ప్రచండ ఎండ!
పాలమూరులో భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, నదులు, వాగులు, బావులు, చెక్డ్యాంలు, నీటికుంటలు ఎండిపోతున్నాయి.
రోజూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు
మహబూబ్నగర్ : ప్రభుత్వ బాలికల కళాశాల సమీపంలో నీటిని తాగేందుకు చలివేంద్రం వద్ద పోగైన జనం
పాలమూరు, న్యూస్టుడే : పాలమూరులో భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, నదులు, వాగులు, బావులు, చెక్డ్యాంలు, నీటికుంటలు ఎండిపోతున్నాయి. గత నెలలో 30 - 40 డిగ్రీల మధ్యనే ఉష్ణోగ్రతలు ఉండగా, ఈ నెల మొదటి వారం నుంచి ఎండలు మండుతున్నాయి. వారం నుంచి తీవ్రత మరింత పెరిగింది. ఉష్ణోగ్రత 35 డిగ్రీల లోపల ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 35-40 డిగ్రీల మధ్య ఉంటే ఎల్లో అలెర్ట్గా ప్రకటిస్తారు. వాతావరణాన్ని గమనిస్తుండాలి. 40-45 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు ఉంటే ఆరెంజ్ జోన్గా ప్రకటిస్తారు. 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని, ఎండలో బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి.
రెడ్జోన్లో పాన్గల్, కొత్తకోట : ఈ నెల 26న వనపర్తి జిల్లాలో 45.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం వనపర్తి జిల్లాలోని పాన్గల్ మండలంలో 45.1, కొత్తకోట మండలంలో 45.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే జిల్లాలోని పెబ్బేరులో 44.5 డిగ్రీలు నమోదైంది. ఈ జిల్లా రెడ్ జోన్లోకి వెళ్లిపోయింది. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో 44.1, బాలానగర్లో 44.0, అడ్డాకులలో 43.5, కోయిలకొండలో 43.3, మిడ్జిల్లో 43.1, మహబూబ్నగర్ అర్బన్లో 43.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో 44.7, కోడేరులో 44.5, అచ్చంపేటలో 44.2, పెద్దకొత్తపల్లిలో 44.2, కల్వకుర్తిలో 44.1, నారాయణపేట జిల్లా ఉట్కూర్లో 43.8, ధన్వాడ, కృష్ణాలో 43.6, కొత్తపల్లిలో 43.3, జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో 44.7, వడ్డేపల్లిలో 44.3, అలంపూర్లో 44.3 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ పోరు.. మారని తీరు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికపై పాలమూరు ఓటర్ల ఆసక్తి తగ్గుది. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుది. -
స్ట్రాంగ్రూంలకు చేరిన ఈవీఎంలు
[ 15-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలను పాలమూరు వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలలో మంగళవారం భద్రపరిచారు. -
పీయూ ఉపకులపతి పదవికి తీవ్ర పోటీ
[ 15-05-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం ఉప కులపతి(వీసీ) పోస్టుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా దరఖాస్తులు అందిన వర్సిటీల్లో పీయూ మూడో స్థానంలో ఉంది. -
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : డీకే అరుణ
[ 15-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఆమె భాజపా జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
అలసి.. సొలసి.. సేదదీరి!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నుంచి క్షణం తీరిక లేకుండా గడిపిన ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు మంగళవారం కాస్త తీరికగా కనిపించారు. -
ఇన్నాళ్లు కళకళ.. నేడు వెలవెల
[ 15-05-2024]
తెలంగాణలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నెల రోజులుగా మహబూబ్నగర్లో సందడి నెలకొన్న ప్రధాన పార్టీల కార్యాలయాలు మంగళవారం బోసిపోయి కనిపించాయి. -
ఎన్నికల సిబ్బంది ప్రయాణ కష్టాలు
[ 15-05-2024]
ఎన్నికల సిబ్బంది పోలింగ్ అనంతరం ఇళ్లకు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. సోమవారం రాత్రి ఈవీఎంలు, ఇతర సామగ్రి తీసుకొని వచ్చి అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అప్పగించారు. -
మట్టి పాత్రలకు మంచిరోజులు
[ 15-05-2024]
కరోనా తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యం పట్ల జనానికి స్పృహ పెరిగింది. అందులో భాగంగా అల్యూమినియం, స్టీల్పాత్రలు వంటలకు ఉపయోగించడం మానుకొని మట్టి పాత్రలు వాడేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 15-05-2024]
మద్యం దుకాణం నిర్వాహకులు చేసిన దాడిలో గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. -
తీరని సాగునీటి గోస
[ 15-05-2024]
యాసంగి సీజన్లో సాగు నీటి సమస్య ఏళ్లుగా వేధిస్తోంది. సింగోటం జలాశయం నుంచి గోపల్దిన్నె జలాశయానికి లింకు కాల్వల నిర్మాణం పూర్తి చేస్తేనే సాగునీటి సమస్య తీరనుంది. -
భారాస కౌన్సిలర్ కుటుంబంపై దాడి
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సోమవారం మొదలైన వివాదం రాజకీయంగా దాడులకు తెరలేపింది. -
పుస్తకాలొచ్చాయ్.. వస్త్రమే రాలె
[ 15-05-2024]
రాబోయే విద్యా సంవత్సరానికి ఉచిత పాఠ్యపుస్తకాలు వచ్చాయి. తొలివిడత ఇప్పటికే 20 శాతం మేరకు పుస్తకాలు జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ గోదాముకు చేరాయి. -
పురాల్లో పన్ను బాదుడు
[ 15-05-2024]
పురపాలక సంఘాల్లో పన్ను బాదుడు మొదలైంది. కొత్త పురపాలక చట్టం 2019 ప్రకారం నమోదు చేయడంతో పన్ను దారులు లబోదిబోమంటున్నారు. -
వాళ్లమ్మిందే మందు!
[ 15-05-2024]
జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు లేకపోవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెడికల్ దుకాణాల వారిదే ఇష్టారాజ్యమవుతోంది. -
ఆరు బూత్లలో 50 శాతం లోపే పోలింగ్
[ 15-05-2024]
నాగర్ కర్నూల్ లోకసభ స్థానం పరిధిలోని గద్వాల పురపాలక సంఘంలో అతి తక్కువగా పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు వెలుగుచూడటంపై ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
5.3 లక్షల మంది ఓటుకు దూరం
[ 15-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలో 5.30 లక్షల మంది ఓటుకు దూరంగా ఉండిపోయారు. ఈ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా..