ఇక..ఉత్తర దిగ్విజయయాత్ర!
కర్ణాటక దక్షిణ, పాతమైసూరు, కరావళి ప్రాంతాల్లో తొలివిడత ఎన్నికలను విజయవంతంగా ముగించిన పార్టీలు.. రెండో విడతపై దృష్టి సారించాయి.
నేటి నుంచి దిగ్గజాల ప్రచార భేరీ
నరేంద్రమోదీ, రాహుల్గాంధీ
ఈనాడు, బెంగళూరు : కర్ణాటక దక్షిణ, పాతమైసూరు, కరావళి ప్రాంతాల్లో తొలివిడత ఎన్నికలను విజయవంతంగా ముగించిన పార్టీలు.. రెండో విడతపై దృష్టి సారించాయి. పార్టీల పథాధికారులు, కార్యాధ్యక్షులు, సమన్వయకర్తలంతా తమ కార్యాలయాలను రాష్ట్ర ‘ఉత్తర’ వలయానికి బదిలీ చేశారు. దక్షిణ ప్రాంతానికి భిన్నమైన వ్యూహాలను రచించిన పార్టీలు వాటిని అమలు చేసేందుకు శ్రేణులను సిద్ధం చేశాయి. మరోవైపు తొలివిడత పోలింగ్ను దాదాపు ప్రశాంతంగా ముగించిన ఎన్నికల సంఘం మలివిడత కోసం సిబ్బందిని సమాయత్తం చేసింది. మరో పది రోజుల్లో నిర్వహించే రెండో విడత ఎన్నికల కోసం 14 స్థానాల అభ్యర్థులంతా జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
నేడు మోదీ రాక..
తొలివిడత ఎన్నికల్లో మూడుసార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండో విడత కోసం ఆదివారం ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ప్రాంతంలో ఇప్పటికే ఓసారి పర్యటించిన మోదీ.. తన రెండో పర్యటనలో భాగంగా రెండు రోజులు రాష్ట్రంలోనే ప్రచారం చేస్తారు. ఆదివారం ఉదయం బెళగావికి చేరుకుని, ఉత్తర కన్నడలోని శిరసి, దావణగెరె, కల్యాణ కర్ణాటకలోని హొసపేటెలో ప్రచారం చేస్తారు. ఆరోజున అక్కడే విడిది చేసి, సోమవారం బాగల్కోటెలో పర్యటిస్తారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో సంచరిస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలువగా.. కీలక నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యోగీ ఆదిత్యనాథ్ ప్రచారానికి వస్తారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి 14 నియోజకవర్గాలూ కొల్లగొట్టిన భాజపా.. ఈసారి అదే స్థాయి విజయం కోసం పరితపిస్తోంది. దక్షిణ ప్రాంతంలో జేడీఎస్తో పొత్తుతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. ఉత్తర ప్రాంతంలో కాంగ్రెస్తో దాదాపు ఒంటరి పోరు చేయాల్సిందే. ఇక్కడి 14 నియోజకవర్గాల్లో దావణగెరె, బీదర్, రాయచూరు తదితర స్థానాల్లో కాస్తో, కూస్తో కార్యకర్తలున్న జేడీఎస్కు మిగిలిన 11 స్థానాల్లో భాజపాకు నామమాత్రపు మద్దతు మాత్రమే ఇవ్వగలదు. తొలివిడత స్థానాల్లో జేడీఎస్ నేతలు హెచ్.డి.దేవేగౌడ, కుమారస్వామిలు విస్తృతంగా ప్రచారం చేసినా మలివిడత స్థానాల్లో ఏమేరకు ప్రచారం చేస్తారన్నది ఆసక్తికరం. తాను ఎన్డీఏ అభ్యర్థుల గెలుపునకు మరో వారం రోజుల పాటు ప్రచారం చేస్తానని ప్రకటించిన దేవేగౌడ సోమవారం నుంచి ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.
పట్టువీడని కాంగ్రెస్
దక్షిణ, మధ్య కర్ణాటకలో జేడీఎస్ పొత్తుతో భాజపా కాస్త బలంగా కనిపించటంతో కాంగ్రెస్ అభ్యర్థులు గట్టిపోటీ ఎదుర్కొన్నారు. ఉత్తర ప్రాంతంలో భాజపాతో ప్రత్యక్షంగా పోటీ చేయాల్సి ఉండటంతో కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత బలంగా చేయాలని చూస్తోంది. గత విధానసభ ఎన్నికల్లో భాజపాకు పట్టున్న బెళగావి, కలబురగి, కల్యాణ కర్ణాటక ప్రాంతాల్లో పాగా వేసిన కాంగ్రెస్ గత ఏడాదిలో ఇక్కడి భాజపా నేతలను తమవైపు తిప్పుకొంది. దావణగెరె, శివమొగ్గ, ధార్వాడల్లో భాజపా సీనియర్లు, మఠాధిపతుల వ్యతిరేకత నుంచి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తోంది. కరవు పరిహారంపై తాము విజయం సాధించామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్.. రెండో విడతలో అదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చూస్తోంది. భాజపా లేవనెత్తిన మతప్రాతిపదిక చర్చలు, ముస్లింల రిజర్వేషన్ అంశాలపై ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ ప్రచారాల్లో విరుచుకుపడ్డారు. రెండో విడతలో వీరిద్దరూ మరో రెండు సార్లు ప్రచారానికి రానుండగా, సోనియాగాంధీ బళ్లారిలో ప్రచారానికి వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రుల వారసులు, మహిళా అభ్యర్థులను ఎక్కువగా బరిలో దింపిన కాంగ్రెస్కు ఇక్కడ పార్టీ వనరులను మరింత సమర్థమంతంగా వినియోగించుకోవాలని చూస్తోంది.
హొసపేటెలో నరేంద్రమోదీ ప్రచారసభ కోసం సిద్ధమైన ప్రాంగణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగేళ్ల డిగ్రీకి తిలోదకాలు
[ 11-05-2024]
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారేకొద్దీ వారి విధానాలకు అనుగుణంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే మారతాయనుకుంటే పొరపాటే. చదువులు కూడా ప్రభుత్వాలకు అనుగుణంగా మార్పుబాటలో నడుస్తున్నాయి. -
మిత్రుల పయనమెటో?
[ 11-05-2024]
రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ- జనతాదళ్ మైత్రితో రాజకీయ వాతావరణం ఆసక్తిగా మారింది. లోక్సభ ఎన్నికల కోసం ఈ రెండు పార్టీల పొత్తు కాంగ్రెస్ను కాస్త ఆందోళనకు గురి చేసినా.. సరిగ్గా ఎన్నికల సమయంలో పొత్తు చేసుకున్న మిత్రుల మధ్య అలజడి మొదలైంది. -
మన పోలీసులే భేష్
[ 11-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యాలకు సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. దర్యాప్తు చేసేందుకు కర్ణాటక పోలీసులు సమర్థవంతులని పేర్కొన్నారు. -
వారిల్లు చక్కదిద్దుకోనివ్వండి..
[ 11-05-2024]
‘లోకపు వంకరను మీరెందుకు సరి చేస్తారు? ముందు మీ ఇంటి సమస్యను పరిష్కరించుకోండి’ అనే బసవేశ్వరుని వచనాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉటంకించారు. -
జిందాల్ ఉక్కు పరిశ్రమలో ఘోర ప్రమాదం
[ 11-05-2024]
సండూరు తాలూకా తోరణగల్లు సమీపంలోని జిందాల్ స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కానరాని కావేరి
[ 11-05-2024]
చల్లని జలవేణి.. కావేరి మాత కానరాని దయనీయ పరిస్థితి. నిత్యం నీటి గలగలలతో కళకళలాడే జలదేవేరి అడుగంటి పోయింది. కనీసం చిన్న పాయల్లోనూ ప్రవాహం కానరాదు. ఎగువన కొడగు జిల్లాలో వానలు ప్రారంభమైనాయన్న మాటేగానీ.. ప్రవాహం కదలిన దాఖలాలు కరవు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
[ 11-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం సాయంత్రం బళ్లారి నగరంలో జరిగింది. గాయపడిన ఇద్దరు వ్యక్తులు గోవిందరాజులు(37), రంజిత్(27)గా గుర్తించారు. -
మహ్మద్ ఫర్దీన్.. సంస్కృతంలో శభాష్!
[ 11-05-2024]
రాజధాని నగరంలోని హొంబేగౌడ నగర పాలికె పాఠశాలలో చదివి, పదో తరగతి పరీక్షలు రాసిన మహ్మద్ ఫర్దీన్ పాషాకు సంస్కృతంలో 125కు 125 మార్కులు వచ్చాయి. పరీక్షల్లో 625కు 549 మార్కులతో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుడయ్యాడు. -
ఆమె ప్రతిభను అడ్డుకోలేని వైకల్యం
[ 11-05-2024]
దావణగెరె సిద్ధగంగ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పి.యుక్తి 625కి 593 మార్కులు సాధించింది. పుట్టుకతోనే దృష్టి లోప సమస్యలు ఉన్న ఆమె ప్రతిభను వైకల్యం అడ్డుకోలేకపోయింది. -
తెలుగు రాష్ట్రాలకు ఓటర్ల పయనం
[ 11-05-2024]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఓటు హక్కు ఉన్న వారు బెంగళూరు నుంచి శుక్రవారం సాయంత్రం తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు. భద్రత కోసం పోలీసులు, హోం గార్డులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?