ఎన్నికల వేళ... పెరగని మద్యం అమ్మకాలు
ఎన్నికలు అనగానే పోటీలో ఉన్న అభ్యర్థులు మద్యం పంపిణీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం చూపలేదు.
ముమ్మర తనిఖీల ఫలితం
న్యూస్టుడే, సిరిసిల్ల కలెక్టరేట్ : ఎన్నికలు అనగానే పోటీలో ఉన్న అభ్యర్థులు మద్యం పంపిణీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం చూపలేదు. ఇందుకు ఆబ్కారీశాఖ చెబుతున్న లెక్కలే నిదర్శనం. పార్లమెంటు ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో ఆబ్కారీశాఖ అధికారులు బెల్టుషాపులు మూసివేయించారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేస్తున్నారు. వీటి ఫలితంగా విక్రయాలు తగ్గాయని చెబుతున్నారు.
జిల్లాలో 48 మద్యం దుకాణాలు, 8 బార్లు ఉన్నాయి. వీటిపై ఆబ్కారీశాఖ అధికారులు నిఘా పెట్టడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న వారితోపాటు నిల్వ ఉంచిన మద్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. తనిఖీల్లో మద్యంతో పాటు సారా, బెల్లం స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీల్లో రూ.22,699 విలువైన మందు పట్టుకున్నారు. ఇప్పటి వరకు 136 కేసులు నమోదు చేశారు.
5 బాటిళ్ల మద్యం, ఆరు బీర్ల వరకు అనుమతి
శుభకార్యాలు, పండగల సందర్భంలో ఒక వ్యక్తి 5 మద్యం బాటిళ్లు, ఆరు బీర్లు తీసుకుపోవడానికి అనుమతి ఉంటుంది. మద్యాన్ని తరలించేప్పుడు అధికారులకు పట్టుబడితే దానికి సరైనా ఆధారాలు చూపించాలి. శుభకార్యాల పేరుతో ఇంటికి తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు తెలిస్తే కేసులు నమోదు చేస్తారు.
ప్రభావం చూపని ఎన్నికలు
ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలా అమ్మకాలు మామూలుగానే కొనసాగుతున్నాయి. వేసవి తీవ్రత నేపథ్యంలో ఎక్కువగా బీర్లకే మద్యం ప్రియులు మొగ్గుచూపుతున్నారు. ఓవైపు బీర్ల వినియోగం పెరగగా, మరోవైపు వాటి సరఫరా తక్కువగా ఉంది. దీంతో స్టాకు వచ్చిన వెంటనే అమ్ముడు పోతున్నాయి. వాటిని చల్లబరిచే వరకు కూడా వినియోగదారులు ఆగడం లేదని విక్రయదారులు చెబుతున్నారు.
136 కేసులు నమోదు
జిల్లాలోని మూడు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు బెల్టుషాపుల్లో మద్యం అమ్మేవారితో పాటు గుడుంబా తయారీదారులపై మొత్తం 136 కేసులు నమోదు చేశాం. అక్రమంగా మద్యం తరలిస్తుండటంతో రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశాం. ఎవరైనా మద్యం నిల్వ ఉంచినట్లు తెలిస్తే ఎక్సైజ్శాఖకు సమాచారం అందించాలి. 48 మద్యం దుకాణాల్లో విక్రయాలపై నిఘా కొనసాగిస్తున్నాం.
పంచాక్షరి, జిల్లా ఆబ్కారీ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ష్.. ఇక నిశ్శబ్దం!
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. మైకులు మూగబోయాయి.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పార్టీలు ఇన్నాళ్ల ప్రచార సందడిని ఉన్నపళంగా నిలిపివేశాయి. శ -
భారీ మెజార్టీతో భాజపాదే విజయం
[ 12-05-2024]
‘కేసీఆర్.. నీకు శ్రీరాముడి గురించి ఏమి తెలుసు? ముస్లిం ఓట్లే కావాలా? హిందువుల ఓట్లు వద్దా? గతంలోనూ హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే సంజయన్న ఏమి చేసిండో తెలుసు కదా..’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
లక్ష మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు ఖాయం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలలో కరీంనగర్ స్థానంలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును లక్ష ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. -
మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి : కేటీఆర్
[ 12-05-2024]
‘పదేళ్లలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం ఆగమైపోయింది.. కాంగ్రెస్, భాజపా మాటలకు మోసపోతే గోసపడతారని కేసీఆర్ ఆనాడే చెప్పారు.. -
పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
[ 12-05-2024]
ఈనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి వెల్లడించారు. -
విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులుండొద్దు
[ 12-05-2024]
పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ వరంగల్ సీజీఎం చౌహాన్ అధికారులను ఆదేశించారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి
[ 12-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి
[ 12-05-2024]
వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ షేక్యాస్మిన్బాషా అన్నారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులు విత్తనాలు, -
పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం
[ 12-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సామగ్రి, ఓటింగ్ యంత్రాల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, -
పోలింగ్ సిబ్బంది మూడో దశ యాదృచ్ఛికీకరణ పూర్తి
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది మూడో దశ యాదృచ్ఛికీకరణ పూర్తి చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. సమీకృత పాలనా ప్రాంగణంలో శనివారం ఆన్లైన్లో ర్యాండమైజేషన్ చేపట్టారు. -
ముగిసిన ఈఏపీసెట్
[ 12-05-2024]
సెంటినరీకాలనీలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీసెట్) ప్రవేశ పరీక్షలు శనివారం ముగిశాయి. అయిదు రోజులుగా పరీక్షలు జరుగుతున్నాయి. -
స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
[ 12-05-2024]
ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. -
భద్రత కట్టుదిట్టం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లాకు భారీగా పోలీసు బలగాలను రప్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
ఓటింగ్ శాతాన్ని పకడ్బందీగా నమోదు చేయాలి
[ 12-05-2024]
ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. -
ఇరువురి వాదనలపై ఆర్డీవోకు నివేదిక
[ 12-05-2024]
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఫిర్యాదు మేరకు శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన విచారణకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున న్యాయవాదులు హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
-
మీకు ఇంకా ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా చేయండి!
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
-
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
-
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
-
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు