logo

అభివృద్ధి పట్టదు కానీ అవిశ్వాసమా..

పురపాలిక అభివృద్ధిని పట్టించుకోని అధికార పార్టీ నాయకులు పాలకవర్గంపై అవిశ్వాసానికి యత్నించడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి విమర్శించారు.

Published : 05 Feb 2023 02:04 IST

సమావేశంలో మాట్లాడుతున్న గోపి, మల్లేశ్‌గౌడ్‌ తదితరులు

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: పురపాలిక అభివృద్ధిని పట్టించుకోని అధికార పార్టీ నాయకులు పాలకవర్గంపై అవిశ్వాసానికి యత్నించడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి విమర్శించారు. శనివారం నర్సాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్‌ మల్లేశ్‌గౌడ్‌తో కలిసి మాట్లాడారు. నర్సాపూర్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు కరవయ్యాయని, పనులు అసంపూర్తిగా నిలిచాయన్నారు. ప్రస్తుత అధికార పార్టీ నేతల ఆస్తుల వివరాలు వెల్లడిస్తామన్నారు. నియోజకవర్గంలో అన్యాక్రాంతమవుతున్న వేలాది ఎకరాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. పట్టణ శివార్లలోని ఓ పరిశ్రమలో ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే ఆందోళన చేపడతామని చెప్పారు. మల్లేశ్‌గౌడ్‌ మాట్లాడారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్‌, గ్రామీణ బాధ్యుడు బాల్‌రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌, శ్రీనివాస్‌గుప్త, అంజిగౌడ్‌, శంకర్‌, ప్రేమ్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని