జీవో 1.. బ్రిటిషు పాలనను తలదన్నేలా ఉంది
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన.. బ్రిటిషు పాలనను తలదన్నేలా ఉందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన.. బ్రిటిషు పాలనను తలదన్నేలా ఉందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన గురువారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతుల విషయంలో డీజీపీ వింత పోకడలతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఆదేశాలతో పోలీసు శాఖ అనవసరమైన షరతులు పెడుతోందని.. ఇది పోలీసు వ్యవస్థకే సిగ్గు చేటన్నారు. దండి యాత్రకు కూడా ఆనాటి బ్రిటిషు పాలకులు ఇన్ని ఆంక్షలు పెట్టలేదని చెప్పారు. మీ పాలనలో డొల్లతనాన్ని, మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. ఇప్పటికే అవినీతిలో నంబరు 1గా నిలిచిన మీరు.. ఒకటో నంబరు జీవో తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడు రోడ్షోలకు హాజరవుతున్న జనాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని.. చంద్రబాబును నిలువరించేందుకు.. లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు జీవో 1 తీసుకొచ్చారని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైన జీవో అని తెలిపారు. దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. లోకేశ్ పాదయాత్రకు పోలీసు శాఖ పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్