యువత.. మార్చేను నేతలరాత
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు యువ మంత్రం జపిస్తున్నారు.
అభ్యర్థుల గెలుపోటముల్లో ఆ ఓటర్లు కీలక భూమిక
ఈనాడు, మహబూబ్నగర్: సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు యువ మంత్రం జపిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో యువ ఓటర్లు అభ్యర్థుల విజయావకాశాల్లో కీలక భూమిక పోషించారు. ఈ సారి కూడా ఆ వర్గం ఓట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ స్థానాల పరిధిలో మొత్తం 34,15,190 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18-19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 1,18,485 మంది ఉన్నారు. మొత్తం యువ ఓటర్లు 18,01,104 మంది ఉన్నారు. పాలమూరులో మొత్తం ఓటర్లలో వీరు 52.73 శాతం ఉండటం గమనార్హం.
క్షేత్రస్థాయికి..
రెండు లోక్సభ నియోజకవర్గాల్లో యువశక్తి పేరుతో భాజపా యువత ఓట్లను అభ్యర్థిస్తోంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, రానున్న రోజుల్లో పాలమూరుకు ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలను తీసుకొస్తామని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో కేంద్రీయ విద్యాలయాలతోపాటు ఉమ్మడి జిల్లాకు సైనిక్ పాఠశాల ఏర్పాటు గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో మెగా సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రం, పీఎంకేయూవై సంకల్ప్, ఉడాన్ పథకాల ద్వారా ప్రతి యువతకు లబ్ధి చేకూరేలా ప్రధాని మోదీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నారని వివరిస్తున్నారు. ప్రధానంగా యువమోర్చా కార్యకర్తలు 35 ఏళ్లలోపు ఉన్న ఓటర్ల వివరాలను సేకరించి వారి వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఖేలో ఇండియా, డ్రగ్-ఫ్రీ మహబూబ్నగర్ వంటి ఆకర్షణ పథకాలతో భాజపా యువత కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసింది. కేంద్రానికి జరుగుతున్న ఎన్నికలు కావడంతో యువత ఎక్కువగా భాజపా వైపు ఆకర్షితులవుతున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు పార్గీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఉద్యోగాలే అస్త్రంగా..
గత శాసనసభ ఎన్నికల్లో యువత కాంగ్రెస్ పైపు ఉందని, లోక్సభ ఎన్నికల్లోనూ వారి మద్దతు తమకే ఉంటుందని ఆ పార్టీ నేతలు భరోసాగా ఉన్నారు. ప్రధానంగా సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రచారం చేస్తున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ కార్డు ప్రకటించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని యువతకు భరోసా ఇస్తున్నారు. పీయూలో కొత్తగా ఇంజినీరింగ్, న్యాయ కళాశాలతో కొత్త పీజీ కోర్సులను తీసుకొచ్చి ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నామని ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతరానికి ఉపాధి కల్పించడానికి రేవంత్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఓటర్లకు వివరిస్తున్నారు. జిల్లాకేంద్రాల్లో ఐటీ పార్కుల అభివృద్ధి, యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటు వంటి హామీలతో ఆ పార్టీ ప్రచారం చేస్తూ యువ ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో ఉంది.
ఉపాధి కల్పించామంటూ..
గత పదేళ్లలో యువత కోసం పలు ప్రాజెక్టులను తీసుకొచ్చి ఉపాధి కల్పించినట్లు భారాస ప్రచారం చేస్తోంది. మహబూబ్నగర్లో ఐటీ టవర్ ఏర్పాటుతోపాటు దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల ద్వారా యువతకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతోంది. ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడల్లోనూ భారాస ప్రభుత్వం యువతకు ప్రాధాన్యం ఇచ్చిందని వివరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతమున్న నైపుణ్య కేంద్రాలు భారాస హయాంలో ఏర్పాటు చేశామని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 30వేల ఉద్యోగాలు కూడా భారాస ప్రభుత్వం ఉన్న సమయంలోనే పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన అభ్యర్థులే అని క్షేత్రస్థాయిలో ఓటర్లకు వివరిస్తున్నారు. యువతకు అండగా ఉండేది భారాసనేనని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రం కిటికీలు చోరీ
[ 12-05-2024]
మండలంలోని ముండ్లదిన్నె గ్రామంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగాల్సిన కేంద్రం కిటికీలను గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి ఎత్తుకెళ్లారు. -
ప్రచారం ఇలా ముగించారు..!
[ 12-05-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో నెల రోజులుగా ప్రచారం హోరెత్తింది. -
ఎన్నికల వేళ ప్రయాణికుల పాట్లు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు నానా పాట్లు పడ్డారు. -
మతతత్వ పార్టీలకు చరమగీతం పాడుదాం: భట్టి
[ 12-05-2024]
మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే మతతత్వ పార్టీలకు చరమగీతం పాడుదామంటూ రాష్ట్ర ఉప మఖ్యమంత్రి భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. -
డీకే అరుణ అంటేనే పాలమూరు నినాదం
[ 12-05-2024]
అరుణమ్మ అంటే పాలమూరు నినాదం.. ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి.. ఆమెను మీరంతా ఎంపీగా గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి మీ గొంతుక అవుతారని భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. -
ఓర్వలేక వెన్నుపోటుకు కుట్ర: వంశీచంద్రెడ్డి
[ 12-05-2024]
పాలమూరు అభివృద్ధికి వెన్నుపోటు పొవడానికి, సీఎం రేవంత్రెడ్డిని అప్రతిష్ఠపాలు చేయడానికి కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. -
అభివృద్ధి విస్మరించి అనవసర ఆరోపణలు: వి.శ్రీనివాస్గౌడ్
[ 12-05-2024]
అభివృద్ధి పనులను విస్మరించి భారాస నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకులకు తగదని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. -
మోదీవి ప్రజావ్యతిరేక విధానాలు
[ 12-05-2024]
పదేళ్ల నుంచి కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఓటర్లు ప్రజాస్వామిక పార్టీలకు పట్టం కట్టాలని తెలంగాణ జాగో కన్వీనర్ ఆకునూరి మురళి కోరారు -
లెక్కింపు కేంద్రాల పరిశీలన
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్రూంల ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి కలెక్టర్ జి.రవి నాయక్తో కలసి శనివారం పరిశీలించారు. -
నిబంధనలు పాటించాల్సిందే
[ 12-05-2024]
రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. -
మోసం చేసిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పండి
[ 12-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని భారాస నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి డా. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. -
విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలకు గుణపాఠం నేర్పాలి
[ 12-05-2024]
కాంగ్రెస్తోనే దేశంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భాజపా వస్తే ఎన్నికలు ఉండవు
[ 12-05-2024]
కేంద్రంలోని భాజపా మరోసారి అధికారంలోకి వస్తే, ఎన్నికలు ఉండవని రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్