చందనసీమలో నమోజపం!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం కర్ణాటకలో నాలుగు బహిరంగసభల్లో పాల్గొని భాజపా అభ్యర్థులకు ఓట్లు అభ్యర్థించారు.
బెళగావి సభలో ప్రసంగానంతరం మోదీ..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం కర్ణాటకలో నాలుగు బహిరంగసభల్లో పాల్గొని భాజపా అభ్యర్థులకు ఓట్లు అభ్యర్థించారు. ఉదయమే బెళగావి చేరుకున్న ఆయన అక్కడ అభ్యర్థి జగదీశ్ శెట్టర్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. సిరసిలో ఉత్తర కన్నడ అభ్యర్థి విశ్వేశ్వర హెగ్డే కాగేరి, దావణగెరెలో గాయత్రి సిద్ధేశ్వర్, హొసపేటెలో బళ్లారి అభ్యర్థి శ్రీరాములుకు ఓట్లేయాలని ప్రజలను కోరారు. ఆయా సభలకు పెద్దఎత్తున జనం తరలివచ్చారు. కాంగ్రెస్పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన, సాగించిన ఆరోపణలకు ప్రజలు ప్రతిస్పందించారు. మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, కుమారస్వామి, బసవరాజ బొమ్మై, జగదీశ్శెట్టర్తో పాటు కీలక నేతలు హాజరయ్యారు.
న్యూస్టుడే, మళ్లేశ్వరం
సిరసి సభలో మోదీ సభకు కదలివచ్చిన జనం
బెళగావి సభలో అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా నేతలు యడియూరప్ప తదితరులు
దావణగెరె సభలో మోదీ, బసవరాజ బొమ్మై, ఎంపీలు సిద్ధేశ్వర్, సుమలత తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్తు వాహనాల జోరు
[ 15-05-2024]
ఇంధన ధరల నుంచి ఊరటే కాదు.. పర్యావరణాన్ని కర్బన ఉద్గారాల నుంచి రక్షించేందుకు తయారైన విద్యుత్తు వాహనాలనూ పన్నుపోటు వెన్నాడుతోంది. -
కారాగారం నుంచి ఇంటికి పయనం..
[ 15-05-2024]
ఒక మహిళను అపహరించిన ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ పరప్పన అగ్రహార కారాగారం నుంచి మంగళవారం విడుదలయ్యారు. -
కలసికట్టుగా కాంగ్రెస్
[ 15-05-2024]
కాంగ్రెస్ నేతల మధ్య అభిప్రాయభేదాలు, అంతర్గత కలహాలు లేవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఒక వేళ గొడవలు ఉండి ఉంటే లోక్సభ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పని చేయడం సాధ్యమై ఉండేది కాదన్నారు. -
చుట్టుముట్టిన వానదేవుడు
[ 15-05-2024]
ఉద్యాననగరిలో మరో ఐదు రోజులు భారీవర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బెంగళూరుతో పాటు చిక్కమగళూరులోనూ భారీ వర్షాలు మరో నాలుగు రోజులు కొనసాగుతాయని పేర్కొన్నారు. -
మోదీ ప్రశంసలతో మురిసిన బాలిక
[ 15-05-2024]
బాగలకోటెలో ఏప్రిల్ 29న నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన నాగరత్న మేటి అనే యువతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసా పత్రాన్ని పంపించారు. -
నీలి అలలు.. మెరుపు కలలు!
[ 15-05-2024]
దేశంలో పేరెన్నికగన్న 12 సముద్ర తీరాలకు దక్కిన ‘నీలి పతాక’ (బ్లూఫ్లాగ్) గుర్తింపు ఈసారి తన్నీరుబావికి వస్తుందా? .. -
హాసన ఎంపీకి కఠిన శిక్ష పడాల్సిందే
[ 15-05-2024]
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ వందలాది మంది మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఘటన హాసనలో వెలుగులోకి రావడంతో సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
భారీగా చోరీ సొత్తు స్వాధీనం
[ 15-05-2024]
తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న ప్రకాశ్ అలియాస్ బాలాజీ, మహేశ్ (26) అనే నిందితులను విజయనగర, బసవేశ్వరనగర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. -
కాలిపోయిన ఐరావతం
[ 15-05-2024]
శివమొగ్గ నుంచి మైసూరుకు వెళుతున్న ‘కేఎస్ఆర్టీసీ ఐరావత’ బస్సులో మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో