కిరాణా కొట్లలో మద్యం విక్రయాలు
ఖమ్మం కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఓ కిరాణా దుకాణంలో మద్యం సీసాలు దొరికాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందు ఈ ప్రాంతంలో నాలుగు బెల్ట్ దుకాణాలు ఉండేవి.
ఎన్నికల వేళ సవాలుగా నియంత్రణ
తిరుమలాయపాలెం మండలంలో సారాబట్టి ధ్వంసం చేస్తున్న సిబ్బంది
ఖమ్మం సారథినగర్, న్యూస్టుడే: ఖమ్మం కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఓ కిరాణా దుకాణంలో మద్యం సీసాలు దొరికాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందు ఈ ప్రాంతంలో నాలుగు బెల్ట్ దుకాణాలు ఉండేవి. నిర్వాహకులను బైండోవర్ చేశారు. చుట్టుపక్కల డిమాండ్ను గుర్తించిన చిరు వ్యాపారులు కిరాణా దుకాణాలు, జ్యూస్ పాయింట్లు, హోటళ్లలో విక్రయాలు మొదలు పెట్టారు. ఓ బెల్ట్ దుకాణాన్ని మూసేస్తే పదుల సంఖ్యలో పుట్టుకొస్తుండటంతో అధికారులు తల పట్టుకుంటున్నారు.
- అనుమానిత బెల్ట్ దుకాణాల వివరాలు, నిందితుల సమాచారం ఆ శాఖ వద్ద ఉంది. కొత్తగా పుట్టుకొచ్చినవి మాత్రం ఇప్పటి వరకు నిఘా కంట పడకుండా కొనసాగుతున్నాయి. వరుసగా దుకాణాలన్ని సోదా చేసుకుంటూ పోతే తప్ప అక్రమ మద్యం ఆచూకీ దొరకదు. ఈ పరిస్థితి మొత్తం ఆబ్కారీశాఖనే గందరగోళంలోకి నెట్టింది.
ఎస్సైల కొరత
ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యవేక్షించే ఎన్ఫోర్స్మెంట్, రెండు జిల్లా టాస్క్ఫోర్స్ విభాగాలు, ఖమ్మం, కొత్తగూడెం కేంద్రాలు పని చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఏడు ఆబ్కారీ స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్లలో ఎస్సైల కొరత ఉంది. ఖమ్మం టాస్క్ఫోర్స్ విభాగంలో ఎస్సై లేడని ఖమ్మం 2 స్టేషన్లోని ఎస్సైని ఇక్కడికి తీసుకువచ్చారు. పాత నేరస్థులు, నేరాలు, అక్రమాలు ఎక్కువగా ఖమ్మం స్టేషన్ 2 పరిధిలోనే ఉన్నాయి. ఆ స్టేషన్లో ఇప్పుడు ఓ మహిళా ఎస్సై ఉన్నారు. రెండు స్టేషన్లలో ఇద్దరేసి ఎస్సైలు ఉన్నారు. అక్కడికి కొత్తగా వచ్చిన సి.ఐ.లు తమ వద్ద ఉన్న ఎస్సైలను మారిస్తే ఇబ్బందులు ఉంటాయని, అవగాహన వచ్చే వరకైనా వారి అవసరం ఉందని చెబుతుండటంతో సర్దుబాటు చేయలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మూడు నెలల కిందటి వరకు ఉరుకులు పరుగులు పెట్టిన తనిఖీ బృందాలు ఇప్పుడు డీలా పడ్డాయి.
సంధికాలంలో అయోమయం
రెండు నెలల కిందట ఆబ్కారీశాఖలో సి.ఐ., ఎస్సైల బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన వారే అధికంగా ఉన్నారు. వీరిలో ఒకరిద్దరికి మినహా జిల్లాపై పట్టులేదు. వీరిలో కొందరు శుక్రవారం తమ ఊరెళ్లి వీలైతే సోమవారం, లేదా మంగళవారం వస్తున్నారని శాఖలో వినికిడి. కారణాలేవైనా దిశానిర్దేశం చేసే అధికారులు మూడు, నాలుగు రోజులే ఉంటున్న పరిస్థితుల్లో ఆ ప్రభావం కిందిస్థాయి సిబ్బందిపైనా పడింది. ఈ సంధికాలాన్ని అక్రమార్కులు అదునుగా మార్చుకున్నారు. గతంలో పూర్తిగా రూపుమాపామని చెప్పుకునే గుడుంబా ఇప్పుడు గుప్పుమంటోంది. పాత నేరస్థులు తిరిగి రంగంలోకి దిగి గ్రామీణ ప్రాంతాల సరిహద్దుల్లో బట్టీలు ఏర్పాటు చేసినట్టు వచ్చిన సమాచారంతో ఆబ్కారీశాఖలో కలవరం మొదలైంది. ఉన్నతాధికారులు అప్రమత్తత ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో తనిఖీలు జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.
నియంత్రిస్తున్నాం
నాగేంద్రరెడ్డి, ఖమ్మం ఆబ్కారీశాఖ అధికారి
ఎస్సైల కొరత ఉంది. లేనిచోట సర్దుబాటు చేస్తున్నాం. ఏ స్టేషన్ పరిధిలోని సమస్యలు అక్కడ ఉన్నాయి. ఉన్నంతలో ఉన్నవారిని అప్రమత్తం చేస్తూ తనిఖీలు ముమ్మరం చేశాం. ఇప్పటి వరకు 377 కేసులు నమోదు చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటుకు పోటెత్తారు
[ 14-05-2024]
సార్వత్రిక సమరంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఓటర్లు మరోసారి చైతన్యం చాటారు. పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బడిముబ్బడిగా బారులు కనిపించనప్పటికీ ఎక్కువ మంది ఓటేసేందుకు ఆసక్తి కనబరిచారు. కొంతమంది ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
ఓటుకు పట్టం..!
[ 14-05-2024]
ఓటు చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. ‘తెల్లావారకముందే పల్లే లేచింది..’ అన్న చందంగా గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలారు. -
అట్టహాసంగా శ్రీరామ పునర్వసు దీక్షల విరమణ
[ 14-05-2024]
ఆలయంలో సోమవారం శ్రీరామ పునర్వసు దీక్షల విరమణ పూజలు అట్టహాసంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న స్వీకరించిన దీక్షలను ఇక్కడి భద్రుడి మండపంలో విరమించారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 14-05-2024]
కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన సీబీఎస్ఈ పదో తరగతి, 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఖమ్మం ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు సత్తాచాటారు. మంచి మార్కులు సాధించి ప్రతిభ చూపారు. విద్యార్థులను ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు అభినందించాయి. -
అడవి బిడ్డ ప్రసవ వేదన
[ 14-05-2024]
సరైన రహదారి లేకపోవడంతో ఓ నిండు గర్భిణి మూడు కి.మీ. దూరం అడవిలోంచి ద్విచక్రవాహనంపై ప్రయాణించాల్సి వచ్చింది. పురిటినొప్పులకు తోడు.. అరగంట పాటు ప్రయాణ బాధ ఓర్చుకోక తప్పలేదామెకు. -
ప్రశాంతంగా పోలింగ్
[ 14-05-2024]
ఖమ్మం, మహబూబాబాë్ లోక్సభ స్థానాల పరిధిలోని భద్రాద్రి జిల్లాలో అయిదు శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టô్ ప్రియాంక అల ఒక తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం