logo

dddd: వైకాపా నుంచి తెదేపాలో చేరిక

 పత్తికొండ మండలం  మండగిరి గ్రామానికి చెందిన వైకాపా పార్టీకి చెందిన 15 కుటుంబాలు తెదేపాలో చేరాయి.

Published : 28 Apr 2024 19:21 IST

పత్తికొండ రూరల్‌:  పత్తికొండ మండలం  మండగిరి గ్రామానికి చెందిన వైకాపా పార్టీకి చెందిన 15 కుటుంబాలు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కేఈ శ్యాం బాబు, మండగిరి తెదేపా నాయకుడు గోపాల్ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. పత్తికొండ తెదేపా కార్యాలయంలో శ్యాం బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జ్ఞగత నాలుగున్నర సంవత్సర వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులమై వైకాపా నుంచి తెదేపాలో చేరామని పేర్కొన్నారు. వచ్చే నెల 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో శ్యాంబాబు గెలుపుకై కృషిచేస్తామని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని