శిశువు అపహరణకు యత్నం
కర్నూలు సర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగం నుంచి ప్రమీల అనే మహిళ బుధవారం రాత్రి 7 గంటలకు నవజాత శిశువును ఎత్తుకెళ్తూ సెక్యూరిటీ గార్డుకు పట్టుబడటం సంచలనంగా మారింది.
పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది
పట్టుబడిన ప్రమీల
కర్నూలు వైద్యాలయం, కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే : కర్నూలు సర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగం నుంచి ప్రమీల అనే మహిళ బుధవారం రాత్రి 7 గంటలకు నవజాత శిశువును ఎత్తుకెళ్తూ సెక్యూరిటీ గార్డుకు పట్టుబడటం సంచలనంగా మారింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ మూడు రోజుల కిందట పెద్దాస్పత్రిలో చేరి మగ పిల్లాడికి జన్మనిచ్చింది. పక్క బెడ్డులో ఉన్న ప్రమీల అనే మహిళ జ్యోతితో మాటలు కలిపింది. తానూ ప్రసవం కోసం వచ్చానంటూ రెండు రోజులుగా వారితో చనువుగా ఉంటోంది. పిల్లాడు బాగున్నాడని.. తన భర్తకు చూపించి తీసుకొస్తానని ప్రమీల చెప్పడంతో జ్యోతి నమ్మి శిశువును ఇచ్చింది. ప్రమీల బుధవారం రాత్రి బిడ్డను ఎత్తుకుని గైనిక్ విభాగం ప్రధాన గేటు నుంచి వస్తుండగా బయట కాపలాగా ఉన్న మధు అనే సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకుని పిల్లాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావంటూ నిలదీశారు. డిశ్ఛార్జి కార్డు చూపమని చెప్పడంతో ఆమె సమాధానం చెప్పలేక పట్టుబడింది. వెంటనే సమాచారం అందుకున్న సెక్యూరిటీ పర్యవేక్షకుడు సర్వేశ్వరయ్య ఆమెను మూడో పట్టణ పోలీసుస్టేషన్లో అప్పగించారు. తనది ఆదోని ప్రాంతమని, ప్రస్తుతం కర్నూలు పాత నగరంలో ఉంటున్నానని.. తన భర్త హమాలీ పని చేస్తాడని ప్రమీల చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా ఆస్పత్రిలో కొన్నేళ్లుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటాభిషేకం
[ 15-05-2024]
‘ఓటు’ చైతన్యం వికసించింది.. పల్లెలన్నీ పోలింగ్ కేంద్రాల వైపు అడుగులేశాయి.. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఓటర్లు వరుసలో నిల్చొని ఓర్పుగా ఓటేశారు. యువకులు, వృద్ధులు, మహిళలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.. -
ఏకపక్ష గ్రామాల్లో ఎగిరిన స్వేచ్ఛా జెండా
[ 15-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు గ్రామాల్లో ఫ్యాక్షన్ పడగ నీడలో నలిగిపోయాయి.. ఆయా గ్రామాల్లో చాలా వరకు వైకాపా పార్టీ నేతల పెత్తనం కొనసాగుతోంది. అక్కడ వారు చెప్పిందే శాసనం.. ఎన్నికల ప్రక్రియకు వచ్చే సరికి ఏకపక్షంగా సాగుతుంది.. -
తిరుగు ప్రయాణంలో తిప్పలు
[ 15-05-2024]
ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఓటు వేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం తిరుగుముఖం పట్టారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని బస్టాండ్లు మంగళవారం కిటకిటలాడాయి. -
గెలుపు లెక్కలపై నేతల సమీక్ష
[ 15-05-2024]
పోలింగ్ ముసిగింది.. ఫలితం ‘ఓటు’ యంత్రంలో నిక్షిప్తమైంది.. ఫలితానికి 20 రోజులు నిరీక్షించాలి.. నేతలంతా 56 రోజుల పాటు తీరక లేకుండా గడిపారు.. వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు పన్నారు.. -
ఈవీఎంలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
[ 15-05-2024]
మండలంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలల్లోని ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. -
జగన్ ఇంటికెళ్లడం ఖాయం
[ 15-05-2024]
రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో సాగిన జగన్ రాక్షస పాలనకు ఓటు అనే ఆయుధంతో ప్రజలు చరమగీతం పాడారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. -
బుగ్గన అరాచకాలన్నింటిపైనా విచారణ చేస్తాం: కోట్ల
[ 15-05-2024]
మంత్రిబుగ్గన అరాచకాలన్నింటిపైనా విచారణ చేయిస్తామని కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం స్థానిక తెదేపా కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
వాట్సప్ పోస్టు పెట్టారని తెదేపా కార్యకర్తలపై దాడి
[ 15-05-2024]
వాట్సప్లో తమకు వ్యతిరేకంగా పోస్టు పెట్టారన్న అక్కసుతో తెదేపా కార్యకర్తలపై వైకాపా వారు దాడికి పాల్పడిన ఘటన పగిడ్యాల మండలం పడమర ప్రాతకోట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. -
ద్విచక్రవాహనాల ఢీ.. ఒకరి మృతి
[ 15-05-2024]
తుగ్గలి మండలం రాంపల్లి గ్రామ సమీపంలో ఆర్ఎస్ పెండేకల్లు రహదారిలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. -
అసంపూర్తి పనులతో అవస్థలు
[ 15-05-2024]
డోన్ పట్టణంలోని ఐటీఐలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం లేకపోవడంతో ఇవి ఎప్పటికి పూర్తవుతాయోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. -
పంచ్ కొడితే పతకమే..
[ 15-05-2024]
పంచ్ కొడితే పతకాల పంట పండటమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ చిన్నారులు. కరాటే సాధనతో శారీరక దృఢత్వంతో పాటుగా మానసికోల్లాసం కలుగుతుందౠ చెబుతున్నారు చిన్నారుల తల్లిదండ్రులు. -
మందుబాబులతో దుకాణాల కిటకిట
[ 15-05-2024]
ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లు మందుబాబులతో మంగళవారం కిటకిటలాడాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో 175 మద్యం దుకాణాలు