అడిగింది కొండంత... ఇచ్చింది గోరంత
కన్నడనాడుకు రూ.18 వేల కోట్ల కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కోరితే కేంద్రం రూ.3,454 కోట్లు మాత్రమే ఇచ్చిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.
మహాత్ముని విగ్రహం వద్ద నినాదాలు రాసిన అట్టముక్కలతో ధర్నాకు దిగిన కాంగ్రెస్ కీలక నేతలు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : కన్నడనాడుకు రూ.18 వేల కోట్ల కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కోరితే కేంద్రం రూ.3,454 కోట్లు మాత్రమే ఇచ్చిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నడిగులు ఏటా రూ.4 లక్షల కోట్ల పన్నులు కడుతున్నా, కేంద్రం దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో కలిసి విధానసౌధ ఆవరణలోని మహాత్ముని ప్రతిమ వద్ద ఆదివారం ఉదయం ధర్నాకు దిగారు. ఖాళీ చెంబులు, నినాదాలు రాసిన అట్టముక్కలను ప్రదర్శించారు. రాష్ట్రంలో 223 తాలూకాల్లో కరవు తాండవమాడుతుంటే కేంద్రం విడుదల చేసిన పరిహారం దేనికీ సరిపోదని సిద్ధరామయ్య వాపోయారు. తాము గ్యారంటీ పథకాలకు డబ్బు అడిగితే భాజపా నాయకులు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖాళీ చెంబు ఇచ్చిన పార్టీ, చెంబేశ్వర మోదీ, గో బ్యాక్ మోదీ.. అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. కన్నడిగులను అవమానించవద్దంటూ నినాదాలు రాసిన అట్టముక్కలతో మహాత్ముని ప్రతిమ నుంచి దేవరాజ అరసు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి, ఆందోళన విరమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్.. జాడే తెలియదాయె
[ 13-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాపు కాశారు. -
కమలనాథుల కలలు కల్లలే
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించి కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు- ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
కుటుంబ కథాచిత్రంగా జట్టి
[ 13-05-2024]
ప్రముఖ కథానాయిక రాగిణి ద్వివేది నటిస్తున్న ‘జట్టి’ చిత్ర నిర్మాణం వేడుకగా ప్రారంభమైంది. ఇటీవల చిత్రం ఫస్ట్లుక్ను విడుదల చేశారు. -
బాబు గెలుపునకు మేముసైతం
[ 13-05-2024]
ఈ నెల ఏడున జరిగిన పోలింగ్తో రాష్ట్రంలో రెండు విడతల పోలింగ్ పరిసమాప్తమైంది. ఇక్కడ పోలింగ్ ముగిసిన వెంటనే సింధనూరులోని అనేక మంది తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లోని తమ స్వస్థలాలకు వెళ్లి -
సామాజిక మాధ్యమాలతో అప్రమత్తం
[ 13-05-2024]
సామాజిక మాధ్యమాలను వినియోగించుకునే వారు జాగరూకతతో ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ నాగలక్ష్మి చౌదరి పిలుపునిచ్చారు. -
రైతులకే సర్కారు వెన్నుదన్ను
[ 13-05-2024]
రాష్ట్రంలో కరవు నివారణకే ప్రాధాన్యమిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. రైతుల ఇక్కట్లను పరిగణలోనికి తీసుకుని- వారికి సంఘీభావంగా ఈనెల 15న తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నానని, కాంగ్రెస్ కార్యకర్తలు, -
ప్రజ్వల్కు మోదీ అండ: కాంగ్రెస్
[ 13-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జనతాదళ్)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రక్షిస్తున్నారని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపించింది. -
మహిళ విషాదాంతం..
[ 13-05-2024]
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి చెట్టుకొమ్మ విరిగి పడడంతో సవిత (48) అనే మహిళ మృతి చెందింది. ఎన్ఆర్పుర తాలూకా కట్టిమని గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
వేసవి రద్దీ.. విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
-
స్వాతీమాలీవాల్పై దాడి..! దిల్లీ సీఎం నివాసం బాక్సింగ్ రింగ్లా మారిందన్న భాజపా
-
‘దుమ్మురేపిన’ గాలివాన.. ముంబయిలో మెట్రో, సబ్అర్బన్ సర్వీసులకు అంతరాయం
-
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
-
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం