైగల్‌ కట్చి నాలుగు దశాబ్దాలుగా పోరాడుతోంది. గతంలో ఆ పార్టీకి దళిత్‌ పాంథర్స్‌ ఇండియాగా పేరుంది. వీసీకే పార్టీ అధ్యక్షుడిగా తిరుమావలన్‌ కొనసాగుతున్నారు. ఇక తమిళనాడులో డీఎంకే పార్టీతో వీసీకే పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా డీఎంకే అగ్రనేతలు వీసీకే పార్టీకి రెండు లోక్‌సభ స్థానాలను కేటాయించారు. మరోవైపు బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలిపినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని