మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి : కేటీఆర్
‘పదేళ్లలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం ఆగమైపోయింది.. కాంగ్రెస్, భాజపా మాటలకు మోసపోతే గోసపడతారని కేసీఆర్ ఆనాడే చెప్పారు..
హుజూరాబాద్ రోడ్షోలో ప్రసంగిస్తున్న కేటీఆర్, పక్కన భారాస అభ్యర్థి వినోద్కుమార్, ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి
రాంపూర్ (కరీంనగర్), హుజూరాబాద్, న్యూస్టుడే: ‘పదేళ్లలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం ఆగమైపోయింది.. కాంగ్రెస్, భాజపా మాటలకు మోసపోతే గోసపడతారని కేసీఆర్ ఆనాడే చెప్పారు.. ఇప్పుడు 150 రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింద’ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్కు మద్దతుగా శనివారం హుజూరాబాద్లో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. రైతు భరోసా కింద రూ.15 వేలు, మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేల పింఛను, ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ అయిదేళ్లలో మీరెప్పుడైనా చూశారా? అని అడిగారు. అదే వినోద్కుమార్ ప్రజాసమస్యలపై లోక్సభలో గళం విప్పారని వివరించారు. కరీంనగర్ లోక్సభ భారాస అభ్యర్థి బి.వినోద్కుమార్ మాట్లాడుతూ బండి సంజయ్కు మత విద్వేషాలు తప్ప అభివృద్ధి చేయడం, ప్రజలను గౌరవించడం తెలియదన్నారు. పదేళ్లుగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందని, జూన్ 2న గడువు ముగిసిపోతుండటంతో మళ్లీ రాజధానిగా కొనసాగించేందుకు లోక్సభలో కొట్లాడాల్సిన అవసరముందని.. అందుకే 10-12 భారాస ఎంపీలను గెలిస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, భారాస నాయకులు నారదాసు లక్ష్మణ్రావు, గెల్లు శ్రీనివాస్యాదవ్, బండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ రోడ్షోలో కేటీఆర్ ప్రసంగిస్తుండగా పార్టీ శ్రేణులు జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు.
ప్రజా స్పందనతో మాదే విజయం
భారాసకు వస్తున్న ప్రజా స్పందనతో తాను భారీ మెజారిటీతో గెలుస్తున్నట్లు ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అయిదు నెలల పాలనలో కరెంటు కోతలు, సాగునీటి కొరత నెలకొందని, అందుకే ప్రజల్లో కేసీఆర్ మళ్లీ రావాలనే ఆకాంక్ష మొదలైందన్నారు. ఎంపీగా సంజయ్ పార్టీ సమావేశల్లోనే మోదీని కలిశారే తప్ప, అభివృద్ధికి నిధులివ్వాలని ఏనాడూ ఆయనను అడగకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అభివృద్ధి మరింత జరగాలంటే వినోద్కుమార్ను గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, మేయర్ వై.సునీల్రావు, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ, పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు జి.వి.రామకృష్ణారావు, చల్ల హరిశంకర్, రూప్సింగ్, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు రవీందర్సింగ్, శ్రీనివాస్, అక్బర్, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొదుపు చేద్దాం.. గృహజ్యోతిని వెలిగిద్దాం
[ 23-05-2024]
నగరానికి చెందిన గౌతం కుటుంబం ఏప్రిల్లో 202 యూనిట్ల విద్యుత్తును వినియోగించుకోవడంతో గృహజ్యోతి పథకం వర్తించలేదు. దీంతో రూ.1100లకు పైగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. -
వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం
[ 23-05-2024]
వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేరుకోవడానికి సింగరేణి సంస్థ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. దేశంలో బొగ్గు అవసరాలు పెరిగే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు చేసుకుంటోంది. -
డివిజన్ కేంద్రం.. సేవలు జాప్యం
[ 23-05-2024]
మంథని డివిజన్ కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో పూర్తి స్థాయిలో సేవలందడం లేదు. -
నకిలీ దందాపై ఉక్కుపాదం
[ 23-05-2024]
మరో మూడు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనుండటంతో వానాకాలం పంటల సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం
[ 23-05-2024]
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధిత జిల్లా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 24 నుంచి 31 తేదీ వరకు జిల్లాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. -
అనుమతి పత్రంతో అడ్డగోలు తరలింపు
[ 23-05-2024]
పంట పొలాలకు చెరువుల నుంచి మట్టిని తరలించేందుకు ఇచ్చే అనుమతికి కూడా పరిమితి ఉంటుంది. నిర్ణీత పరిమాణం మేరకు ఎలాంటి వేబిల్లు అవసరం లేకుండా కేవలం అనుమతి పత్రాన్ని వెంట తీసుకెళ్తే సరిపోతుంది. -
పూడిక తొలగేనా..?
[ 23-05-2024]
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన వరదకాలువలు ఉండగా ఏటా వర్షాకాలం రాకముందే పూడికతీత పనులు చేయిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా పూడిక, చెత్తాచెదారం తొలగించడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. -
ఏటా ముప్పు.. ఏదీ కనువిప్పు
[ 23-05-2024]
జిల్లాలోనే రెండో అతి పెద్ద పట్టణం కోరుట్లలో ఏటా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడంలో పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. -
నిద్రపోతున్న నిఘా.. చోరుల హల్చల్
[ 23-05-2024]
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఉన్నతాధికారులు తరచూ సమావేశాల్లో చెబుతుంటారు. నేరాల అదుపులో సీసీ కెమెరాల పాత్ర ప్రధానమైనది. -
ఆధునికీకరణే అసలైన మందు
[ 23-05-2024]
రాష్ట్రంలోని మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసేలోగా వీటి విధి విధానాలు వెల్లడించనుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సన్నద్ధం
[ 23-05-2024]
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో బ్యాంకు అధికారులు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు. -
తనిఖీల్లో పట్టుకున్న డబ్బుల అప్పగింత
[ 23-05-2024]
లోక్సభ ఎన్నికల పోరు ముగిసింది. ఎన్నికల సమయంలో జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువులేవీ తరలించకుండా, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలించకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. -
భక్తులకు కల్యాణ కష్టం
[ 23-05-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులు కోడె మొక్కులతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. -
మృతి చెందితే రూ.2 లక్షలు.. గాయపడితే రూ.50 వేలు
[ 23-05-2024]
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని వాహనాల ఆచూకీ లభ్యం అవుతుండగా.. మరికొన్ని ఆచూకీ లభించటంలేదు. -
చెట్టును ఢీకొన్న కారు.. తండ్రీకుమారుల దుర్మరణం
[ 23-05-2024]
కారు చెట్టును ఢీకొట్టడంతో తండ్రీ కుమారులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లిలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. -
జాతీయ శిబిరం.. భవితకు వరం
[ 23-05-2024]
సమాజ సేవే పరమార్థంగా.. ఉన్నత అవకాశాలే లక్ష్యంగా యువ సైనిక దళంలో విద్యార్థినులు భాగస్వాములవుతున్నారు. కేవలం చదువులకే పరిమితం కాకుండా తమ సత్తా ఏమిటో నేటి ప్రపంచానికి చాటి చెబుతామని అంటున్నారు. -
కొమురవెల్లి ఎస్సై సస్పెన్షన్
[ 23-05-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు సస్పెండ్ అయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి లొంగిపోతారని ప్రచారం.. నరసరావుపేటలో పోలీసుల పహారా
-
గూగుల్పేలో బై నౌ పే లేటర్.. కార్డు వివరాలు మరింత సేఫ్
-
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలోకి అదానీ ఎంటర్ప్రైజెస్?
-
తెలంగాణ జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు
-
పిన్నెల్లిని త్వరలోనే అరెస్టు చేసి తీరుతాం: సీఈవో ఎంకే మీనా
-
మహిళా సైనికులపై చిత్రహింసలు.. వెలుగులోకి హమాస్ ఉగ్రవాదుల క్రూరత్వం!