సీఎం నేడు సుడిగాలి పర్యటన
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు.
నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో కార్యక్రమాలు
బిజినేపల్లి: సభాస్థలిని పరిశీలిస్తున్న ఐజీ సుధీర్బాబు, ఇతర పోలీసు అధికారులు
ఈనాడు, మహబూబ్నగర్: ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరుకు మధ్యాహ్నం 12 గంటలకు రానున్నారు. మండల కేంద్రంలో జరిగే కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సమావేశం ముగిసిన అనంతరం కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలోని బావాజీ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మద్దూరు వచ్చి హెలీకాప్టర్లో నాగర్కర్నూల్ వెళ్లి ఎంపీ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. బిజినేపల్లిలో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
రెండు స్థానాల్లో గెలుపు లక్ష్యంగా..: పాలమూరులోని రెండు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని రేవంత్రెడ్డి భావిస్తున్నారు. సొంత జిల్లా కావడంతో ఈ రెండు స్థానాల్లో గెలుపు బాధ్యతలను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. రెండు చోట్లా త్రిముఖ పోరు నెలకొనడంతో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నారు. ముఖ్య ప్రాంతాల్లో స్వయంగా సీఎం పర్యటిస్తూ పార్టీ గెలుపునకు కావాల్సిన దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో మూడు సార్లు పర్యటించారు. ఎన్నికలు ముగిసేలోగా ఈ లోక్సభ పరిధిలో మరో రెండు సభలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్కు మెజార్టీ వచ్చేలా ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. మద్దూరు సమావేశంలోనూ మరోసారి తన సొంత నియోజకవర్గంలోని తాజా పరిస్థితిపై సమీక్ష చేయనున్నారు. ఎలాగైనా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్కు 50వేల మోజార్టీ రావాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో బావాజీ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి బంజారాలు అధిక సంఖ్యలో వస్తారు. ఈ జాతరకు హాజరు కావడంతో వారి మద్దతును కూడకట్టుకునే అవకాశం ఉంటుంది.
కందనూలుకు మొదటిసారి...
బిజినేపల్లిలో జన జాతర సభకు సిద్ధం చేస్తున్న వేదిక
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా రేవంత్ నాగర్కర్నూల్ రానుండటంతో ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి కూడా నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలోనే ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపా, భారాస నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. భాజపా నుంచి ప్రస్తుత ఎంపీ పి.రాములు కుమారుడు భరత్ ప్రసాద్, భారాస నుంచి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ పోటీలో ఉన్నారు. ఈ జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ప్రధానంగా వీరిని లక్ష్యంగా చేసుకునే ప్రచారం కొనసాగే అవకాశం ఉంది. వెనకబడిన ప్రాంతమైన నాగర్కర్నూల్కు సాగునీటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. గత శాసనసభ ఎన్నికల్లోనూ రేవంత్ బిజినేపల్లిలోనే బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. మళ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ అక్కడే మల్లు రవి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలమూరుకు అగ్రనేతలు
[ 04-05-2024]
పాలమూరులో ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు రానున్నారు. పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. -
పీఎంశ్రీకి మరో 46 పాఠశాలలు
[ 04-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా) యోజనను గత విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తోంది. -
పులులకు ఆవాసం.. గ్రామస్థులకు పునరావాసం
[ 04-05-2024]
ఆక్రమణలు, అభివృద్ధి పేర నానాటికి కుంచించుకు పోతున్న అటవీ ప్రాంతంతో అడవికి రారాజైన పెద్దపులుల ఉనికికి భంగం కలుగుతోంది. నల్లమలలో -
ఉత్తర భారతంలో భాజపాకు సగం సీట్లే
[ 04-05-2024]
ఉత్తర భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో భాజపాకు సగం సీట్లు కూడా రావడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. -
పురపాలిక.. మేల్కోవాలిక!
[ 04-05-2024]
మహబూబ్నగర్ పురపాలక సంఘ భవనం పూర్తిగా దెబ్బతింది. భవనం పిల్లర్లు, సజ్జలు, గోడలు, మెట్లు పెచ్చులు ఊడుతున్నాయి. -
విలక్షణ పోరు.. ఇక్కడి తీరు
[ 04-05-2024]
నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 15వ సారి ఎన్నిక జరుగుతోంది. -
మళ్లీ మోసపోవద్దు
[ 04-05-2024]
గత శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు నమ్మి మోసిపోయినట్లుగా ఇపుడు మళ్లీ బుట్టలోపడొద్దని మహబూబ్నగర్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భాజపాతోనే భారత్ వికాసం : భరత్ ప్రసాద్
[ 04-05-2024]
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మోదీ విజన్తోనే సాధ్యమని నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ పేర్కొన్నారు. -
ప్రవీణ్కుమార్ ప్రచారంలో ఉద్రిక్తత
[ 04-05-2024]
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో చేపట్టిన భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ లోక్సభ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. -
మోదీ హయాంలో దేశం 30 ఏళ్ల వెనుకబాటు
[ 04-05-2024]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో దేశాన్ని ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
ప్రజాపాలన కాంగ్రెస్తోనే సాధ్యం
[ 04-05-2024]
రాష్ట్రంలో ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటే జిల్లా ప్రజలు ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. -
మంచినీటికి ముప్పుతిప్పలు
[ 04-05-2024]
జిల్లా కేంద్రమైన వనపర్తిలో తాగునీటి సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. పురపాలక సంఘంలోని పలు కాలనీలకు రామన్పాడు తాగునీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదు. -
ఓటుకు తప్పని దూరాభారం
[ 04-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేస్తున్నా, కొన్ని తండాలవాసులు ఓటేయడానికి దూరం వెళ్లాల్సివస్తోంది. -
రేపటి నీట్కు 11 కేంద్రాలు
[ 04-05-2024]
వైద్యవిద్య కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 5న నిర్వహించే నీట్కు ఉమ్మడి పాలమూరులో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట
[ 04-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ఈనెల 24 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!