మనసున్న రాజు..
ఒకటీ రెండు కాదు.. ఏకంగా 40 గోవులు ఆ గడిలో కన్పిస్తుంటాయి.. ఇదేదో గోశాల అనుకుంటే పొరబాటు.. అలాగని విరాళాలు సేకరించి పశువుల బాగోగులు చూసే సంస్థ అంతకన్నా కాదు.
గోవుల సేవలో తరిస్తున్న లక్ష్మీనర్సింహారావు
తాను కొనుగోలు చేసి పెంచుతున్న ఆవులతో లక్ష్మీనర్సింహారావు
కూసుమంచి, న్యూస్టుడే: ఒకటీ రెండు కాదు.. ఏకంగా 40 గోవులు ఆ గడిలో కన్పిస్తుంటాయి.. ఇదేదో గోశాల అనుకుంటే పొరబాటు.. అలాగని విరాళాలు సేకరించి పశువుల బాగోగులు చూసే సంస్థ అంతకన్నా కాదు.. వధశాలకు వెళ్లే ఆవులను నిలువరించి, వాటిని రైతుల నుంచి కొనుగోలు చేసి వాటి పెంపకానికి రూ.లక్షలు వెచ్చిస్తోంది ఆ కుటుంబం..
దివంగత కేవైవీ రంగారావు ‘కూసుమంచి పట్వారీ’గా జిల్లాకు సుపరిచితులు. ఆయన కుమారుడు కేశరాజు లక్ష్మీనర్సింహారావు, తన కొడుకులతో కలిసి బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. తన తండ్రి రంగారావు మరణాంతరం పూర్వీకుల నుంచి వచ్చిన భూముల్లో స్వయంగా వ్యవసాయం చేయిస్తున్నారు. వారంలో ఒకసారి వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కూసుమంచి, పరిసర గ్రామాల రైతులు పోషణ చేపట్టలేని పరిస్థితుల్లో ఆవుల్ని విక్రయించుకోవడాన్ని కొన్నేళ్ల క్రితం గమనించారు. అదీ కోతకు తరలించే వ్యాపారులకు విక్రయించడాన్ని తట్టుకోలేకపోయారు. దీన్ని నిలువరించాలని భావించిన ఆయన అదే ధరను తాను చెల్లించి రైతుల నుంచి కొనేవారు. రెండు, మూడేళ్ల వ్యవధిలో అలా సేకరించిన వాటి సంఖ్య 32 వరకు చేరింది. ఒక్కో ఆవుకు రూ.20-32 వేల చొప్పున రూ.లక్షలు ఇందుకే ఖర్చు చేశారు. పెంపకం క్రమంలో వాటి సంఖ్య 40కు చేరింది. ప్రస్తుతం కొనుగోళ్లను నిలిపివేసి వాటి పోషణకు ప్రాధానమిస్తున్నారు. ఆవుల పాలు కూడా తీయకుండా దూడలకే తాగిస్తున్నారు.
పోషణపై ప్రత్యేక శ్రద్ధ: ఆవులను ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు. తనకున్న భూమిలో ఆరు ఎకరాలను ఎలాంటి సాగు చేయకుండా మేత కోసం బీడుగా ఉంచుతున్నారు. నాలుగు ఎకరాల మామిడి తోటలోనూ గ్రాసం ఉండేలా చూస్తున్నారు. ఇతర రైతుల నుంచి రెండు ఎకరాలను కేవలం పశుగ్రాసం కోసం కౌలుకు తీసుకున్నారు. దీనికి తోడు వానాకాలం, యాసంగిలో తన సాగుభూమిలో వస్తున్న వరి గడ్డిని విక్రయించకుండా ఆవుల కోసమే వందలాది మోపులు నిల్వ చేస్తున్నారు. అవసరమైతే ఎండు గడ్డి కొంటున్నారు. వాటిని మేతకు తీసుకెళ్లేందుకు, పోషణ కోసం ప్రత్యేకంగా ఓ మనిషిని నియమించారు.
‘‘విధిలేని పరిస్థితుల్లో రైతులు తమ ఆవులను అమ్ముకోవటం బాధవేసింది. మూగజీవాలు కోతకు వెళ్లకుండా నా వంతు ప్రయత్నం చేస్తున్నా. రూ.లక్షలు ఖర్చవుతున్నా కుటుంబ సభ్యుల సహకారంతో వాటి పోషణ చిత్తశుద్ధితో చేస్తున్నా. గోమాత సేవలో తరిస్తున్నాను.’’
లక్ష్మీనర్సింహారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జంతు శాస్త్ర విభాగంలో దివ్యాంగుడికి డాక్టరేట్
[ 31-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగంలో పూజల శివకృష్ణ అనే దివ్యాంగుడికి డాక్టరేట్ను ప్రకటించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహాచారి తెలిపారు. -
రూ.10తో పరేషాన్!.. మార్కెట్లో తగ్గిన నోటు చలామణి
[ 31-05-2024]
విపణిలో రూ.10 నోటు చలామణి తగ్గింది. వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. -
బడిబాటకు సన్నద్ధం
[ 31-05-2024]
కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల పోటీ తట్టుకుని.. ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రవేశాలు పెంపొందించేందుకు ఏటా ‘బడిబాట’ నిర్వహిస్తున్నారు. -
ఓపీ నమోదు ఇక సులువు!
[ 31-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే రోగులకు సాంకేతికత దన్నుగా నిలుస్తోంది. వేగవంతమైన సేవలందించడమే లక్ష్యంగా ఆధునికతకు అధికారులు ప్రాధాన్యం కల్పించారు. -
నిప్పుల కొలిమి
[ 31-05-2024]
ఎండ వేడితో ఖమ్మం జిల్లా గురువారం నిప్పుల కొలిమిని తలపించింది. రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం అల్లాడిపోతున్నారు. -
వీరికి మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం..!
[ 31-05-2024]
గత పంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో జరిగాయి. ఆ తర్వాత మే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. -
అగ్నిగుండంగా గరిమెల్లపాడు
[ 31-05-2024]
ప్రచండ భానుడి ప్రతాపంతో మన్యం జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
మద్యం మత్తులో ఘర్షణ.. ప్రాణాలు కోల్పోయిన బీటెక్ విద్యార్థి
[ 31-05-2024]
మద్యం మత్తులో జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ ఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’... మాస్ గెటప్లో విష్వక్సేన్ మెప్పించారా...?
-
చావనైనా చస్తాం కానీ.. భూములివ్వబోమని చెప్పాం: విశాఖ భూకబ్జా బాధితులు
-
ఇకపై గూగుల్ మెసేజ్లనూ ఎడిట్ చేయొచ్చు
-
ఆ ఫైనలిస్టుల్లో ఒక్కరూ లేరు.. అయినా అది భారత్కే వరం: వసీమ్ అక్రమ్
-
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
‘జూన్ 2న లొంగిపోతా.. నా తల్లిదండ్రులు జాగ్రత్త’: కేజ్రీవాల్ ఉద్వేగం