logo

‘వారు.. సహకరించలేదు’

‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్‌ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ ఆక్రోశించారు.

Published : 25 Apr 2024 01:41 IST

హెచ్‌.డి.దేవేగౌడ

హాసన, న్యూస్‌టుడే : ‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్‌ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ ఆక్రోశించారు. హాసనలో తనను కలుసుకున్న విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. హాసనలో మొదటి నుంచి దళ్‌కు చక్కని పట్టు ఉందన్నారు. భాజపా నాయకులు, కొందరు కార్యకర్తల సహకారం లేకపోయినా మండ్యలో కుమారస్వామి, హాసనలో ప్రజ్వల్‌ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేస్తానని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ మాట్లాడి కొత్త వివాదాన్ని తలపై వేసుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కావేరి పరివాహక జిల్లాల్లో భాజపా నాయకులతో కలిపి ప్రచారం చేశానని, మోదీతో కలిసి రెండు సభల్లో పాల్గొన్నానని గుర్తు చేశారు. రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోనూ ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. భాజపా, దళ్‌ పొత్తు అభ్యర్థులు అందరూ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని