logo

ఎన్నికల తర్వాత భారాస కనుమరుగు : ఎమ్మెల్యే

లోక్‌సభ ఎన్నికలయ్యాక భారాస కనుమరుగవుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. అడ్డాకులలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే

Published : 23 Apr 2024 03:47 IST

ఎంపీపీ నాగార్జునరెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

అడ్డాకుల, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికలయ్యాక భారాస కనుమరుగవుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. అడ్డాకులలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. మూసాపేట మండలం పోల్కంపల్లి ఎంపీటీసీ సభ్యురాలు సుకన్య, కాటవరం మాజీ ఉపసర్పంచి శ్రీనివాస్‌గౌడ్‌, కొత్తకోట మండలం నిర్వేన్‌, రామంతపూరు, పాలెం తదితర గ్రామాల నాయకులను ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. వైస్‌ ఎంపీపీ రాధిక, ఎంపీటీసీ శకుంతల, నాయకులు నాగిరెడ్డి, జగదీశ్వర్‌, శ్రీహరి, శెట్టి శేఖర్‌, విజయ్‌మోహన్‌రెడ్డి, బగ్గి కృష్ణయ్య, రామన్‌గౌడ్‌, షఫీ అహ్మద్‌, భీమన్నయాదవ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని