logo

వర్షాలు సమృద్ధిగా కురవాలని సప్తభజనలు

మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఖరీఫ్,  రబీ సీజన్లలో  సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని సప్త భజనలు నిర్వహిస్తున్నారు.

Published : 29 Apr 2024 13:26 IST

ఆస్పరి :  మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఖరీఫ్,  రబీ సీజన్లలో  సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని సప్త భజనలు నిర్వహిస్తున్నారు. సోమవారం గ్రామ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఓం నమశ్శివాయ నామస్మరణ చేసుకుంటూ  భక్తులు సప్త భజన చేశారు. దీంతో గ్రామంలో  శివనామస్మరణతో మారుమోగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని