రూ.121.90 కోట్లతో జిల్లా న్యాయ భవనం సిద్ధం
బళ్లారి నగరం తాళూరు రహదారిలోని విశాలమైన ప్రదేశంలో జిల్లా న్యాయస్థానం నూతన భవనం సిద్ధమైంది. ఈ నెల 26న ముఖ్యమంత్రితో పాటు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బళ్లారి నగర నడిబొడ్డున కోర్టు భవనం నిర్వహిస్తున్నారు. సమీపంలో రైల్వేట్రాక్తో పాటు, భవనం ఇరుకుగా ఉంది.
మొత్తం 20 న్యాయస్థానాలు
26న సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతులమీదుగా ప్రారంభం
నూతనంగా నిర్మించిన జిల్లా న్యాయస్థానం భవనం
బళ్లారి, న్యూస్టుడే: బళ్లారి నగరం తాళూరు రహదారిలోని విశాలమైన ప్రదేశంలో జిల్లా న్యాయస్థానం నూతన భవనం సిద్ధమైంది. ఈ నెల 26న ముఖ్యమంత్రితో పాటు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బళ్లారి నగర నడిబొడ్డున కోర్టు భవనం నిర్వహిస్తున్నారు. సమీపంలో రైల్వేట్రాక్తో పాటు, భవనం ఇరుకుగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2017 నవంబరు 21న తాళూరు రహదారిలోని న్యాయమూర్తుల వసతి గృహాల సమీపంలో విశాలమైన ప్రదేశంలో జిల్లా న్యాయస్థానం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రస్తుతం న్యాయస్థానం పనులు పూర్తయినా..లోపల చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలాయి. జిల్లా న్యాయస్థానం భవనం మొత్తం రూ.121.90 కోట్లతో మొత్తం ఆరు అంతస్తులు ఉండగా, వాటిలో మొదటి అంతస్తు నుంచి ఐదు అంతస్తుల వరకు కోర్టు హాల్ను సిద్ధం చేశారు. ఒక్కొక్క అంతస్తులో నాలుగు కోర్టులు చొప్పన మొత్తం 20 న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సమావేశం నిర్వహించే సభాభవనాలు, సాక్షులు, న్యాయవాదులు, సిబ్బంది కూర్చోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. కోర్టుకు తీసుకొని వచ్చిన ఖైదీలను భద్రంగా ఉంచడానికి ప్రత్యేక గదులనూ నిర్మించారు. కోర్టు దిగువన ఉన్న భవనంలో రికార్డులు, తదితర పత్రాలను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూం ఏర్పాటు చేశారు. కోర్టు హాల్కు సమీపంలోని న్యాయమూర్తులకు గ్రంథాలయాలను నిర్మించారు. న్యాయస్థానంలో ఐదు లిఫ్ట్లను పెట్టారు. ఒక లిఫ్ట్ న్యాయమూర్తులు, రెండు కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు మరో రెండు లిఫ్ట్లు సాక్షులు, ఖైదీలను తీసుకొని వెళ్లడానికి ప్రత్యేకంగా సిద్ధం చేశారు. న్యాయమూర్తులు మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనేలా ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. కోర్టులో సెంట్రల్ ఏసీని ఏర్పాటు చేశారు. కోర్టులో వీడియో కాన్ఫరెన్స్హాల్, అగ్నిప్రమాదాలు నివారణకు ప్రత్యేకంగా పరికరాలను అమర్చారు. ఇ-సేవ కేంద్రం, హెల్ప్డెస్క్, న్యాయసేవా కేంద్రం, మరుగుదొడ్లు, తదితర సౌకర్యాలు కల్పించారు. కోర్టు ముందు విశాలమైన ఉద్యానవనం, అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, తదితరులకు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. జిల్లా న్యాయస్థానం సమీపంలోని జిల్లా న్యాయవాదుల భవనం కూడా సిద్ధమవుతోంది. అక్కడే న్యాయవాదులకు గ్రంథాలయం, క్యాంటీన్, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రముఖులతో శ్రీకారం
నూతనంగా నిర్మించిన జిల్లా న్యాయస్థానం భవనాన్ని ఈ నెల 26న ఉదయం 11గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయస్థానం పరిపాలనాధికారి ఆర్.దేవదాస్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జె.సి.మధుస్వామి, మంత్రి సి.సి.పాటిల్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ టి.జి.శివశంకరగౌడ ప్రారంభిస్తారు. ప్రజాపనుల శాఖ అదనపు కార్యదర్శి బి.హెచ్.అనిల్కుమార్, రాష్ట్ట్ర న్యాయవాదుల పరిషత్ సభ్యులు కె.కోటేశ్వరరావు, అనిల్కుమార్, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.ఎర్రిగౌడ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.హెచ్.పుష్పాంజలిదేవి, అసోసియేషన్ సభ్యులు నాగరాజ్ నాయక, రవీంద్రనాథ్, త్రివేణి, ప్రజాపనుల శాఖ ప్రాదేశిక ఇంజినీర్ ఎస్.హెచ్.పూజారి పాల్గొంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగేళ్ల డిగ్రీకి తిలోదకాలు
[ 11-05-2024]
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారేకొద్దీ వారి విధానాలకు అనుగుణంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే మారతాయనుకుంటే పొరపాటే. చదువులు కూడా ప్రభుత్వాలకు అనుగుణంగా మార్పుబాటలో నడుస్తున్నాయి. -
మిత్రుల పయనమెటో?
[ 11-05-2024]
రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ- జనతాదళ్ మైత్రితో రాజకీయ వాతావరణం ఆసక్తిగా మారింది. లోక్సభ ఎన్నికల కోసం ఈ రెండు పార్టీల పొత్తు కాంగ్రెస్ను కాస్త ఆందోళనకు గురి చేసినా.. సరిగ్గా ఎన్నికల సమయంలో పొత్తు చేసుకున్న మిత్రుల మధ్య అలజడి మొదలైంది. -
మన పోలీసులే భేష్
[ 11-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యాలకు సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. దర్యాప్తు చేసేందుకు కర్ణాటక పోలీసులు సమర్థవంతులని పేర్కొన్నారు. -
వారిల్లు చక్కదిద్దుకోనివ్వండి..
[ 11-05-2024]
‘లోకపు వంకరను మీరెందుకు సరి చేస్తారు? ముందు మీ ఇంటి సమస్యను పరిష్కరించుకోండి’ అనే బసవేశ్వరుని వచనాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉటంకించారు. -
జిందాల్ ఉక్కు పరిశ్రమలో ఘోర ప్రమాదం
[ 11-05-2024]
సండూరు తాలూకా తోరణగల్లు సమీపంలోని జిందాల్ స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కానరాని కావేరి
[ 11-05-2024]
చల్లని జలవేణి.. కావేరి మాత కానరాని దయనీయ పరిస్థితి. నిత్యం నీటి గలగలలతో కళకళలాడే జలదేవేరి అడుగంటి పోయింది. కనీసం చిన్న పాయల్లోనూ ప్రవాహం కానరాదు. ఎగువన కొడగు జిల్లాలో వానలు ప్రారంభమైనాయన్న మాటేగానీ.. ప్రవాహం కదలిన దాఖలాలు కరవు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
[ 11-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం సాయంత్రం బళ్లారి నగరంలో జరిగింది. గాయపడిన ఇద్దరు వ్యక్తులు గోవిందరాజులు(37), రంజిత్(27)గా గుర్తించారు. -
మహ్మద్ ఫర్దీన్.. సంస్కృతంలో శభాష్!
[ 11-05-2024]
రాజధాని నగరంలోని హొంబేగౌడ నగర పాలికె పాఠశాలలో చదివి, పదో తరగతి పరీక్షలు రాసిన మహ్మద్ ఫర్దీన్ పాషాకు సంస్కృతంలో 125కు 125 మార్కులు వచ్చాయి. పరీక్షల్లో 625కు 549 మార్కులతో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుడయ్యాడు. -
ఆమె ప్రతిభను అడ్డుకోలేని వైకల్యం
[ 11-05-2024]
దావణగెరె సిద్ధగంగ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పి.యుక్తి 625కి 593 మార్కులు సాధించింది. పుట్టుకతోనే దృష్టి లోప సమస్యలు ఉన్న ఆమె ప్రతిభను వైకల్యం అడ్డుకోలేకపోయింది. -
తెలుగు రాష్ట్రాలకు ఓటర్ల పయనం
[ 11-05-2024]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఓటు హక్కు ఉన్న వారు బెంగళూరు నుంచి శుక్రవారం సాయంత్రం తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు. భద్రత కోసం పోలీసులు, హోం గార్డులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్