ఓటు సమ్మేళనాలు
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో..
అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రచారం
మోతీనగర్లో సేవాభారతి ట్రస్టు సభ్యులతో సునీతా మహేందర్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. పైగా ఎండలు మండిపోతున్న తరుణంలో ఓటర్లందరినీ కలవడం కత్తిమీద సామే. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారంచుడుతున్నారు. మతపెద్దలు, సామాజిక వర్గాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీసంఘాలు, కార్మిక, ఉద్యోగ సంఘాతో సమావేశమై ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గతంలో తమ పార్టీ చేసిన పనులు, గెలిపిస్తే ఏం చేయాలనుకుంటున్నామో వివరిస్తున్నారు. అభ్యర్థులే నేరుగా హాజరవ్వడం లేదా కుటుంబసభ్యులు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యేలా చూస్తున్నారు. తెల్లవారుజామున వాకర్లతో మాటామంతితో మొదలయ్యే ఈ సమావేశాలు.. రాత్రివేళ బస్తీలు, కాలనీల్లో అందర్నీ కలిసేవరకూ కొనసాగుతున్నాయి.
కూకట్పల్లిలో కాలనీ సంఘం సమావేశంలో ఈటల రాజేందర్
అజెండా అందరి ముందు
సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే జన సమీకరణకు భారీగా ఖర్చుపెట్టాలి. మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ఓటర్లను చేరుకోవడానికి సుధీర్ఘ సమయం పడుతుంది. అదే ఫంక్షన్హాళ్లు, కమ్యూనిటీ కేంద్రాలు, కాలనీ సంఘాలతో సమావేశాలకు జనసమీకరణ అవసరముండదు. రవాణా, భోజనం వంటి ఖర్చు తగ్గుతుంది. ఎండలతో సంబంధం లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకూ సమావేశాలు నిర్వహించుకోవచ్చు. స్థానికులు తమ ప్రాంతం, స్థానిక సమస్యల్ని అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అభ్యర్థులు హామీలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ తరహా ప్రచారం ఎక్కువగా కనిపిస్తోంది. ఆత్మీయ సమావేశాలు ప్రధానంగా కొన్ని సామాజికవర్గాల ఓట్లు ఆకర్షించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం నిఘా ఉంటుందన్న ఉద్దేశంతో కొందరు అభ్యర్థులు జెండాలు, కార్యకర్తల హడావుడి లేకుండానే గుట్టుగా నిర్వహిస్తున్నారు.
విందు రాజకీయాలు!
పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, బస్తీల్లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. అభ్యర్థులు సాయంత్రం తర్వాత ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ‘అన్నీ’ చూసుకుంటున్నారు. ప్రధాన అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఎప్పటికప్పుడు సర్వేలతో విజయావకాశాలు అంచనా.. పార్టీ ఎక్కడ వెనుకబడి ఉందో సమీక్షించుకుంటున్నారు. దానికి తగ్గట్టే ప్రచారాన్ని చేస్తున్నారు. ఉదాహరణకు ఓ మల్కాజిగిరి అభ్యర్థి.. నియోజకవర్గ పరిధిలోని బస్తీలు, పేదలు ఉండే 20కిపైగా ప్రాంతాల్లో పార్టీ కొంత వెనుకంజలో ఉన్నట్లు సర్వేతో తెలుసుకొని.. ఆయా ప్రాంతాల్లో ఓటర్లను ఎక్కువగా కలిసేందుకు పర్యటనలకు శ్రీకారం చుట్టారు. స్థానిక నాయకులతో అక్కడి వారిని మచ్చికచేసుకోవడానికి తరచూ విందులు ఏర్పాటుచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప దాటి.. ఘనత చాటి
[ 15-05-2024]
రాజధానిలో ఈసారి ఎక్కువ మంది ఓటేశారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు జరుగుతుండటంతో.. ఏపీ ప్రజలంతా అక్కడికి వెళ్తారని, నగరంలో ఓటేసే వారి సంఖ్య తగ్గుతుందని అంతా అనుకున్నారు. -
ప్రాణాలు కన్నా.. ఆదాయమే మిన్నా?
[ 15-05-2024]
గాలివాన దుమారంతో సోమవారం ముంబయిలోని అనేక హోర్డింగులు, బోర్డులు, ఫ్లెక్సీలు, రేకుల నిర్మాణాలు గాలికి కొట్టుకుపోయాయి. పాత ముంబయిలోని గొటక్పర్ ప్రాంతంలో 100 అడుగుల అక్రమ హోర్డింగు అక్కడున్న పెట్రోలు బంకుపై కుప్పకూలింది. -
దొంగ ఆలోచనలకు రెక్కలు
[ 15-05-2024]
ఒకే ఒక్కడు.. 110 రోజులు.. దేశవ్యాప్తంగా దాదాపు 200 విమానాల్లో ప్రయాణం.. ఇంత బిజీగా దేశంలోని నగరాలు చుట్టేసే ఇతను ఓ దొంగ అంటే ఎవరైనా నమ్ముతారా..? కేవలం విమాన ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
తొలగిస్తాం.. నియమిస్తాం
[ 15-05-2024]
అనుమతి లేకుండా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, ఇతర పద్ధతుల్లో నియామకాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 2న అన్ని శాఖలను ఆదేశించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ఫిబ్రవరి 6న సర్కారు ఆదేశాలను గుర్తు చేస్తూ.. సర్క్యులర్ జారీ చేశారు. -
స్ట్రాంగ్గా భద్రత
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నిర్విరామంగా విధులు నిర్వహించిన ఎన్నికల అధికారులు పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలోనే మళ్లీ అప్రమత్తమయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4 జరుగనుండడంతో 3 వారాలు ఈవీఎంలను భద్రపరిచేందుకు ప్రణాళిక వేశారు. -
తెల్ల పులి మృత్యువాత
[ 15-05-2024]
హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం మృత్యువాత పడింది. తొమ్మిదేళ్లప్రాయం ఉన్న తెల్లపులి అభిమన్యుకు గతేడాది ఏప్రిల్లో ‘నెఫ్రిటీస్’ కిడ్నీ సంబంధమైన జబ్బు ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు. -
సమయాలు మార్చితే సరిపడా బస్సులు
[ 15-05-2024]
నగర శివార్లలో కోకొల్లలుగా కళాశాలలున్నాయి. అందులోని విద్యార్థులకు చాలా కళాశాలలు ప్రయాణ వసతి కల్పించవు. బస్సులను సర్దుబాటు చేయడం ఆర్టీసీకి కత్తిమీద సామే. దీంతో గంట సమయం తేడాతో మొదలుపెట్టాలని కళాశాలలను కోరుతూ ఆర్టీసీ లేఖలు రాసింది. -
స్మార్ట్గా చదివెయ్
[ 15-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకూడదనే ఉద్దేశంతో.. విద్యాశాఖ వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టింది. లిటరసీ క్లౌడ్ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ఆకర్షణీయమైన తెలుగు, ఆంగ్ల పుస్తకాలను రూమ్ టూ రీడ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. -
సైబర్ నేరాలపై కన్ను
[ 15-05-2024]
నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ ట్రేడింగ్ సలహాలిస్తామంటూ ఇటీవల వాట్సప్లో సందేశం వచ్చింది. ఆ నంబరును సంప్రదించగా సైబర్ నేరగాళ్లు అతనిని సుమారు 200 మంది ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ఎల్కేపీఎస్ఎల్ అనే యాప్ ద్వారా షేర్ల క్రయవిక్రయాలు చేయాలని సూచించగా.. బాధితుడు అలాగే చేశారు. -
వసతులు అధ్వానం.. బతుకు దుర్భరం
[ 15-05-2024]
బతుకుదెరువు నిమిత్తం తాండూరుకు వచ్చే నాపరాయి కార్మికుల జీవనం రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రీ పగలూ పని చేసినా కనీస వసతులూ కరవై బతుకు బరువై చివరకు ప్రాణాలు సైతం పణంగా పెట్టాల్సి వస్తోంది. -
సిబ్బంది సరిపోరు.. పారిశుద్ధ్యం పట్టదు
[ 15-05-2024]
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య లోపం పెరిగిపోతోంది. ఎక్కడి చెత్త అక్కడే నిలిచి గాలికి పైకిలేస్తూ, వర్షం వస్తే నీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోంది. ‘స్వచ్ఛతా పక్వాడ’ పేరుతో వారోత్సావాలు నిర్వహిస్తున్నా అవి నామమాత్రంగానే మారుతున్నాయి. -
పరిణతి చాటిన ఓటరు
[ 15-05-2024]
జిల్లాలో గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఓటర్లను ఎలాగైనా పోలింగ్ కేంద్రాలకు తెచ్చి ఓటింగ్ శాతాన్ని పెంచాలని అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. -
స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఓటింగ్ యంత్రా (ఈవీఎం)లను చేవెళ్ల మండలం గొల్లపల్లి శివారులోని బీఎస్ఐటీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. -
లెక్కలు వేస్తూ.. అంచనాకు వస్తూ..!
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారు మునిగితేలుతున్నారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం మీద 68.88 శాతం పోలింగ్ నమోదైంది. -
అభ్యర్థుల ఓటువిడుపు
[ 15-05-2024]
హమ్మయ్య.. ఎన్నికల కసరత్తు దాదాపు ముగిసింది. అసలైన పోలింగ్ తంతు సోమవారం పూర్తయింది. ఇక ఫలితాలే తరువాయి. అందుకు జూన్ 4 వరకు అంటే 20 రోజుల సమయం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో అమ్జదుల్లా ఖాన్కు గాయాలు
[ 15-05-2024]
ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్కు తీవ్ర గాయాలయ్యాయి. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువు ఒకరిని మంగళవారం ఉదయం పరామర్శించి, ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. -
ఓటరు నాడి పట్టేందుకు పోస్ట్పోల్ సర్వేలు
[ 15-05-2024]
పోలింగ్ ముగిసింది. సిటీ పరిధిలో ఒక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటూ నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్రూమ్లకు చేరింది. -
అమ్మ ప్రేమ అనిర్వచనీయం
[ 15-05-2024]
మన సంస్కృతిలో అమ్మకే తొలి ప్రాధాన్యమని విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి అన్నారు. అభినందన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. -
యశోదాలో ఉద్యోగుల వేతనాల పేరిట రూ.3.26 కోట్లు స్వాహా
[ 15-05-2024]
యశోద ఆసుపత్రి గ్రూపులో పనిచేసిన ఉద్యోగి రూ.3.26 కోట్లు పక్కదారి పట్టించాడు. ఉద్యోగులకు చెల్లించే జీతాలజాబితాలో తన కుటుంబసభ్యుల పేర్లు చేర్చి, 2021 మే నుంచి 2023 సెప్టెంబరు మధ్య ఈ మొత్తం స్వాహా చేశాడు. -
ఫెడెక్స్, ఆన్లైన్ పార్సిల్ మోసాలతో జాగ్రత్త
[ 15-05-2024]
ఫెడెక్స్ (ఫెడరల్ ఎక్స్ప్రెస్), కొరియర్, ఆన్లైన్ పార్సిల్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. బాధితులు బుక్ చేయకున్నా కేటుగాళ్లు ఫోన్లో సంప్రదించి సీబీఐ, ముంబయి పోలీసులు, కేంద్ర పోలీసు ఏజెన్సీల అధికారులమంటూ భయపెట్టి బాధితుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. -
నిజాలు మాట్లాడినందుకే నాపై అక్రమ కేసులు
[ 15-05-2024]
నిజాలు మాట్లాడినందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని హైదరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి మాధవీలత అన్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను పతకాలుగా భావిస్తానన్నారు. -
ధూళీ దుమ్ము.. తీయలేరు దమ్ము
[ 15-05-2024]
పరిమితికి మించి సూక్ష్మ ధూళి కణాల స్థాయి నమోదవుతోంది. వాహనాల పొగ, చెత్తను ఇష్టానుసారం కాల్చడం, భవన, రహదారుల నిర్మాణ కార్యకలాపాల కారణంగా కాలుష్య ఉద్గారాలు గాల్లోకి చేరుతున్నాయి. దీర్ఘకాలంలో శ్వాసకోశ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
రీఫండ్ విషయంలో వివాదం.. ట్రావోలుక్కు మొట్టికాయలు
[ 15-05-2024]
విమాన టిక్కెట్ల బుకింగ్, రీఫండ్ విషయంలో సరైన సేవలు అందించని ట్రావోలుక్ సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 మొట్టికాయలు వేసింది. విమాన టిక్కెట్ల రుసుము రూ.12,360, 12శాతం వడ్డీతో కలిపి చెల్లించడంతోపాటు రూ.5వేలు పరిహారం, రూ.2వేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. -
మూడో అంతస్తు నుంచి పడి బాలుడు దుర్మరణం
[ 15-05-2024]
బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కింద పడి దుర్మరణం చెందాడు. పేట్బషీరాబాద్ ఎస్ఐ సురేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ డివిజన్ వాజ్పేయీనగర్కు చెందిన బి.రాజు కుటుంబం స్థానిక అపార్టుమెంట్లోని మూడో అంతస్తులో నివాసం ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో