ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు.
ఒక్క శాతం ఓట్లు తెచ్చుకోలేక చతికిల
ఈనాడు, హైదరాబాద్: ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాల్లో 2014, 2019 ఎన్నికల్లో దాదాపు 40 కొత్త పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. అయితే వీరంతా కనీస పోటీ కూడా ఇవ్వలేక డిపాజిట్లు కోల్పోయారు.
సికింద్రాబాద్లో..
- 2019 లోక్సభ ఎన్నికల్లో 28 మంది పోటీ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాతి స్థానం 1.1 శాతంతో జనసేనకు లభించింది. మరో 9 పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నా కనీస పోటీ ఇవ్వలేకపోయారు.
- 2014 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భాజపా, కాంగ్రెస్, ఎంఐఎం, తెరాస తర్వాత వైకాపా, ఆప్, జై సమైక్యాంధ్రపార్టీ, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ తదితర పార్టీల అభ్యర్థులకు 1శాతం ఓట్లు కూడా రాలేదు.
మల్కాజిగిరి బరిలో..
- 2019 లోక్సభ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఫలితాల్లో కాంగ్రెస్, తెరాస, భాజపా తొలి మూడుస్థానాల్లో ఉండగా...సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇండియా ప్రజా బంధుపార్టీ అభ్యర్థులకు కేవలం 0.1శాతం ఓట్లు పడ్డాయి. ప్రజాసత్తాపార్టీకి కేవలం 720 ఓట్లు వచ్చాయి.
- 2014 ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో తెదేపా, తెరాస, కాంగ్రెస్, లోక్సత్తా, వైకాపా తర్వాత ఆప్, జై సమైక్యాంధ్రపార్టీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, బీసీ భరతదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీలు 1శాతం ఓట్లను పొందలేదు.
హైదరాబాద్ స్థానం నుంచి..
- 2019 ఎన్నికల్లో ఇక్కడ 15 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఎంఐఎంకి 58.9శాతం, భాజపాకు 26.8శాతం, తెరాసకు 7.2శాతం, కాంగ్రెస్కు 5.7శాతం ఓట్లు పడ్డాయి. న్యూ ఇండియా పార్టీ, సమాజ్వాదీ ఫార్వర్డ్బ్లాక్ పార్టీలకు కనీసం 1శాతం ఓట్లు పడలేదు.
- 2014 ఎన్నికల్లో 16 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఎంఐఎం, భాజపా, కాంగ్రెస్, తెరాస తొలి నాలుగు స్థానాల్లో ఉండగా ఆ తర్వాతి స్థానంలో 2.2శాతం ఓట్లతో పిరమిడ్ పార్టీ, 1.1శాతంతో వైఎస్సార్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ 0.6శాతం ఓట్లు సాధించాయి.
చేవెళ్ల.. ఇలా..
- 2019 లోక్సభ ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... తెరాస, కాంగ్రెస్, భాజపా తొలి మూడు స్థానాలు సాధించాయి. మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్)కి 0.5శాతం, బహుజన్ సమాజ్ పార్టీకి 0.4శాతం, ప్రజా స్వరాజ్ పార్టీకి 0.3శాతం, నేషనల్ ఉమెన్స్ పార్టీ 0.2శాతం ఓట్లు వచ్చాయి.
- 2014 ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో ఉండగా తెరాస, కాంగ్రెస్, తెదేపా తొలిమూడు స్థానాల్లో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో అఖిల భారతీయ ముస్లిం లీగ్ (సెక్యులర్), వైఎస్సార్సీపీ ఉన్నాయి. మిగిలిన పార్టీలు కనీసం 1 శాతం ఓట్లను పొందలేకపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరి ఆట వారిదే.. నిర్ణేత ఓటరే
[ 13-05-2024]
సిక్సర్ల లాంటి ప్రసంగాలు.. వికెట్లను గిరాటేసె బంతుల్లాంటి విమర్శలు.. ప్రచారపు పరుగులు.. ప్రత్యర్థులను అవుట్ చేసేందుకు ఎత్తుగడలు.. ఏదేమైనా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు.. ఇదంతా రాజకీయ క్రీడ.. -
కార్యకర్త.. కర్మ.. క్రియ
[ 13-05-2024]
నెలరోజులపాటు రాత్రీపగలు ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. -
పదండి ఓటేద్దాం
[ 13-05-2024]
రాజధాని నగరం ఓటుకు సిద్ధమైంది. కోటీ పది లక్షల మంది ఓటర్లు ఓటేయనున్నారు. -
నేడు వర్ష సూచన
[ 13-05-2024]
నగరంలో సోమవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
హోరాహోరీగా ఉప ఎన్నిక
[ 13-05-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్కు రంగం సిద్ధమైంది. -
ఓటుకు జై.. నోటాకు నై
[ 13-05-2024]
అవగాహన లోపంతోనే అనేక మంది లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. -
అభిమానమే కాదు.. అనుకరించండి
[ 13-05-2024]
సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు క్యూలో నిల్చొని ఓటేస్తూ ఓటు ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తున్నారు. -
బద్ధకం వదులు.. ఓటుకు కదులు
[ 13-05-2024]
సమయం వచ్చేసింది. పోలింగ్కు యావత్తు మహానగరం సిద్ధమైంది. -
ఊరెళ్లిన నగరం.. దారులన్నీ నిశ్శబ్దం
[ 13-05-2024]
తెలంగాణలో లోక్సభ, ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 13న జరుగుతున్నాయి. -
ఈ సారైనా పెరిగేనా?
[ 13-05-2024]
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి మరింత తగ్గుతోంది. -
ఎన్నికల్లో ఈసీఐల్కు ప్రత్యేక భాగస్వామ్యం
[ 13-05-2024]
ఎన్నికల ప్రక్రియలో హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కంపెనీకి ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. -
ప్రతి ఓటూ ప్రాధాన్యమైందే
[ 13-05-2024]
పార్లమెంట్ ఎన్నికలనగానే లక్షల సంఖ్యలో ఓటర్లు ఉంటారు.. నేను ఒక్కర్ని వేయకపోతే ఫలితమేమైనా తారుమారు అవుతుందా అంటుంటారు. -
పోలింగ్ రోజే.. పుట్టినరోజు
[ 13-05-2024]
పుట్టిన రోజునే ఎన్నికల పోలింగ్ జరగడం మజ్లిస్ అధినేత, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీకి అరుదైన అనుభవాన్ని కలిగించనుంది. -
తొలి ఓటు కోసం..
[ 13-05-2024]
తొలి ఓటుతో తమ తీర్పు చెప్పాలని యువత ఆశగా ఎదురు చూస్తోంది. -
మేమేశాం.. మీరూ ఓటు వేయండి
[ 13-05-2024]
పోలింగ్ బూత్కు వెళ్లలేం.. అయినా ఓటు వేయాలనే ఉత్సాహం తగ్గలేదు. ఓటు వేయడం మా బాధ్యత అని అంటున్నారు నగరంలోని వృద్ధులు. -
ఓట్లకు రూ.కోట్లు
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధుల్లో నగదు పంపిణీ చేశారు. -
ఓటరన్నా.. ఆకర్ష.. ఆకర్ష
[ 13-05-2024]
ఓటర్లను ఆకట్టుకునేందుకు జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆదివారం మధ్యాహ్నం మొదలు రాత్రంతా డబ్బులు, మద్యం పంపిణీలో తలమునకలై పోయారు. -
పోలింగ్ పర్వం.. సర్వం సిద్ధం
[ 13-05-2024]
నేటి సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
[ 13-05-2024]
జిల్లాలో నేడు జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన పకడ్బందీ బందోబస్తు చర్యలు తీసుకున్నామని, సమస్య, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా పోలీసు అధికారి కోటిరెడ్డి ఆదివారం తెలిపారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్
[ 13-05-2024]
ఎన్నికల విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. -
బాలికపై పలుమార్లు అత్యాచారం
[ 13-05-2024]
పలుమార్లు అత్యాచారానికి గురైన బాలిక ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల రక్షణశాఖ మంత్రి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
-
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్