21 మంది ధరావతు కోల్పోయారు..!
2019 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానంలో 21మంది అభ్యర్థులు ధరావతు కోల్పోయారు. వీరిలో జాతీయ పార్టీలైన సీపీఎం, భాజపా అభ్యర్థులుండటం విశేషం. జనసేన అభ్యర్థి కూడా ధరావతు కోల్పోయారు.
మధిర, న్యూస్టుడే: 2019 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానంలో 21మంది అభ్యర్థులు ధరావతు కోల్పోయారు. వీరిలో జాతీయ పార్టీలైన సీపీఎం, భాజపా అభ్యర్థులుండటం విశేషం. జనసేన అభ్యర్థి కూడా ధరావతు కోల్పోయారు. మొత్తం ఖమ్మం లోక్సభకు 23మంది పోటీ చేయగా కేవలం ఇద్దరు మాత్రమే తమ ధరావతు కాపాడుకున్నారు. 11,39,848 ఓట్లు పోలయ్యాయి. తెరాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 5,67,459 (49.78 శాతం) ఓట్లతో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరికి 3,99,397 ఓట్లు (35.04 శాతం), సీపీఎం అభ్యర్థి బోడా వెంకట్కు 57,102 ఓట్లు (5.01 శాతం), భాజపా అభ్యర్థి దేవకి వాసుదేవరావుకు 20,488 ఓట్లు (1.8 శాతం), జనసేన అభ్యర్థి నార్ల సత్యనారాయణకు 19,315 ఓట్లు (1.69 శాతం) లభించాయి. ఈ ఎన్నికల్లో నోటాకు 15,832 ఓట్లు (1.39శాతం) వచ్చాయి. మిగతా స్వతంత్ర అభ్యర్థులకు నామమాత్రంగా ఓట్లు లభించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ను సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్లో శనివారం మాట్లాడారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వాహనాలు ఆపేయాలన్నారు. -
పోలింగ్ ముగిసే వరకు ‘నిశ్శబ్దం’
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. పోలింగ్ క్రతువు ముగింపునకు 48 గంటల ముందు నుంచి నిశ్శబ్ద కాలం (సైలెంట్ పీరియడ్) అమల్లోకి వస్తుంది. -
గళాలు.. బలాలు
[ 12-05-2024]
ప్రముఖులు గెలుపొందిన నేల.. పలు సందర్భాల్లో భిన్నమైన ఫలితానిచ్చిన నియోజకవర్గం ఖమ్మం పార్లమెంటరీ స్థానం.. అతిరథుల పోటీ నేపథ్యంలో ఈసారి ప్రచారం హోరాహోరీగా సాగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక అంశంతోనే నియోజకవర్గం, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. -
పోలింగ్కు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ఓటుహక్కు ఆవశ్యకతను వివరిస్తూ నగరంలోని వివిధ కూడళ్లలో నిలువెత్తు బ్యాలెట్ యూనిట్ల ఫ్లెక్సీలు అమర్చారు. తప్పనిసరిగా ఓటేయాలని ప్రజలను చైతన్యపరుస్తున్నారు. -
‘రాహుల్ని ప్రధాని చేయటమే లక్ష్యం’
[ 12-05-2024]
శాసనసభ ఎన్నికల ఫలితాలు ఖమ్మం, మహబాబూబాద్ లోక్సభ స్థానాల్లో పునరావృతమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. -
అందుబాటులో ఉన్నా.. ఆశీర్వదించండి: నామా
[ 12-05-2024]
ఖమ్మం జిల్లా గొంతుకగా పనిచేసే తనను మరోసారి ఆశీర్వదించి లోక్సభకు పంపించాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. -
ఒక్క అవకాశమివ్వండి: తాండ్ర
[ 12-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపాకు ఒక్క అవకాశమివ్వాలని ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కోరారు. కులమతాలకు అతీతంగా తనను ఆశీర్వదించాలని బహిరంగ లేఖ ద్వారా శనివారం విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబు గెలుపు కోసం రాజశ్యామల యాగం
[ 12-05-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట పాలన అంతమై చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రాజశ్యామల యాగం నిర్వహించినట్టు తెదేపా తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గొల్లపూడి రామారావు అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
[ 12-05-2024]
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. కారేపల్లి అడ్డరోడ్డుకు చెందిన చింతా విజయలక్ష్మి(38) కారేపల్లిలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు తన చిన్నకుమారుడు వరుణ్సాయితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. -
సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్
[ 12-05-2024]
అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రియాంక అల కోరారు. కొత్తగూడెంలో శనివారం మాట్లాడారు. తుది దశ ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందికి పోలింగ్ కేంద్రాలను కేటాయించామన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ