logo

ఈసారీ అధిక మెజార్టీ ఇవ్వండి: నామా

గత లోక్‌సభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని, ఈసారి మరింత ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు.

Published : 02 May 2024 06:31 IST

ఎంవీపాలెంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తాతా మధు, పక్కన ఎంపీ నామా, మాజీ ఎమ్మెల్యే కందాళ
ఖమ్మం గ్రామీణం: గత లోక్‌సభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని, ఈసారి మరింత ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఎంవీపాలెం, పెద్దతండాలో బుధవారం ప్రచారం నిర్వహించారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు. మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ నామాకు అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ  తెలంగాణవాదాన్ని పార్లమెంట్‌లో వినిపించేది భారాస మాత్రమేనన్నారు. బెల్లం వేణు, బెల్లం ఉమ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని