అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సిద్ధం
నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు.. ఓటర్ల మన్ననలు పొందేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ప్రణాళికలు రూపొందించుకున్న పార్టీలు
ఈనాడు, కరీంనగర్ : నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు.. ఓటర్ల మన్ననలు పొందేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు.. పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను సంధిస్తున్నారు.. కొన్ని రోజులే సమయం ఉండటంతో వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారాలు, సభలు, సమావేశాలతో క్యాడర్లో జోష్ పెంచడంతోపాటు ఓటర్లలో తమ ముద్ర వేయడంపై దృష్టి పెడుతున్నారు..
ఇంటింటి ప్రచారాలతో భాజపా
పోలింగ్ బూత్ల వారీగా ఉన్న శక్తి కేంద్రాల బాధ్యులతో భాజపా ముఖ్య నాయకులు ప్రతి నిత్యం ఫోన్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్లలో ఇప్పటికే ఈ కేంద్రాల బాధ్యులతో పలుమార్లు సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ప్రతి 50 మంది ఓటర్లను కలిసి వారికి కరపత్రాలను ఏక కాలంలో అందించే కార్యాచరణను కరీంనగర్లో అమలు చేశారు. పెద్దపల్లిలో మండలాల వారీగా పార్టీ అధ్యక్షులు ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అభ్యర్థి పాల్గొనే ప్రచార షెడ్యూల్ను మూడు స్థానాల పరిధిలో ఖరారు చేశారు. యువ మోర్చా, మహిళా మోర్చా, ఎస్సీ, ఎస్టీ, కిసాన్ మోర్చాలకు ఆయా నియోజకవర్గాల వారీగా సమావేశాల బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ప్రధాని మోదీ జగిత్యాల బహిరంగ సభలో పాల్గొని ప్రచార శంఖం పూరించారు.. కరీంనగర్లో సంజయ్ నామినేషన్కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయి పటేల్, నిజామాబాద్లో అర్వింద్ నామపత్రాల దాఖలుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హాజరయ్యారు. మే నెలలో కేంద్ర మంత్రుల పర్యటనలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలను పార్టీ జాతీయ నాయకత్వానికి పంపించారు. కరీంనగర్, పెద్దపల్లిల్లో మోదీ లేదా అమిత్షా బహిరంగ సభల నిర్వహిస్తే మేలనే భావనతో అభ్యర్థులున్నారు.
రోడ్ షోలు.. భారీ సభలు
కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలు, కార్నర్ సమావేశాలతోపాటు సీఎం రేవంత్ సభలతో ప్రచారంలో దూసుకెళ్లడంపై దృష్టి పెట్టింది. కరీంనగర్ స్థానంలో అభ్యర్థి ఖరారు ఆలస్యం కావడంతో కాంగ్రెస్ పార్టీ అన్ని మండల కేంద్రాల్లో రోడ్ షోలు లేదా జన సమీకరణతో కార్నర్ సమావేశాల్ని నిర్వహించేందుకు షెడ్యూల్ను ఖరారు చేసింది. రోజుకు నాలుగు మండలాల్లో పర్యటనలకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. పెద్దపల్లిలో ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాల్ని ఏర్పాటు చేయగా.. త్వరలో మహిళలు, యువతతో ప్రత్యేక భేటీలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇంటింటి ప్రచార బాధ్యతల్ని ఎక్కడికక్కడే మండలాల నాయకులకు అప్పగిస్తున్నారు. మ్యానిఫెస్టోపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేయిస్తున్నారు. ఈ నెల 22న నిజామాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డికి మద్దతుగా సభలో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 30, మే 1, 3వ తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. 30న జమ్మికుంటలో కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు మద్దతుగా నిర్వహించే సభకు, మే 1న నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధి కోరుట్లలో, మే 3న పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధి ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా నిర్వహించే సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఏఐసీసీ నాయకులు, ఇతర ముఖ్య నేతలను ప్రచారానికి రప్పించనున్నారు.
కేసీఆర్ బస్సు యాత్రపై ఆశలు
కేసీఆర్ బస్సు యాత్రతోపాటు కేటీఆర్, హరీశ్ల రోడ్షోలపై భారాస అభ్యర్థులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడానికి కేసీఆర్ పర్యటన కీలకమని ఈ పార్టీ అభ్యర్థులు భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మే 2న కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మద్దతుగా జమ్మికుంటలో రోడ్షో నిర్వహించనున్నారు. 3వ తేదీన రామగుండంలో రోడ్ షో నిర్వహించి పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు గెలిపించమని కోరనున్నారు. 5వ తేదీన జగిత్యాలలో రోడ్షో నిర్వహించి నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఈ రోడ్షోలుంటాయి. మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్రావుల రోడ్షోలను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మూడు చోట్ల నిర్వహించడానికి ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. ఆయా లోక్సభ స్థానాలకు కన్వీనర్లుగా ఉన్న నాయకుల లోటుపాట్లు గమనిస్తూ పార్టీ కార్యక్రమాల తీరుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదిగిదిగో నవ లోకం
[ 11-05-2024]
ఉమ్మడి జిల్లాలో యువ రక్తం ఉరకలేస్తోంది.. ఆకాశమే హద్దంటూ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది.. యువ ఓటర్లు దేశ భవితకు దిశా నిర్దేశం చేస్తున్నారు.. -
గులాబీ శ్రేణుల్లో జోష్
[ 11-05-2024]
సిరిసిల్ల పట్టణంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
గడప గడపకు కార్యకర్తలు
[ 11-05-2024]
ప్రధాన పార్టీల ముఖ్య నేతల ప్రచారాలు ముగిశాయి.. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది.. పోలింగ్కు మధ్యలో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది.. -
దూరమైనా తప్పక ఓటేస్తాం!
[ 11-05-2024]
ఇప్పటికీ అనేక అనుబంధ గ్రామాలకు పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్నాయి. 200 మంది ఓటర్లకుపైగా ఉన్నా.. రెండు కిలోమీటర్లకుపైగా వెళ్లాల్సి వస్తోంది. -
రూ.20.93 లక్షల నగదు పట్టివేత
[ 11-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.20.93 లక్షల నగదును పట్టుకొని, సీజ్ చేసి ఎన్నికల పరిశీలన అధికారులకు అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 11-05-2024]
వ్యవసాయ బావిలో పడి యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్ పట్టణ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. -
కొట్లాడి అలసిపోయా
[ 11-05-2024]
అందుబాటులో ఉండి సేవలందించినా ఓడగొట్టారు, ఎన్నికల్లో కొట్లాడి కొట్లాడి అలసిపోయా ఇక ఓపిక లేదంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. -
‘ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్ద్దు’
[ 11-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి సాగు నీరందిస్తాం
[ 11-05-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రధానమైన సాగునీటి సమస్య పరిష్కారం కోసం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసి, కాలువ చివరి ఆయకట్టు వరకు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 11-05-2024]
రైతులకు రైతుబంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా దగా చేసిన కాంగ్రెస్కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి భారాస ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ పేర్కొన్నారు. -
భాజపాతోనే అభివృద్ధి సాధ్యం
[ 11-05-2024]
ప్రజలకు ఉచిత హామీల ఆశచూపి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని, భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి లోక్సభ భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ అన్నారు. -
కోల్బెల్టు కేంద్రంగా అభ్యర్థుల వ్యూహాలు
[ 11-05-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి కోల్బెల్టు ప్రాంతాలు ప్రచార కేంద్రాలుగా మారాయి. అభ్యర్థులు తమ వ్యూహాలను ఇక్కడి నుంచే రచిస్తున్నారు. -
గెలుపే ఎజెండా.. కునుకు లేకుండా..
[ 11-05-2024]
ప్రచారం చివరి రోజుకు వచ్చేసింది.. సభలు.. సమావేశాలు.. చేరికలతో తీరిక లేకుండా గడుపుతున్న అభ్యర్థులు.. ముఖ్య నాయకులకు కంటిమీద కునుకు కరవైంది..
తాజా వార్తలు (Latest News)
-
కడపలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
-
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
-
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి