కమలం అభ్యర్థి ఖరారు
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసే మొదటి జాబితాలో నాగర్కర్నూల్కు చోటు లభించింది.
నాగర్కర్నూల్ బరిలో భరత్ప్రసాద్
ఈనాడు, మహబూబ్నగర్: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసే మొదటి జాబితాలో నాగర్కర్నూల్కు చోటు లభించింది. ఈ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్ పోటీ చేయనున్నారు. కమలనాథులు శనివారం విడుదల చేసిన మొదటి జాబితాలో ఆయన పేరు ప్రకటించారు. అనూహ్యంగా మూడు రోజుల క్రితమే రాములు, ఆయన కుమారుడు భరత్ప్రసాద్ భాజపాలో చేరారు. గత మూడు నెలలుగా వారు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. భరత్కు నాగర్కర్నూల్ టిక్కెట్ ఇస్తే తాను పార్టీ మారుతానని చెప్పారు. ఇటీవలే భాజపా అధిష్ఠానం నుంచి టిక్కెట్ విషయంలో హామీ లభించడంతో రాములు భారాస వీడారు. అనూహ్యంగా మొదటి జాబితాలోనే నాగర్కర్నూల్ భాజపా అభ్యర్థిని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బంగారు శృతి పోటీ చేశారు. ఈసారి కూడా ఆమె బరిలోనే ఉంటారని భావించారు. ఎస్సీ స్థానం కావడంతో పోటీ అంతగా లేకపోవడంతో ఆమెకే అధిష్ఠానం టిక్కెట్ ఖరారు చేస్తుందనుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా భరత్కు టిక్కెట్ కేటాయించారు. కొన్ని నెలలుగా రాములు భారాస కార్యకలాపాలకు అంటీముట్టనట్లు ఉంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు ఈసారి భారాస నుంచి తిరిగి అవకాశం కల్పిస్తారో? లేదోనన్న అనుమానంతో రాములు భాజపాలో చేరి కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోవడంలో సఫలమయ్యారు.
మహబూబ్నగర్ టికెట్పై ఉత్కంఠ..
భాజపా మొదటి జాబితాలో మహబూబ్నగర్ అభ్యర్థిని ప్రకటిస్తారని అందరూ భావించారు. జాబితాలో ఈ స్థానానికి చోటు లభించకపోవడంతో అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో భాజపాలో చేరి డీకే అరుణ టిక్కెట్ పొంది మహబూబ్నగర్ నుంచి పోటీ చేశారు. జాతీయ ఉపాధ్యక్ష పదవితో ఆమెకు పార్టీ సముచిత స్థానం కల్పించింది. ఈ సారి కూడా తనకే టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రచారం ప్రారంభించారు. మొదటి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. తాను బరిలోనే ఉన్నానని జితేందర్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దిల్లీలో మకాం వేసి లాబీయింగ్ చేస్తున్నారు. శాంతికుమార్ మాత్రం నెల రోజులుగా తనకే టిక్కెట్ వస్తుందన్న భరోసాతో నియోజకవర్గ పరిధిలో ప్రచారం ప్రారంభించారు. అధిష్ఠానం బీసీ కోటాలో తన పేరును పరిశీలిస్తుందని, తనకు మద్దతు ఇవ్వాలని మండలాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్లో డీకే అరుణ, జితేందర్రెడ్డి, శాంతికుమార్ మధ్య టిక్కెట్ విషయంలో పోటాపోటీ ఉండటంతోనే మొదటి జాబితాలో ఈ స్థానం ప్రకటించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండో జాబితాలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్, భారాస అభ్యర్థులెవరో..
నాగర్కర్నూల్ భాజపా అభ్యర్థిని ప్రకటించడంతో కాంగ్రెస్, భారాస అభ్యర్థులు ఎవరన్న దానిపై చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్ నుంచి తాను బరిలో ఉన్నానని ఇప్పటికే మల్లు రవి బహిరంగంగానే ప్రకటించారు. టిక్కెట్ విషయంలో తనకు అడ్డంకిగా ఉన్న దిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిని కూడా వదులుకున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ కూడా ఈ స్థానంపై ఆశలు పెట్టుకోవడంతో కాంగ్రెస్ నుంచి పోటీలో ఎవరుంటారన్న ఆసక్తి నెలకొంది. భారాస నుంచి అధిష్ఠానం టిక్కెట్ ఎవరికి కేటాయిస్తుందో వేచి చూడాల్సిందే.
వ్యక్తిగత వివరాలు
పేరు : పోతుగంటి భరత్ప్రసాద్ (అవివాహితుడు)
తల్లిదండ్రులు : పి.రాములు (ప్రస్తుత నాగర్కర్నూల్ ఎంపీ), భాగ్యలక్ష్మి గృహిణి
సామాజికవర్గం : ఎస్సీ, మాదిగ
తోబుట్టువులు : అక్క డా.ప్రశాంతి, అన్న రాజేంద్రప్రసాద్.. ఇద్దరికీ వివాహాలయ్యాయి.
స్వగ్రామం : గుండూరు, కల్వకుర్తి మండలం, నాగర్కర్నూల్ జిల్లా
పుట్టిన తేదీ : 07.08.1987
విద్యాభ్యాసం : ఎంటెక్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం
రాజకీయ ప్రవేశం : 2018లో కల్వకుర్తి మండలం జడ్పీటీసీ సభ్యుడిగా విజయం
లక్ష్యం : తండ్రి అడుగుజాడల్లో పయనించి, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ-నేతన్న యాప్ పని చేస్తోంది
[ 11-05-2024]
చేనేత కార్మికుల సమగ్ర వివరాల నమోదు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన టీ-నేతన్న యాప్ పని చేస్తోందని జిల్లా చేనేత జౌళీశాఖ ఏడీ గోవిందయ్య తెలిపారు. -
పోలింగ్ రోజు బాధ్యతగా విధులు నిర్వహించాలి
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజు పోలీసు సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. -
అయిజ, గద్వాల పట్టణాల్లో మంత్రి ప్రచారం
[ 11-05-2024]
జిల్లాలోని అయిజ, గద్వాల పట్టణాల్లో శనివారం మంత్రి దామోదర రాజనర్సింహ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మండలంలో భాజపా ఎన్నికల ప్రచారం
[ 11-05-2024]
వడ్డేపల్లి మండలంలోని కొంకల గ్రామంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ రాజు గౌడ్ ఆధ్వర్యంలో భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
బాలానగర్ వద్ద రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం
[ 11-05-2024]
జిల్లాలోని బాలానగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. -
భాజపాలో కొత్త జోష్
[ 11-05-2024]
సభకు ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసుశాఖ పటిష్ఠ ఏర్పాట్లు చేయడంతో సభ సాఫీగా ముగిసిపోయింది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాహనాలను అక్కడి సమీపంలో పార్కింగ్ చేయించడం, ట్రాఫిక్ ఆంక్షల మూలంగా సభ సజావుగా ముగిసింది. -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
పాలమూరులో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెర పడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం అన్నింటికీ ముగింపు పలకాలి. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివీ.
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
పొరపాటుతో స్వతంత్రం.. తారుమారు
[ 11-05-2024]
చిన్న పొరపాట్లతో సమీకరణలు, ఫలితాలు మారుతుంటాయి. 2004లో నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి కేఎస్ రత్నంను తెరాస అభ్యర్థిగా ప్రకటించినా సకాలంలో భీపాం అందించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలువాల్సి వచ్చింది. -
ఏ అభ్యర్థి ఓటు ఎక్కడ..?
[ 11-05-2024]
పార్లమెంట్కు దేశంలోని ఏ లోక్సభ స్థానం నుంచైనా పోటీ చేయవచ్చని తెలిసిందే. నియోజకవర్గంలోనే ఓటు ఉండాలన్న నిబంధన కూడా ఏమీ లేదు. -
ప్రవీణ్కుమార్ను గెలిపించుకుందాం: చల్లా
[ 11-05-2024]
స్థానికుడైన ప్రవీణ్కుమార్ను గెలిపించుకుందామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. -
భాజపాపై కాంగ్రెస్, భారాస విష ప్రచారం తగదు
[ 11-05-2024]
రిజర్వేషన్లను మార్చే హక్కు, అధికారం ఏ పార్టీలకు లేదని, ఎస్సీ వర్గీకరణ విషయంలో భాజపా నిర్ణయం స్థిరంగా ఉన్నదని స్పష్టం చేశారు. -
చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
[ 11-05-2024]
నాగర్కర్నూల్, షాద్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. -
ఓటు సద్వినియోగంతోనే సమస్యలకు పరిష్కారం
[ 11-05-2024]
బల్మూర్ మండలంలో చేపట్టనున్న శ్రీ ఉమామహేశ్వర జలాశయంతో బలహీన వర్గాల ప్రజలు అధికంగా భూములను కోల్పోతున్నారని బాధితులు ఆందోళన బాట బట్టారు. -
మద్యం రేషన్కు గేట్లెత్తారు !
[ 11-05-2024]
నిన్నటివరకు రేషన్ పద్ధతిన సరఫరా చేసిన మద్యానికి శుక్రవారం ఒక్కరోజు గేట్లెత్తేయడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రూ. 25 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి.