రాష్ట్రంలో కూటమి అభ్యర్థులదే విజయం
ఏపీలో తెదేపా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు
చిప్పగిరి, న్యూస్టుడే : ఏపీలో తెదేపా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. చిప్పగిరిలో మండల తెదేపా నాయకులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని.. చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు జనం ఎదురు చూస్తున్నారన్నారు. 150 సీట్లకు పైగా ఎమ్మెల్యే, 22 ఎంపీ అభ్యర్థులను గెలిచి తెదేపా విజయ ఢాంకా మోగిస్తుందన్నారు. ఆలూరు నియోజకవర్గంలో వీరభద్రగౌడ్ను గెలిపించాలని ఆయన తెదేపా నాయకులు, కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఏరూరు మీనాక్షినాయుడు, కోనంకి మహేశ్, యల్లంకి రజనీ, నాగరాజు, బెల్డోణ వెంకటేశ్, భీమలింగప్ప, తిమ్మయ్య, పులికొండ, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నంద్యాల ఎస్పీ రఘువీర్రెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశం
[ 12-05-2024]
నంద్యాల ఎస్పీ రఘువీర్రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
ఏది కావాలో తేల్చుకోండి
[ 12-05-2024]
రూ.10 ఇచ్చి రూ.100 లాగే దొంగ కావాలా? మీ ఖర్చులు తగ్గించే నాయకుడు కావాలా?’ అన్న విషయాలను ప్రజలు తేల్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నంద్యాలకు ఉప ఎన్నికకు వచ్చి రోడ్లు విస్తరణ చేయించాం.. నంద్యాల అభివృద్ధి కావాలంటే అది తెదేపాతోనే సాధ్యం.. -
ఉపాధి కల్పించి.. వలసలు నివారిస్తాం
[ 12-05-2024]
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉపాధి కల్పించి వలసలు నివారిస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదోని పురపాలక మైదానంలో శనివారం నిర్వహించిన ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
అమ్మకు జగన్మోసం...
[ 12-05-2024]
అమ్మఒడికి దూరం చేశావు.. సాంకేతిక లోపాలు ముడిపెట్టావు. జగనన్న కాలనీల్లో ఇళ్లిస్తానన్నావు.. జలమయమైనా జాలిచూపలేకపోయావు. ఇంటింటికీ నీళ్లిస్తానన్నావు.. అసంపూర్తి పనులతో కన్నీళ్లే మిగిల్చావు. సున్నావడ్డీ రుణమన్నావు.. అమలుకు గుండుసున్నా చుట్టావు. -
భారం మోపారు.. బాధులు పెట్టారు
[ 12-05-2024]
జగనన్న జమానాలో సంపద సృష్టించటం తెలియదు.. ఉపాధి కల్పించడం ఇష్టం ఉండదు.. అభివృద్ధి అసలే గిట్టదు.. ఆదాయం కోసం జనాలపై పడ్డారు.. సందు దొరికితే చాలు బాదేస్తున్నారు.. ప్రజల నుంచి ఏదోరూపంలో పిండుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12.84 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారు. ధరల పెరుగుదల వీరిపై తీవ్ర ప్రభావం పడింది. -
మద్యం దుకాణాలు, బార్లు బంద్
[ 12-05-2024]
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూతపడ్డాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు మద్యం విక్రయాలు ఆపేసేలా చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖను ఆదేశిస్తూ కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు ఇచ్చారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
[ 12-05-2024]
పోలింగ్కు ముందు 48 గంటల నుంచి ముగిసే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.కె.శ్రీనివాసులు ఆదేశించారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
[ 12-05-2024]
స్వాత్రిక ఎన్నికల వేళ జిల్లాలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో పది చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. -
ముగిసిన ప్రచార పర్వం
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానానికి జరగనున్న ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. -
పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు
[ 12-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లి, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 13,89,307 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. -
ఓటరుపై వైకాపా నాయకుల దాడి
[ 12-05-2024]
వైకాపాకు ఓటు వేయను అన్న కారణంగా ఓ యువకుడిపై ఆ పార్టీ నాయకులు దాడి చేసిన ఘటన శనివారం రాత్రి ఆస్పరిలో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ