ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తిరిగిస్తా
భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వేసిన ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తప్పకుండా తిరిగి ఇస్తానని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం హొసపేటెలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
హొసపేటె సభలో ప్రధాని మోదీ భరోసా
ప్రధాని మోదీ, అభ్యర్థి శ్రీరాములు ముచ్చట్లు
హొసపేటె, న్యూస్టడే: భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వేసిన ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తప్పకుండా తిరిగి ఇస్తానని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం హొసపేటెలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. భారతీయుల ఓటుకు చాలా విలువ ఉంది. 2014, 2019లో మీరు వేసిన ఓటువల్లే నేడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనాను దేశం నుంచి తరిమికొట్టాను, వికసిత భారత్, వందే భారత్ మీ విలువైన ఓటువల్లే సాధ్యమైందని నొక్కిపలికారు. దేశమంతటా మరోసారి మోదీ అనే మంత్రం మార్మోగుతోందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవని, మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వారి అవినీతి కర్మకాండలను వెలికితీస్తామని ఇప్పటి నుంచే వారికి భయం చుట్టుకుందని చురకలంటించారు. 2014కన్నా పూర్వం మన దేశం ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందని భేరీజు చేసుకోండి. జమ్ము-కశ్మీరులో ఎక్కడలేని శాంతి నెలకొంది, ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారు. ఆలయాల నిర్మాణం, పండగ పర్వదినాల ఆచరణలో భారతీయులు ఎన్నడూ ముందుంటారు. అలాంటి గడ్డపైన శ్రీరామమందిరాన్ని నిర్మిస్తే ఓర్చుకోలేని కాంగ్రెస్ను ఈ ఎన్నికల్లో అడవిపాలు చేయండని పిలుపునిచ్చారు. తన ప్రసంగ వ్యవధిలో సగం సమయాన్ని ఉత్తర కర్ణాటక గురించి చెప్పటానికి కేటాయించి ఈ ప్రాంతం జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఏడు జిల్లాలు కలిగిన ఉత్తర కర్ణాటక (కల్యాణ కర్ణాటక) భాజపా హయాంలోనే చాలా అభివృద్ధి చెందిందని కొనియాడారు. కొప్పళ తాలూకా కిన్నాళ బొమ్మలకు ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. బళ్లారి జీన్స్ను అదే స్థాయికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో ఉత్తర కర్ణాటకలో రైలు సేవలు మెరుగుపడ్డాయని గుర్తు చేశారు. కర్ణాటకలో ఏడాది నుంచి కటిక చీకట్లు కమ్ముకున్నాయి. ఒక చేత్తో ఉచిత విద్యుత్తు ఇచ్చి, మరో చేత్తో విద్యుత్తు కోతతో ఇబ్బందులపాలు చేస్తున్నారు. శాంతి భద్రతలు మంచాన పడ్డాయి. హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరిగాయి. బాంబులు, తుపాకుల నీడలో కన్నడిగులు గుండెలను చేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు, ఏలికలు మనకి అస్సలు అవసరం లేదని తేల్చిచెప్పారు. 5.45నిమిషాలకు వేదికపైకి వచ్చిన మోదీ 6 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతకుముందు మాజీ సీఎం కుమారస్వామి, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, బళ్లారి అభ్యర్థి శ్రీరాములు మాట్లాడారు. రాయచూరు, కొప్పళ అభ్యర్థులు రాజా అమరేశ్వర నాయక, బసవరాజ్ క్యావటర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో సభాస్థలి ప్రవేశద్వారంలో పోలీసులు, కార్యకర్తల నడుమ తోపులాటలు చోటు చేసుకున్నాయి. సూర్యుడి తాపం ఎక్కువగా ఉండటంతో తాగునీటికోసం కార్యకర్తలు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ‘మహా’తలపోటు
[ 14-05-2024]
ఓ వైపు లోక్సభ ఎన్నికల తంతు కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో కనీసం 20 నియోజకవర్గాల్లో గెలుస్తామన్న ధీమాలో రెండు జాతీయ పార్టీలున్నాయి. -
పదిలో బాలికల జోరు!
[ 14-05-2024]
విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ పది, 12వ తరగతి ఫలితాలు సోమవారం వెల్లడించారు. రెండు పరీక్షల్లోనూ బెంగళూరు వలయం నాలుగో స్థానంలో నిలిచింది. -
కమనీయం.. తైలాభిషేకం
[ 14-05-2024]
విజయనగర జిల్లా కొట్టూరు తాలూకా ఉజ్జనిలోని మరుళిసిద్ధేశ్వర స్వామివారి గోపుర తైలాభిషేక కార్యక్రమం సోమవారం సాయంత్రం వైభవంగా జరిగింది. -
మురుగుకాలువలో బాలల మృతదేహాలు
[ 14-05-2024]
ఇంటి నుంచి వెళ్లి.. ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు బాలల మృతదేహాలను ఓ మురుగుకాలువలో గుర్తించారు. -
అన్నింటా భాజపాదే విజయం
[ 14-05-2024]
బెంగళూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎ.దేవేగౌడ, బెంగళూరు ఆగ్నేయ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి వై.ఎ.నారాయణ స్వామి తమ నామినేషన్ పత్రాలను శాంతినగరలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో సోమవారం దాఖలు చేశారు -
రేవణ్ణకు షరతులతో జామీను
[ 14-05-2024]
ఒక మహిళను అపహరించిన ఆరోపణలతో బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న జనతాదళ్ అగ్రనేత, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణకు చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సోమవారం జామీను మంజూరు చేసింది -
హాసన కేసు ఏమైంది?
[ 14-05-2024]
లెక్కకు మించిన మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు సోమవారం ఇక్కడ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ నాగలక్ష్మికి విన్నవించారు. -
విశ్వవిజ్ఞానం.. కళ్లెదుటే సాక్షాత్కారం
[ 14-05-2024]
ఆకాశం ఎత్తెంత? భూగోళం లోతెంత? నీరు మంచుగా ఎందుకు మారుతుంది? మంచు.. మరీ నీరుగా ఎలా రూపాంతరం చెందుతుంది? రాకెట్లు పైకెలా వెళతాయి. -
హోటల్ మేనేజ్మెంట్లో ఉజ్వల భవిష్యత్తు
[ 14-05-2024]
హోటల్స్ విధులు నిర్వహించే వారికి వృత్తిపర శిక్షణ చాలా అవసరం. నిరుద్యోగ యువతి, యువకులకు హోటల్స్ మేనేజ్మెంట్పై శిక్షణ పొందడంతో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని బళ్లారి జిల్లా వాణిజ్య, పరిశ్రమల సంస్థ సహాయక కార్యదర్శి డా.మర్చేడు మల్లికార్జున గౌడ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!