logo

రాష్ట్రంలో కూటమి అభ్యర్థులదే విజయం

ఏపీలో తెదేపా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 28 Apr 2024 02:40 IST

మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

చిప్పగిరి, న్యూస్‌టుడే : ఏపీలో తెదేపా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. చిప్పగిరిలో మండల తెదేపా నాయకులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని.. చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు జనం ఎదురు చూస్తున్నారన్నారు. 150 సీట్లకు పైగా ఎమ్మెల్యే, 22 ఎంపీ అభ్యర్థులను గెలిచి తెదేపా విజయ ఢాంకా మోగిస్తుందన్నారు. ఆలూరు నియోజకవర్గంలో వీరభద్రగౌడ్‌ను గెలిపించాలని ఆయన తెదేపా నాయకులు, కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ  మాజీ సభ్యుడు ఏరూరు మీనాక్షినాయుడు, కోనంకి మహేశ్‌, యల్లంకి రజనీ, నాగరాజు, బెల్డోణ వెంకటేశ్‌, భీమలింగప్ప, తిమ్మయ్య, పులికొండ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు