అమ్మ ప్రేమ అనిర్వచనీయం
మన సంస్కృతిలో అమ్మకే తొలి ప్రాధాన్యమని విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి అన్నారు. అభినందన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
సత్యవాణికి పురస్కారం ప్రదానం చేస్తున్న కేవీ రమణాచారి, చిత్రంలో ఓలేటి పార్వతీశం
గాంధీనగర్, న్యూస్టుడే: మన సంస్కృతిలో అమ్మకే తొలి ప్రాధాన్యమని విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి అన్నారు. అభినందన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అమ్మ ప్రేమ అనిర్వచనీయమైనదని, కొలమానం లేదని పేర్కొన్నారు. ప్రతిరోజు అమ్మను ప్రేమించడం మన సంస్కృతి అని సాహితీవేత్త ఓలేటి పార్వతీశం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణికి అభినందన భవాని మాతృమూర్తి మాదిరాజు వరలక్ష్మి పురస్కారాన్ని ప్రదానం చేసి సన్మానించారు. డి.కుసుమ, ఎం.సుగుణలను మాతృవందనం పేరిట సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖులు డీవీ మోహనకృష్ణ, కేవీ కృష్ణకుమారి, ఇ.భవాని, విజయానందకృష్ణ, వసుంధరాదేవి, ఇందిరావిజయ్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆకాశ మార్గం పుంజుకుంది వేగం
[ 29-05-2024]
నగరం నుంచి నిర్మించ తలపెట్టిన రెండు మహా రహదారుల నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) సిద్ధమవుతోంది. వీలైనంత తొందరగా పనులు ప్రారంభించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. -
రవాణా కేంద్రాలు.. దళారులు రాజ్యాలు
[ 29-05-2024]
గ్రేటర్లోని రవాణాశాఖ కార్యాలయాల వద్ద దళారుల ప్రమేయం మరోసారి తేటతెల్లమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ మంగళవారం చేపట్టిన దాడుల్లో భాగంగా గ్రేటర్లోని బండ్లగూడ, మలక్పేట్, టోలిచౌకి, మణికొండ కార్యాలయాల్లో దళారుల దందా బయట పడింది. -
కాంక్రీట్ వనం.. ఉక్కపోతతో సతమతం
[ 29-05-2024]
నగరం కాంక్రీట్ వనంలా మారడం, అవసరమైన మేర పచ్చదనం పెంచకపోవడంతో ఉక్కపోత తప్పడం లేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) వెల్లడించింది. రాత్రివేళల్లోనూ తేమశాతం తగ్గడంతో చల్లగాలికి దూరమై నగరవాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పేర్కొంది. -
కాలుష్య నియంత్రణకు కొత్త పంథా
[ 29-05-2024]
రహదారులపై వాహనాల రాకపోకలతో ఆవరించే దుమ్మూ... ధూళి.... వాహనాల పొగ.. పరిశ్రమలు వెదజల్లే రసాయనాలతో కలుషితంగా మారుతున్న గాలిని శుద్ధి చేసేందుకు గాలిశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. -
దర్జాగా.. కాలువల ఆక్రమణ
[ 29-05-2024]
హజ నీటి వనరులైన కాగ్నా నదీ ప్రవాహ కాల్వలు, పట్టణ ప్రాంతాల్లో మురుగు పారేందుకు వీలుగా ఉన్న కాలువలు కబ్జాదారుల కారణంగా కనుమరుగవుతున్నాయి. -
రాయితీ దక్కదు.. వడ్డీ వదలదు
[ 29-05-2024]
ప్రకృతి అనుకూలించక అన్నదాతలు అవస్థలు పడుతుంటే పంట రుణాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తూ అదనపు భారం మోపుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే వానాకాలం పంట రుణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. -
విపత్తు వేళ.. పెద్దన్నలా సేవ
[ 29-05-2024]
రాజధానిలో ఎక్కడ, ఎలాంటి ప్రమాదం జరిగినా.. ముందుగా అక్కడికి చేరుకునేది జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్(విపత్తు స్పందన దళం) బృందాలే. జీహెచ్ఎంసీలో భాగమైన ఈవీడీఎం (ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) కింద 2018లో ఏర్పాటై.. ఆది నుంచే నగరవాసులకు నేనున్నానంటూ భరోసా ఇస్తోంది డీఆర్ఎఫ్. -
విశ్వ విఖ్యాత.. అందుకో జోత
[ 29-05-2024]
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఎన్టీఆర్ గార్డెన్స్లోని ఆయన సమాధి వద్ద నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ నివాళులర్పించారు. -
కూరగాయల కొరత ధరల మోత
[ 29-05-2024]
అకాల వర్షాలు.. రబీ-ఖరీఫ్ అంతరంతో కూరగాయల సాగు తగ్గిపోయింది. ఇదే అదనుగా ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.ముందస్తు ప్రణాళికలు ఉన్నా ఆచరణలో విఫలం కావడంతో ప్రజల నడ్డి విరిచేలా భారం పెరుగుతోంది. మొన్నటి దాకా రూ.వందకు 6 కేజీల టమాటా దొరికేది. -
సెల్లార్లలో స్క్రాప్తో అగ్నిగండమే
[ 29-05-2024]
సెల్లార్లలోనే స్క్రాప్ అంతా పడేశారా? ఏళ్లుగా అదంతా అక్కడే పడి ఉందా? వెంటనే తొలగించండి. లేదంటే నిప్పు రాజుకోవడానికి ఎంతో సమయం పట్టదు. సెల్లార్లు, మెట్లకు అడ్డుగా ఫర్నీచర్ వ్యర్థాలు పడేయడంతో ప్రమాదాలు జరిగితే బాధితులు తప్పించుకునే వీలుండదని అగ్నిమాపకశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
సీఎన్జీ కోసం బంకు ముందు బారులు
[ 29-05-2024]
సీఎన్జీ కోసం వాహనదారులు పడిగాపులు పడుతున్నారు. బంకుకు వెళ్లినప్పుడల్లా వాహనాలు బారులు తీరుతుండటంతో ప్రతిసారీ రెండు నుంచి మూడు గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. కాలుష్య నియంత్రణ, మైలేజీ, పెట్రోల్తో పోల్చితే ధర కాస్త తక్కువ అని వాహనాలు కొనుగోలు చేస్తుంటే ఇంధనం కోసం పాట్లు తప్పడం లేదు. -
బిల్డర్ హత్య వెనుక ఆ ముగ్గురు
[ 29-05-2024]
కర్ణాటకలోని బీదర్లో హైదరాబాద్ బిల్డర్ మధు దారుణ హత్యలో తెలిసిన వ్యక్తుల ప్రమేయముందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఆర్థిక లావాదేవీలు, పాత కక్షల నేపథ్యంలో జీడిమెట్లలోని చింతల్ ప్రాంతానికి చెందిన రేణుక ప్రసాద్(32), వరుణ్, లిఖిత్ సిద్దార్థరెడ్డి ప్రమేయంతో హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. -
ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా బసవతారకం ఆస్పత్రి సేవలు
[ 29-05-2024]
మాజీ సీఎం , దివంగత ఎన్టీరామారావు 101వ జయంతి వేడుకలు మంగళవారం బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఘనంగా జరిగాయి. బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించారు. -
అరుదైన తాబేళ్ల ఫొటోలతో అంతర్జాతీయ అవార్డు
[ 29-05-2024]
హైదరాబాద్కు చెందిన ఫొటోగ్రాఫర్ సతీశ్లాల్ అందేకార్ ప్రతిష్ఠాత్మక రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ నుంచి అసోసియేట్ హానర్ పురస్కారాన్ని అందుకున్నారు. -
ఆస్తి పన్ను వసూళ్లు.. పుర ఉద్యోగులకు బాధ్యత
[ 29-05-2024]
జిల్లాలో నాలుగు పురపాలిక సంఘాలున్నాయి. వీటి పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లను రెగ్యులర్ ఉద్యోగులతో వసూలు చేయించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల వసూళ్లలో అక్రమాలకు చెక్ పడుతుందనేది ప్రభుత్వ యోచన. -
వీధి కుక్క దాడి.. తండ్రీకొడుకులకు గాయాలు
[ 29-05-2024]
నాలుగేళ్ల బాలుడు, అతడి తండ్రిపై వీధి కుక్కదాడి చేసిన ఘటనలో ఇద్దరికీ ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పరిగి పురపాలక పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. -
కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ గుర్తింపు
[ 29-05-2024]
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ కోర్సులు అభ్యసించే విద్యార్థుల కోసం నిర్దిష్టమైన ప్రమాణాలు పాటిస్తున్న విద్యాసంస్థలను స్టడీ అబ్రాడ్ ఎయిడ్ సంస్థ ఈ ఏడాది ఎంపిక చేసింది. -
అప్పుల బాధతో ఇద్దరి బలవన్మరణం
[ 29-05-2024]
అప్పుల బాధలు భరించలేక వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడిపల్లి ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. -
అయోమయంలో.. వర్షాకాల సన్నద్ధత
[ 29-05-2024]
వర్షాకాలం సమీపిస్తోంది... ఆ సీజన్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంనేందుకు సన్నద్ధత మాత్రం పూర్తవలేదు. డివిజన్లవారీగా వర్షాకాల అత్యవసర బృందాల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ టెండర్లు పిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
నమ్మించి.. బురిడీ కొట్టించి.. బ్యాంకులో బంగారం మాయం చేసిన అప్రైజర్ లీలలెన్నో..
-
పోలవరం మీదుగా విస్తృత జలరవాణా.. అందుకు అనుగుణంగా ప్రాజెక్టులో కొన్ని మార్పులు
-
ప్రియురాలి తీరుతో మనస్తాపం.. యువకుడి ఆత్మహత్య
-
పెంచిన బంధం.. కన్నీటి సంద్రం
-
అధ్వాన రహదారితో అంబులెన్సుకు ప్రమాదం
-
పెళ్లి జరిగిన సంప్రదాయం ప్రకారమే విడాకులు