ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: పొంగులేటి
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు
ఖమ్మం: కార్డు పోస్టు చేస్తున్న మంత్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి, చిత్రంలో తెదేపా నేతలు రామనాథం, హరీశ్చంద్ర తదితరులు
ఖానాపురం హవేలి, న్యూస్టుడే: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మంలోని తెదేపా కార్యాలయానికి పొంగులేటి, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి బుధవారం వెళ్లారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని 72 రోజులుగా తెదేపా పార్లమెంటరీ కమిటీ ప్రధాన కార్యదర్శి హరీశ్చంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి మంత్రి మద్దతు తెలిపారు. సీఎంగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయన్నారు. రఘురాంరెడ్డి మాట్లాడుతూ తన వివాహానికి ఎన్టీఆర్ వచ్చారని గుర్తుచేసుకున్నారు. సినీనటుడు బాలకృష్ణ, తాను క్లాస్మేట్స్ అని చెప్పారు. తెదేపా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం, కొండబాల కరుణాకర్, కన్నేటి పృథ్వీ, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం కమాన్బజార్: కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మే డేను పురస్కరించుకొని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కార్మిక సంఘం నాయకుడు నున్నా మాధవరావు ఆధ్వర్యంలో వాహన ర్యాలీ నిర్వహించారు. వివిధ సంఘాల కార్మికులు కాంగ్రెస్లో చేరారు. రూ.100కోట్లతో మార్కెట్ను అభివృద్ధి పరుస్తామని మంత్రులు తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మానుకొండ రాధాకిశోర్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్తా సీతారాములు పాల్గొన్నారు.
ఏన్కూరు, తల్లాడ: కేంద్రంలోని భాజపా సర్కారు విభజన హామీలను విస్మరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఏన్కూరు, తల్లాడలో బుధవారం రోడ్షో నిర్వహించారు. పదేళ్లు పరిపాలించిన కేసీఆర్ తన ఆస్తులు పెంచుకున్నారే తప్ప సామాన్యులను పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయని కేసీఆర్ రైతుల కోసం ఏదో ఉద్ధరిస్తానని మాట్లాడటం విడ్డూరంగా ఉందని దెప్పిపొడిచారు. ఖమ్మంలో నామాను గెలిపిస్తే కేంద్ర మంత్రి చేస్తానని కేసీఆర్ చెబుతున్నారని, అంటే కేసీఆర్ ఏపార్టీతో టచ్లో ఉన్నారో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే ఐదేళ్లపాటు ఇక్కడే ఉంటూ సేవ చేస్తానన్నారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి, మాలోతు రాందాస్నాయక్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, బొర్రా రాజశేఖర్, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, వేముల కృష్ణప్రసాద్, పిడమర్తి రవి, స్వర్ణ నరేందర్, బేబీ స్వర్ణకుమారి పాల్గొన్నారు.
ఖమ్మం కమాన్బజార్: దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. విజయ సంకల్ప్ యాత్ర-2 ఖమ్మం చేరుకున్న సందర్భంగా డీసీసీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో దివ్యాంగుల సంక్షేమం కోసం ఆరు అంశాలను పొందుపరిచినట్లు వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు మహ్మద్ జావేద్, కుంచెం ఉప్పలయ్య, సౌజన్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుణమాఫీపై కదలిక.. అర్హుల జాబితా రూపకల్పనలో అధికారుల నిమగ్నం
[ 16-05-2024]
ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టత ఇచ్చారు. పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించిన కసరత్తు మొదలైంది. -
వన్యప్రాణులకు నీటి వసతి
[ 16-05-2024]
వేసవి తాపానికి మనుషులే తట్టుకోలేకపోతున్నారు. అడవుల్లో ఉండే జంతువులు, పక్షులు అల్లాడుతున్నాయి. తాగేందుకు నీరు లభించక సమీప గ్రామాల్లోకి వచ్చి కుక్కల దాడులు, వేటగాళ్ల ఉచ్చులకు బలైపోతున్నాయి. -
మళ్లీ కబ్జా కూత
[ 16-05-2024]
ఇల్లెందు రైల్వే స్టేషను నుంచి రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైలు 2006లో రద్దయింది. ఆ తర్వాత శాఖ అధికారులు సంస్థ స్థలాల పరిరక్షణపై నిర్లక్ష్యం ప్రదర్శించటంతో తొలినాళ్లలోనే పెద్ద మొత్తంలో అన్యాక్రాంతమయ్యాయి. -
ఇక పట్టభద్రులపై గురి
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. ఈ ఎన్నిక బరిలో 52 మంది ఉండగా.. 27న తేదీన పోలింగ్ జరగనుంది. -
విద్యా సమాచార నిర్వహణకు ట్యాబ్లు
[ 16-05-2024]
పాఠశాల స్థాయి నుంచే విద్యా సమాచారం, నివేదికలను ఆన్లైన్లో పంపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ గతేడాది మార్చిలో ట్యాబ్లను అందజేసింది. వాటికి ఇంటర్నెట్ డేటా కోసం కావాల్సిన సిమ్ కార్డులను తాజాగా పంపిణీ చేసింది. -
రేపట్నుంచి బొమ్మ బంద్
[ 16-05-2024]
సినిమా థియేటర్లు ఈ నెల 17(శుక్రవారం) నుంచి మూగబోనున్నాయి. ప్రేక్షకుల సందడి లేక అవి కళతప్పనున్నాయి. -
స్ట్రాంగ్ రూంలకు పటిష్ఠ భద్రత: కలెక్టర్
[ 16-05-2024]
స్ట్రాంగ్ రూంల వద్ద సాయుధ బలగాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
సమస్యలు పరిష్కరిస్తేనే స్థాయి నిలిచేది!
[ 16-05-2024]
జిల్లాలో జరిగిన అభివృద్ధిని, చేయాల్సిన పనులను బేరీజు వేసుకోవడంలో స్థాయీ సంఘాల సమావేశాలు కీలకపాత్ర పోషిస్తాయి. జిల్లా ప్రజా పరిషత్ పరిధిలోని ఏడు స్థాయీ సంఘాల సమావేశాలను గురువారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
జూన్ 4 వరకు దరఖాస్తు గడువు పెంపు
[ 16-05-2024]
సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్ 4వ తేదీ వరకు పొడిగించింది. -
డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల కన్నుమూత
[ 16-05-2024]
భారాస నేత, ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు(69) అనారోగ్యంతో కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఆయన కాలేయ(లివర్) సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. -
మనసున్న రాజు..
[ 16-05-2024]
ఒకటీ రెండు కాదు.. ఏకంగా 40 గోవులు ఆ గడిలో కన్పిస్తుంటాయి.. ఇదేదో గోశాల అనుకుంటే పొరబాటు.. అలాగని విరాళాలు సేకరించి పశువుల బాగోగులు చూసే సంస్థ అంతకన్నా కాదు. -
తిరుగు ప్రయాణ తిప్పలు
[ 16-05-2024]
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి ముగియడంతో తమ స్వస్థలాల నుంచి వివిధ ప్రాంతాల వారు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. -
ఎన్నికల వేళ ఆర్టీసీకి ఆదాయం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 14 వరకు ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. ఖమ్మం రీజియన్ పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లాకు వచ్చివెళ్లిన ఓటర్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని -
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి: రాహుల్ బొజ్జ
[ 16-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నిక జిల్లా సాధారణ పరిశీలకులు రాహుల్ బొజ్జ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
-
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!