భారాస అభ్యర్థులపై వీడనున్న ఉత్కంఠ
వచ్చే ఎన్నికల్లో భారాస తరఫున బరిలో నిలవనున్న అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించనున్నట్లు పార్టీ అధిష్ఠానం వెలిబుచ్చింది.
వైరాలో మదన్లాల్కు అవకాశం?
ఈటీవీ ఖమ్మం
వచ్చే ఎన్నికల్లో భారాస తరఫున బరిలో నిలవనున్న అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించనున్నట్లు పార్టీ అధిష్ఠానం వెలిబుచ్చింది. దీంతో ఉభయ జిల్లాల్లో ఎవరికి టికెట్ లభించనుందనే చర్చ గులాబీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. మరోవైపు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రెండు నియోజకవర్గాల్లో అప్పుడే అసమ్మతి సెగలు మొదలయ్యాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో 8 మంది ఎమ్మెల్యేలు భారాసకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పనితీరు, ప్రజల్లో ఆదరణ, సర్వే ఫలితాల ఆధారంగా వచ్చే ఎన్నికలకు అభ్యర్థులెవరో ఖరారు చేస్తున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది. ఆ పార్టీ వర్గాలు, ముఖ్యనేతల విశ్వసనీయ సమాచారం ప్రకారం ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్కుమార్, పాలేరు కందాళ ఉపేందర్రెడ్డి, మధిర లింగాల కమల్రాజు, సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు, పినపాక రేగా కాంతారావు, అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు బానోత్ హరిప్రియ, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. వైరా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములునాయక్కు బదులు మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. పార్టీ అంతర్గత సర్వేలో ఆయన పట్ల సానుకూలత వ్యక్తం కాకపోవడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయినా అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు రాములు నాయక్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తనకు కాదనుకుంటే కుమారుడు జీవన్లాల్కైనా అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటితో కలిసి ఇటీవల కాంగ్రెస్లో చేరిన తెల్లం వెంకట్రావు నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ సొంతగూటికి చేరగా.. ఆయనకు భద్రాచలం అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది.
అసమ్మతి సెగలపై దృష్టి
భారాస అభ్యర్థుల ఖరారుపై ఇప్పటికే స్పష్టత రాగా, ఆ వెంటనే కొందరిపై సొంత పార్టీలోనే వ్యతిరేకతలు మొదలవడం గమనార్హం. ఇల్లెందులో హరిప్రియ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అసమ్మతి నాయకులు శనివారం సమావేశమైన విషయం తెలిసిందే. ఇంకోవైపు ఆమెకు మద్దతుగా పలువురు పురపాలక కౌన్సిలర్లు ఆదివారం హైదరాబాద్ వెళ్లి మంత్రి హరీశ్రావును కలిశారు. హరిప్రియకే టికెట్ ఖరారు చేయాలని కోరారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. భద్రాచలం నియోజకవర్గంలోనూ తెల్లం వెంకట్రావుకు వ్యతిరేకంగా అసమ్మతి రాజుకుంది. చర్ల మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బోదబోయిన బుచ్చయ్యకు టికెట్ ఇవ్వాలంటూ కొందరు మద్దతుదారులు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ముఖ్య నాయకులంతా స్థానికంగా అందుబాటులో ఉంటూ అసమ్మతి చల్లారేలా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా నాయకులు, శ్రేణులు ముందుకు సాగాలని సూచించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుణమాఫీపై కదలిక.. అర్హుల జాబితా రూపకల్పనలో అధికారుల నిమగ్నం
[ 16-05-2024]
ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టత ఇచ్చారు. పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించిన కసరత్తు మొదలైంది. -
వన్యప్రాణులకు నీటి వసతి
[ 16-05-2024]
వేసవి తాపానికి మనుషులే తట్టుకోలేకపోతున్నారు. అడవుల్లో ఉండే జంతువులు, పక్షులు అల్లాడుతున్నాయి. తాగేందుకు నీరు లభించక సమీప గ్రామాల్లోకి వచ్చి కుక్కల దాడులు, వేటగాళ్ల ఉచ్చులకు బలైపోతున్నాయి. -
మళ్లీ కబ్జా కూత
[ 16-05-2024]
ఇల్లెందు రైల్వే స్టేషను నుంచి రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైలు 2006లో రద్దయింది. ఆ తర్వాత శాఖ అధికారులు సంస్థ స్థలాల పరిరక్షణపై నిర్లక్ష్యం ప్రదర్శించటంతో తొలినాళ్లలోనే పెద్ద మొత్తంలో అన్యాక్రాంతమయ్యాయి. -
ఇక పట్టభద్రులపై గురి
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. ఈ ఎన్నిక బరిలో 52 మంది ఉండగా.. 27న తేదీన పోలింగ్ జరగనుంది. -
విద్యా సమాచార నిర్వహణకు ట్యాబ్లు
[ 16-05-2024]
పాఠశాల స్థాయి నుంచే విద్యా సమాచారం, నివేదికలను ఆన్లైన్లో పంపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ గతేడాది మార్చిలో ట్యాబ్లను అందజేసింది. వాటికి ఇంటర్నెట్ డేటా కోసం కావాల్సిన సిమ్ కార్డులను తాజాగా పంపిణీ చేసింది. -
రేపట్నుంచి బొమ్మ బంద్
[ 16-05-2024]
సినిమా థియేటర్లు ఈ నెల 17(శుక్రవారం) నుంచి మూగబోనున్నాయి. ప్రేక్షకుల సందడి లేక అవి కళతప్పనున్నాయి. -
స్ట్రాంగ్ రూంలకు పటిష్ఠ భద్రత: కలెక్టర్
[ 16-05-2024]
స్ట్రాంగ్ రూంల వద్ద సాయుధ బలగాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
సమస్యలు పరిష్కరిస్తేనే స్థాయి నిలిచేది!
[ 16-05-2024]
జిల్లాలో జరిగిన అభివృద్ధిని, చేయాల్సిన పనులను బేరీజు వేసుకోవడంలో స్థాయీ సంఘాల సమావేశాలు కీలకపాత్ర పోషిస్తాయి. జిల్లా ప్రజా పరిషత్ పరిధిలోని ఏడు స్థాయీ సంఘాల సమావేశాలను గురువారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
జూన్ 4 వరకు దరఖాస్తు గడువు పెంపు
[ 16-05-2024]
సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్ 4వ తేదీ వరకు పొడిగించింది. -
డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల కన్నుమూత
[ 16-05-2024]
భారాస నేత, ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు(69) అనారోగ్యంతో కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఆయన కాలేయ(లివర్) సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. -
మనసున్న రాజు..
[ 16-05-2024]
ఒకటీ రెండు కాదు.. ఏకంగా 40 గోవులు ఆ గడిలో కన్పిస్తుంటాయి.. ఇదేదో గోశాల అనుకుంటే పొరబాటు.. అలాగని విరాళాలు సేకరించి పశువుల బాగోగులు చూసే సంస్థ అంతకన్నా కాదు. -
తిరుగు ప్రయాణ తిప్పలు
[ 16-05-2024]
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి ముగియడంతో తమ స్వస్థలాల నుంచి వివిధ ప్రాంతాల వారు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. -
ఎన్నికల వేళ ఆర్టీసీకి ఆదాయం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 14 వరకు ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. ఖమ్మం రీజియన్ పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లాకు వచ్చివెళ్లిన ఓటర్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని -
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి: రాహుల్ బొజ్జ
[ 16-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నిక జిల్లా సాధారణ పరిశీలకులు రాహుల్ బొజ్జ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర