వైకాపాను నమ్మి మళ్లీ మోసపోవద్దు
ఆదోని పట్టణంలోని శివశంకర్నగర్లో భాజపా అభ్యర్థి డా.పార్థసారథి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట తెదేపా సీనియర్ నాయకులు భూపాల్చౌదరి, తెదేపా మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు.
ఆదోని మార్కెట్, న్యూస్టుడే: ఆదోని పట్టణంలోని శివశంకర్నగర్లో భాజపా అభ్యర్థి డా.పార్థసారథి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట తెదేపా సీనియర్ నాయకులు భూపాల్చౌదరి, తెదేపా మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు.
ఆదోని సాంస్కృతికం, న్యూస్టుడే: ఆదోని మండలం సంతేకూడ్లురు, యడవల్లి, హనవాళు గ్రామాల్లో ఆదివారం భాజపా అభ్యర్థి డాక్టరు పార్థసారథి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు.
హాలహర్వి, న్యూస్టుడే: వైకాపా విడుదల చేసిన మేనిఫెస్టో చూస్తే... వైకాపాకు ఓటమి ఖాయమని ఆలూరు నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి వీరభద్రగౌడు అన్నారు. హాలహర్వి మండలంలోని అర్ధగేరి, మేదేహల్, చింతకుంట, ఎంకేపల్లి, బేవినహల్, సాకిబండ, కొక్కరచేడు గ్రామాల్లో ఆదివారం తెదేపా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. మండల కన్వీనర్ సుధాకర్, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణంనాయుడు, హాలహర్వి సర్పంచి మల్లికార్జున, నాయకులు, ప్రహ్లాదరెడ్డి పాల్గొన్నారు.
మద్దికెర, న్యూస్టుడే: మద్దికెరలో గ్రామ దేవత మద్దమ్మ ఆలయంలో పూజల అనంతరం తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజన్న, తెదేపా పార్లమెంట్ కార్యదర్శి ధనుంజయ, ఎన్నికల ఇన్ఛార్జి దివాకర్గౌడ్, మండల కన్వీనరు శివప్రసాద్ ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో ఆ పార్టీ నాయకులు చంద్రశేఖరగౌడ్, రఘు, లక్ష్మన్న, రంగయ్య, జానకి, రామాంజులు, విఠోభ పాల్గొన్నారు.
ఆర్.మండగిరి(పత్తికొండ గ్రామీణం), న్యూస్టుడే: పత్తికొండ మండలం ఆర్.మండగిరి గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆదివారం తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు గోపాల్ ఆధ్వర్యంలో ఖలీల్, దూద్పీరా, అమీన్, సాహెబ్బాషా, సుభాన్బాబు, రజాక్, మాబుసుభాన్, రహీం పార్టీలో చేరారు.
బాపనదొడ్డి(కృష్ణగిరి), న్యూస్టుడే: పత్తికొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబుకు మద్దతుగా మండలంలోని బాపనదొడ్డి గ్రామంలో ఆ పార్టీ యువ నాయకుడు కేఈ నందీశ్బాబు ఆదివారం ప్రచారం చేశారు. మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేవనకొండ, న్యూస్టుడే: మండలంలోని కరిడికొండ, కరివేముల, ఈదులదేవరబండ, మాచాపురంలో తెదేపా నాయకులు బొజ్జమ్మ, విజయ్భాస్కర్గౌడు, గిరిమల్లేశ్గౌడు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఉచ్చీరప్ప, రంగన్న, మల్లికార్జునరెడ్డి, రాజాసాబ్, రామచంద్రనాయుడు, మలకన్న, రాజశేఖర్, పెద్దయ్య పాల్గొన్నారు.
హొళగుంద, న్యూస్టుడేË: హొళగుందలోని 2వ వార్డులో తెదేపా నాయకులు తిప్పయ్య, గోవిందగౌడ్, ఆదంబాషా, పంపాపతి, దుర్గయ్య, భాజపా నాయకులు చిదానంద ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఈరప్ప, వీరన్నగౌడ, ఎర్రిస్వామి, లక్ష్మణ్న, మంజు, బసవ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!