logo

ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

నాగర్ కర్నూల్ పార్లమెంటు  ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 29 Apr 2024 12:43 IST

రాజోలి : నాగర్ కర్నూల్ పార్లమెంటు  ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ప్రచారంలో భాగంగా గద్వాల పట్టణంలోని  ఇండోర్‌ స్టేడియంలో, వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో  క్రీడాకారులు, ఉద్యోగులు ప్రజలు, రైతులను కలిసి వారితో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రైతులకు అందించిన సాగునీరు, 24 గంటల కరెంటు తదితర అంశాలను వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం అన్నదాతలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఆయన వెంట రాష్ట్ర భారాస  సీనియర్ నేత నాగర్ దొడ్డి వెంకట రాములు, సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, ఇంతియాజ్, గద్వాల  మున్సిపాలిటీ వైఎస్ ఛైర్మన్ బాబర్, కౌన్సిలర్లు మురళీ,  నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని