కేసీఆర్ కష్టంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: భారాస
సుదీర్ఘ కాలంపాటు పోరాటం చేసి తన కష్టంతోనే ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
జయశంకర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి అజయ్, ఎమ్మెల్సీ మధుసూదన్ తదితరులు
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్టుడే: సుదీర్ఘ కాలంపాటు పోరాటం చేసి తన కష్టంతోనే ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భారాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో తొలుత భారాస జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు. కొంతమంది కేసీఆర్ చరిత్రను మరుగున పడేసేందుకు కుట్రలు చేస్తున్నారని, అది సాధ్యంకాదన్న విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారన్నారు. రాష్ట్ర సాధనకు, హక్కుల కోసం, ప్రజల కోసం మొక్కవోని పోరాటం చేసిన కేసీఆర్ను ప్రజలెప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిందని, ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని ఆ పార్టీ కోల్పోయిందన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ... ఎన్నికలకు 15 రోజుల సమయముందని, దీన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకొని భారాస గెలుపునకు కృషి చేయాలన్నారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ... రైతుబిడ్డగా మరోసారి పోటీ చేస్తున్న మీవాణ్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ప్రజల ఆశీర్వాదంతో పదేళ్లు లోక్సభలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేశానన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జిల్లాలోని ఖమ్మం, మధిర రైల్వేస్టేషన్ల అభివృద్ధికి నిధులు విడుదల చేసుకున్నామని, అనేక జాతీయ రహదారులను సాధించుకున్నామని వివరించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ... జిల్లా ఎల్లలు తెలియనివాళ్లను గెలిపించుకుంటే అభివృద్ధి కుంటుబడుతుందన్నారు. నాయకులు కొండబాల కోటేశ్వరరావు, వెంకటరమణ, రాంమూర్తి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ రోడ్షోను విజయవంతం చేయండి: అజయ్
రఘునాథపాలెం, న్యూస్టుడే: భారాస అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఖమ్మంలో సోమవారం(29న) జరిగే రోడ్షోను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. రఘునాథపాలెం మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన తన నివాసంలో శనివారం సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం, రోడ్షో వంటి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీరా ఈరూ నాయక్, మాదంశెట్టి హరిప్రసాద్, మెంటెం రామారావు, భూక్యా లక్ష్మణ్నాయక్, నాగండ్ల భద్రయ్య పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ను సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్లో శనివారం మాట్లాడారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వాహనాలు ఆపేయాలన్నారు. -
పోలింగ్ ముగిసే వరకు ‘నిశ్శబ్దం’
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. పోలింగ్ క్రతువు ముగింపునకు 48 గంటల ముందు నుంచి నిశ్శబ్ద కాలం (సైలెంట్ పీరియడ్) అమల్లోకి వస్తుంది. -
గళాలు.. బలాలు
[ 12-05-2024]
ప్రముఖులు గెలుపొందిన నేల.. పలు సందర్భాల్లో భిన్నమైన ఫలితానిచ్చిన నియోజకవర్గం ఖమ్మం పార్లమెంటరీ స్థానం.. అతిరథుల పోటీ నేపథ్యంలో ఈసారి ప్రచారం హోరాహోరీగా సాగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక అంశంతోనే నియోజకవర్గం, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. -
పోలింగ్కు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ఓటుహక్కు ఆవశ్యకతను వివరిస్తూ నగరంలోని వివిధ కూడళ్లలో నిలువెత్తు బ్యాలెట్ యూనిట్ల ఫ్లెక్సీలు అమర్చారు. తప్పనిసరిగా ఓటేయాలని ప్రజలను చైతన్యపరుస్తున్నారు. -
‘రాహుల్ని ప్రధాని చేయటమే లక్ష్యం’
[ 12-05-2024]
శాసనసభ ఎన్నికల ఫలితాలు ఖమ్మం, మహబాబూబాద్ లోక్సభ స్థానాల్లో పునరావృతమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. -
అందుబాటులో ఉన్నా.. ఆశీర్వదించండి: నామా
[ 12-05-2024]
ఖమ్మం జిల్లా గొంతుకగా పనిచేసే తనను మరోసారి ఆశీర్వదించి లోక్సభకు పంపించాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. -
ఒక్క అవకాశమివ్వండి: తాండ్ర
[ 12-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపాకు ఒక్క అవకాశమివ్వాలని ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కోరారు. కులమతాలకు అతీతంగా తనను ఆశీర్వదించాలని బహిరంగ లేఖ ద్వారా శనివారం విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబు గెలుపు కోసం రాజశ్యామల యాగం
[ 12-05-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట పాలన అంతమై చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రాజశ్యామల యాగం నిర్వహించినట్టు తెదేపా తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గొల్లపూడి రామారావు అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
[ 12-05-2024]
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. కారేపల్లి అడ్డరోడ్డుకు చెందిన చింతా విజయలక్ష్మి(38) కారేపల్లిలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు తన చిన్నకుమారుడు వరుణ్సాయితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. -
సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్
[ 12-05-2024]
అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రియాంక అల కోరారు. కొత్తగూడెంలో శనివారం మాట్లాడారు. తుది దశ ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందికి పోలింగ్ కేంద్రాలను కేటాయించామన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!