పదేళ్లలో ఏం చేశారని ఓటేయాలి?
గడిచిన పదేళ్లలో మహాప్రభు (నరేంద్ర మోదీ) ప్రజలకు ఏమి చేశారని ఓటు వేయాలి. దేశంలో నిరుద్యోగ సమస్య పెంచినందుకా?.
ప్రకాష్రాజ్ ప్రశ్న
మాట్లాడుతున్న బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, చిత్రంలో మల్లికార్జునరెడ్డి, శివశంకర్, మానయ్య, తదితరులు
బళ్లారి, న్యూస్టుడే: గడిచిన పదేళ్లలో మహాప్రభు (నరేంద్ర మోదీ) ప్రజలకు ఏమి చేశారని ఓటు వేయాలి. దేశంలో నిరుద్యోగ సమస్య పెంచినందుకా?. పండించిన ధాన్యానికి ఎంఎస్పీ అడిగిన రైతులపై దౌర్జన్యం చేసినందుకా? కార్మిక చట్టాలను మార్చడానికి ముందుకు వెళ్తున్నందుకా? దేశ సంపదను కొంత మందికే దోచిపెట్టినందుకు ఓటు వేసి 400 సీట్లు ఇవ్వాలా? అని బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. సోమవారం బళ్లారిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామ మందిరానికి ప్రతిపక్షాలు రాలేదని ప్రధాని మాట్లాడుతున్నారే.. సొంత పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాలేదు..కొంత మంది మఠాధీశులు వ్యతిరేకించారు. రాష్ట్రపతిని ఆహ్వానించలేదే. దీనికి ప్రధాని దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామమందిరం అడ్డంపెట్టుకుని ప్రచారం చేయడం దిగుజారిన రాజకీయమన్నారు. రాష్ట్రంలో 27 మంది ప్రతినిధులు పార్లమెంట్కు వెళ్తే..ఒక్కరోజైనా రాష్ట్రంలో నెలకొన్న కరవుపై మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు. ప్రధాని గురించి భజన చేయడం తప్ప వారికి ఏమి తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లిన తర్వాత కోర్టు చీవాట్లు పెడితే రూ.3454 కోట్లు విడుదల చేశారు. నేడు రాష్ట్రంలో కరవు నివారణకు నిధులు విడుదల చేయించామని ప్రచారం చేసుకునే వారికి సిగ్గు లేదన్నారు. గతంలో 303 సీట్లు వచ్చాయి. ప్రస్తుతం 400 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పదేళ్ల అధికారంలో ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం రాజ్యాంగం మార్పు చేస్తామని, ప్రజాస్వామ్యం ఖూనీ చేయడానికి, ముస్లింలపై దాడులు చేసినందుకు..మతాలు, కులాలు..ప్రాంతాల మధ్య ఘర్షణలు సృష్టిస్తారని ఓటు వేయాలా అని ప్రశ్నించారు.
అవినీతిపరులను పార్టీలో చేర్చుకుంటున్నారు
అవినీతి రహిత దేశంగా మారుస్తాం..అవినీతి పరులు లేని సమాజం నిర్మిస్తాం.. మహాప్రభు ప్రధాని నరేంద్ర, చాణిక్యుడుగా చెప్పుకొంటున్న అమిత్షా నేడు దేశ సంపదను దోచుకుని, కోర్టు, సీబీఐ, ఈడీ విచారణలు ఎదుర్కొంటున్న వారిని పార్టీలోకి చేర్చుకుని వాషింగ్ మిషన్లో వేస్తే వారు నీతివంతులుగా మారుతారా? దీనిపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రకాశ్రాజ్ నిలదీశారు. బళ్లారి లోక్సభ బరిలో ఉన్న అభ్యర్థి సమాజ సేవలో ఉన్నారని టికెట్ ఇచ్చారని అనుకుంటే పొరపాటు. డబ్బులు ఉండటం వల్లే సీటు ఇచ్చారని తెలిపారు. నేను ఏ పార్టీ తరఫున పనిచేయడం లేదు..దేశంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం ప్రతి భారతీయుడి బాధ్యత, అదే తరహాలోనే దేశ వ్యాప్తంగా పలు నియోజకవర్గాలను తిరుగుతూ అధికార పార్టీ చేసిన వైఫల్యాలను ఎత్తుచూపుతున్నాను. వాటిని ప్రశ్నిస్తున్నాను. ఫలానా పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరడం లేదు. అధికార పార్టీ అభ్యర్థిని తిరస్కరించి మీకు అందుబాటులో ఉండే అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నానని చెప్పారు. స్థానిక ప్రతినిధులు చాగనూరు మల్లికార్జునరెడ్డి, శివశంకర్, మానయ్య, చంద్రకుమారి, వెంకటేశులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుబ్బళ్లిలో మరో దారుణం
[ 16-05-2024]
ప్రేమ.. రక్తం కళ్లచూస్తోంది. అభిమానం, త్యాగం మరచి రోషం, కక్షలు పెంచుకుంటోంది. ప్రేమంటూనే.. మొన్నటికి మొన్న కళాశాల ప్రాంగణంలోనే నేహా అనే విద్యార్థినిని ఓ యువకుడు కడతేర్చి విద్యాపురిగా పేరున్న కర్ణాటకలోని హుబ్బళ్లి నగరానికి రక్తపు మరకలు అంటించాడు. -
ప్రజ్వల్ దాగుడుమూతలు.. చివరి క్షణంలో టికెట్ రద్దు!
[ 16-05-2024]
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘హాసన సెక్స్స్కాండల్’ కేసులో కీలక నిందితుడు- ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ లభించక ప్రత్యేక దర్యాప్తుదళం (సిట్) తలలు పట్టుకునే పరిస్థితి ఎదురవుతోంది. -
పాతికేళ్ల ప్రేమకు పెళ్లి ముడి
[ 16-05-2024]
ప్రజాపోరాటమే సుధ, మోహన్ కుమార్లను ఒక్క చోటుకు చేర్చింది. ఇద్దరూ కలిసి ప్రజా సమస్యలపై ఇన్నాళ్లూ పోరాటం కొనసాగించారు. ఇద్దరికీ అభిప్రాయాలు నచ్చి వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. -
జేఎస్ రెడ్డి సేవలు నిరుపమానం
[ 16-05-2024]
వయో సహజమైన అనారోగ్య సమస్యలతో ఇటీవల మరణించిన తెలుగు విజ్ఞాన సమితి పూర్వ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జేఎస్ రెడ్డికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం బెంగళూరులో నివాళి అర్పించారు. -
పడమటి కనుమలకు హరిత తాపడం
[ 16-05-2024]
పడమటి కనుమల పేరు వింటేనే అంతులేని జీవవైవిధ్యత గుర్తుకు వస్తుంది. దేశంలోని జీవ వైవిధ్యతలో దాదాపు 25 శాతం ఈ కనుమల్లోనే ఉంది. మొత్తం 1.60 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ కనుమలు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడులతో సరిహద్దులు పంచుకుంటాయి. -
సిలికాన్ సిటీ.. చెత్త కుండీ
[ 16-05-2024]
ఉద్యాననగరి బెంగళూరు చెత్త కుండీలా మారిపోతోందని బయాకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ‘రహదారులపై ఎక్కడంటే అక్కడ చెత్త కనిపిస్తోంది. -
మెట్రోలో ముచ్చెమటలు
[ 16-05-2024]
నమ్మ మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. బోగీల సంఖ్య పెంచాలనే ప్రయాణికుల డిమాండుకు బీఎంఆర్సీఎల్ అధికారులు స్పందించడం లేదు. ప్రస్తుతం నిత్యం ఆరులక్షల మంది మెట్రో సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. -
బరిలోకి నారా ప్రతాపరెడ్డి
[ 16-05-2024]
ఈశాన్య పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి బుడా (బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార) మాజీ అధ్యక్షుడు నారా ప్రతాపరెడ్డి బుధవారం కలబురగిలో నామినేషన్ దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!