రాజాసింగ్.. రాస్తా అలగ్: ప్రచారానికి దూరంగా భాజపా ఎమ్మెల్యే
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కొద్దిమంది నేతలు ఆయనకు చెప్పినా అబ్బే...నా దారి ఇంతే అంటున్నారు. ఆయన ఎవరో కాదు...గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్.
కంటిలో నలుసులా..
పార్టీ సీనియర్ నేతల మాటల్లో చెప్పాలంటే రాజాసింగ్ భాజపాకు కంటిలో నలుసులా మారారు. ఈ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజధానిలో ఒకప్పుడు మాజీ ఎంపీ ఆలె నరేంద్ర హిందుత్వానికి ప్రతినిధిగా ఉండేవారు. ఆయన చనిపోయిన తరువాత ఆ స్థానాన్ని రాజాసింగ్ భర్తీ చేశారనే చెప్పొచ్చు. రాజధానిలో కొన్నిసార్లు భాజపా పరువును నిలబెట్టిందీ ఆయనే. 2018, 23 ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని మొత్తం 29 శాసనసభ స్థానాల్లో ఆయనొక్కరే కమలం పార్టీ నుంచి గెలిచారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం పార్టీలోని కొద్దిమంది సీనియర్ల వైఖరిపై మండిపడుతున్నారు. సుమారు రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సహాయ నిరాకరణ చేస్తున్నారు.
కీలక సమయంలో..
కీలకమైన లోక్సభ ఎన్నికల సమయంలో సొంత నియోజకవర్గం గోషామహల్ పరిధిలోనూ ఆ పార్టీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఇప్పటివరకు ప్రచారం చేయలేదు. ప్రధానంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డికి ఆయనకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు ముందుగా తనకు చెప్పడం లేదని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2018లో ఆయనొక్కరే భాజపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో శాసనసభ పక్షనేతగా ఉన్నారు. మధ్యలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్, రఘునందన్రావు గెలిచినా ఆయనే కొనసాగారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నగరం నుంచి రాజాసింగ్తో పాటు రాష్ట్రంలో ఎనిమిది మంది విజయం సాధించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మరోసారి భాజపా శాసనసభ పక్షనేతగా ఇవ్వాలని కోరినా పార్టీ అంగీకరించలేదు. భాష మీద పట్టుతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం ఆ అవకాశాన్ని ఏలేటి మహేశ్వర్రెడ్డికి ఇచ్చింది. మిగిలిన కొన్ని పదవులను ఇతరులకు ఇచ్చారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ఎంపిక చేసినపుడూ ఆయనకు ముందుగా సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. ఇతర అభ్యర్థుల విషయంలోనూ అతని అభిప్రాయం తీసుకోలేదు. ఈ కారణంగా రాష్ట్ర పార్టీలోని కొందరు అగ్రనేతలపై మండిపడుతున్నారు.
దూరం పెడుతున్నారని...
ఇటీవల హైదరాబాద్కు అమిత్షాతో పాటు ఇతర పార్టీ పెద్దలు వచ్చినా ఆయన వారిని కలవలేదు. ముఖ్యంగా కిషన్రెడ్డి పేరు చెబితేనే రాజాసింగ్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తనను పార్టీ నుంచి దూరం చేయడానికి ఆయనతో పాటు మరికొందరు ప్రయత్నిస్తున్నారనే అసంతృప్తితో ఉన్నారని అతని అనుచురులు చెబుతున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్రెడ్డి గెలవాలంటే రాజాసింగ్ తోడ్పాటు చాలా అవసరమని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర నేతలతో చెప్పించి ఆయన్ను సికింద్రాబాద్ పరిధిలో పర్యటించేలా ఒప్పించాలని కోరుతున్నారు. హైదరాబాద్ పరిధిలోనూ రాజాసింగ్ గట్టి ప్రభావాన్ని చూపిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరి ఆట వారిదే.. నిర్ణేత ఓటరే
[ 13-05-2024]
సిక్సర్ల లాంటి ప్రసంగాలు.. వికెట్లను గిరాటేసె బంతుల్లాంటి విమర్శలు.. ప్రచారపు పరుగులు.. ప్రత్యర్థులను అవుట్ చేసేందుకు ఎత్తుగడలు.. ఏదేమైనా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు.. ఇదంతా రాజకీయ క్రీడ.. -
కార్యకర్త.. కర్మ.. క్రియ
[ 13-05-2024]
నెలరోజులపాటు రాత్రీపగలు ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. -
పదండి ఓటేద్దాం
[ 13-05-2024]
రాజధాని నగరం ఓటుకు సిద్ధమైంది. కోటీ పది లక్షల మంది ఓటర్లు ఓటేయనున్నారు. -
నేడు వర్ష సూచన
[ 13-05-2024]
నగరంలో సోమవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
హోరాహోరీగా ఉప ఎన్నిక
[ 13-05-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్కు రంగం సిద్ధమైంది. -
ఓటుకు జై.. నోటాకు నై
[ 13-05-2024]
అవగాహన లోపంతోనే అనేక మంది లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. -
అభిమానమే కాదు.. అనుకరించండి
[ 13-05-2024]
సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు క్యూలో నిల్చొని ఓటేస్తూ ఓటు ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తున్నారు. -
బద్ధకం వదులు.. ఓటుకు కదులు
[ 13-05-2024]
సమయం వచ్చేసింది. పోలింగ్కు యావత్తు మహానగరం సిద్ధమైంది. -
ఊరెళ్లిన నగరం.. దారులన్నీ నిశ్శబ్దం
[ 13-05-2024]
తెలంగాణలో లోక్సభ, ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 13న జరుగుతున్నాయి. -
ఈ సారైనా పెరిగేనా?
[ 13-05-2024]
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి మరింత తగ్గుతోంది. -
ఎన్నికల్లో ఈసీఐల్కు ప్రత్యేక భాగస్వామ్యం
[ 13-05-2024]
ఎన్నికల ప్రక్రియలో హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కంపెనీకి ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. -
ప్రతి ఓటూ ప్రాధాన్యమైందే
[ 13-05-2024]
పార్లమెంట్ ఎన్నికలనగానే లక్షల సంఖ్యలో ఓటర్లు ఉంటారు.. నేను ఒక్కర్ని వేయకపోతే ఫలితమేమైనా తారుమారు అవుతుందా అంటుంటారు. -
పోలింగ్ రోజే.. పుట్టినరోజు
[ 13-05-2024]
పుట్టిన రోజునే ఎన్నికల పోలింగ్ జరగడం మజ్లిస్ అధినేత, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీకి అరుదైన అనుభవాన్ని కలిగించనుంది. -
తొలి ఓటు కోసం..
[ 13-05-2024]
తొలి ఓటుతో తమ తీర్పు చెప్పాలని యువత ఆశగా ఎదురు చూస్తోంది. -
మేమేశాం.. మీరూ ఓటు వేయండి
[ 13-05-2024]
పోలింగ్ బూత్కు వెళ్లలేం.. అయినా ఓటు వేయాలనే ఉత్సాహం తగ్గలేదు. ఓటు వేయడం మా బాధ్యత అని అంటున్నారు నగరంలోని వృద్ధులు. -
ఓట్లకు రూ.కోట్లు
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధుల్లో నగదు పంపిణీ చేశారు. -
ఓటరన్నా.. ఆకర్ష.. ఆకర్ష
[ 13-05-2024]
ఓటర్లను ఆకట్టుకునేందుకు జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆదివారం మధ్యాహ్నం మొదలు రాత్రంతా డబ్బులు, మద్యం పంపిణీలో తలమునకలై పోయారు. -
పోలింగ్ పర్వం.. సర్వం సిద్ధం
[ 13-05-2024]
నేటి సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
[ 13-05-2024]
జిల్లాలో నేడు జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన పకడ్బందీ బందోబస్తు చర్యలు తీసుకున్నామని, సమస్య, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా పోలీసు అధికారి కోటిరెడ్డి ఆదివారం తెలిపారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్
[ 13-05-2024]
ఎన్నికల విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. -
బాలికపై పలుమార్లు అత్యాచారం
[ 13-05-2024]
పలుమార్లు అత్యాచారానికి గురైన బాలిక ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల రక్షణశాఖ మంత్రి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
-
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్