చెత్తపై పన్ను వేసిన చెత్తప్రభుత్వమిది : తెదేపా అభ్యర్థి
చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వమిదేనని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
ఎమ్మిగనూరు వ్యవసాయం : చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వమిదేనని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 23వార్డులో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచి ప్రజలపై పన్ను భారం మోపిందన్నారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ చెప్పిన మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని, ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా అప్రమత్తంగా ఓటు వేయాలని సూచించారు. సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ప్రచారంలో కొండయ్య చౌదరి, సుందరరాజు, రామదాసు గౌడ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం