logo

చందనసీమలో నమోజపం!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం కర్ణాటకలో నాలుగు బహిరంగసభల్లో పాల్గొని భాజపా అభ్యర్థులకు ఓట్లు అభ్యర్థించారు.

Updated : 29 Apr 2024 06:46 IST

బెళగావి సభలో   ప్రసంగానంతరం మోదీ..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం కర్ణాటకలో నాలుగు బహిరంగసభల్లో పాల్గొని భాజపా అభ్యర్థులకు ఓట్లు అభ్యర్థించారు. ఉదయమే బెళగావి చేరుకున్న ఆయన అక్కడ అభ్యర్థి జగదీశ్‌ శెట్టర్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. సిరసిలో ఉత్తర కన్నడ అభ్యర్థి విశ్వేశ్వర హెగ్డే కాగేరి, దావణగెరెలో గాయత్రి సిద్ధేశ్వర్‌, హొసపేటెలో బళ్లారి అభ్యర్థి శ్రీరాములుకు ఓట్లేయాలని ప్రజలను కోరారు. ఆయా సభలకు పెద్దఎత్తున జనం తరలివచ్చారు. కాంగ్రెస్‌పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన, సాగించిన ఆరోపణలకు ప్రజలు ప్రతిస్పందించారు. మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, కుమారస్వామి, బసవరాజ బొమ్మై, జగదీశ్‌శెట్టర్‌తో పాటు కీలక నేతలు హాజరయ్యారు.                                   

 న్యూస్‌టుడే, మళ్లేశ్వరం

సిరసి సభలో మోదీ సభకు కదలివచ్చిన జనం

బెళగావి సభలో అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా నేతలు యడియూరప్ప తదితరులు

దావణగెరె సభలో మోదీ, బసవరాజ బొమ్మై, ఎంపీలు సిద్ధేశ్వర్‌, సుమలత తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని