పార్టీలకతీతంగా అభివృద్ధి: ఎంపీ
ప్రతి పల్లె, పట్టణంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోందని, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎంపీ బీబీపాటిల్, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ అన్నారు. శుక్రవారం అందోలు మండలం సంగుపేటలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్తో కలిసి పాల్గొన్నారు.
ఆర్థిక సాయం మంజూరు పత్రం అందజేస్తున్న ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్,
చిత్రంలో కలెక్టర్ శరత్, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ
జోగిపేట, వట్పల్లి: ప్రతి పల్లె, పట్టణంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోందని, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎంపీ బీబీపాటిల్, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ అన్నారు. శుక్రవారం అందోలు మండలం సంగుపేటలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్తో కలిసి పాల్గొన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అనంతరం గొర్రెల పథకం, బీసీలకు సాయం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పురపాలక అధ్యక్షుడు మల్లయ్య, ఉపాధ్యక్షుడు ప్రవీణ్కుమార్, భారాస నాయకులు జైపాల్రెడ్డి, జడ్పీ సీˆఈవో ఎల్లయ్య, పశు సంవర్ధక శాఖ జేడీ వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వట్పల్లి మండలం దేవునూర్ రైతువేదికలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రారంభించారు.
గడపగడపకు సంక్షేమ ఫలాలు
సంగారెడ్డి టౌన్, న్యూస్టుడే: కేసీఆర్ పాలనలో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థానిక పీఎస్ఆర్ గార్డెన్లో నియోజకవర్గ స్థాయి సంక్షేమ సంబరాలు నిర్వహించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం, సీడీసీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
లబ్ధిదారులకు చెక్కు పంపిణీ చేస్తున్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
జిన్నారం: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిన్నారం మండలానికి చెందిన 57 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీసీ కుల వృత్తులకు చెందిన ముగ్గురికి రూ.లక్ష సాయం చెక్కులు పంపిణీ చేశారు. జడ్పీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, తహసీల్దార్ దశరథ్సింగ్, నాయకులు ప్రకాశంచారి, వెంకటేశంగౌడ్, రాజేశ్, రామకృష్ణ వెంట ఉన్నారు.
ప్రభుత్వ పథకాలతో పేదలకు లబ్ధి
ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి గొర్రె పిల్ల అందజేస్తున్న కురుమ సంఘ నాయకులు
నారాయణఖేడ్: ప్రభుత్వ పథకాలతో పేదలకు లబ్ధి చేకూరుతోందని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ మండలం జూకల్ శివారులో వివిధ పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన ‘సంక్షేమ సంబురాలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఖేడ్ నియోజకవర్గంలో తొమ్మిదేళ్లలో ఆసరా పింఛన్ల కింద రూ.487.72 కోట్లు పంపిణీ చేశామన్నారు. 100 మందికి దళితబంధు ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. డీపీవో సురేష్ మోహన్, ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
కుల వృత్తులకు ప్రభుత్వ ప్రోత్సాహం
యాదవులతో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కృల వృత్తులను ప్రోత్సహిస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. జహీరాబాద్లో నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని కులాల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు తీసుకొచ్చారని, ఇప్పటికే దళితబంధు అమలు చేశారన్నారు. బీసీల్లోని కులవృత్తుల వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వివరించారు. డీఆర్డీవో జయదేవ్, ఆత్మ కమిటీ ఛైర్మన్ పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టుబడితే.. మెదక్ మనదవదా
[ 11-05-2024]
‘సిద్దిపేట ప్రజలు ఎలాంటి పులులో నాకు తెలుసు. వారు పట్టుబడితే.. జట్టు కడితే లక్ష మెజార్టీ లెక్కే కాదు. మెదక్ లోక్సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి లక్ష మెజార్టీ గ్యారంటీ. -
అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా: వెంకట్రామిరెడ్డి
[ 11-05-2024]
పార్లమెంట్ సభ్యుడిగా ఒక్కసారి అవకాశం ఇస్తే, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం చేగుంట, నార్సింగిలో నిర్వహించిన రోడ్షోలో పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీలు విస్మరించి.. గారడీ మాటలా?
[ 11-05-2024]
మాజీ సీఎం కేసీఆర్ ఎవరినీ లెక్క చేయకపోవడంతో ఆయనను ప్రజలు గద్దె దించి, రేవంత్రెడ్డికి పట్టం గడితే, ఆయనకు కూడా అయిదు నెలలకే అధికారం తలకెక్కిందని మాజీ మంత్రి, భాజపా మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే ప్రజల అభ్యున్నతి
[ 11-05-2024]
కాంగ్రెస్తోనే ప్రజల అభ్యున్నతి సాధ్యమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేటలో మెదక్ లోక్సభ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. -
రసవత్తర పోరు.. నేటితో ఆఖరు
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అవకాశం ఇవ్వాలని భాజపా.. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని భారాస ప్రచారం చేపట్టాయి. -
సాంకేతికత వినియోగం.. ఎన్నికలు పారదర్శకం
[ 11-05-2024]
అన్ని రంగాల్లో అభివృద్ధిపై సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం దీని వినియోగం అంతటా పెరిగింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ప్రస్తుత ఎన్నికల్లోనూ విస్తృతంగా వినియోగిస్తుండటం విశేషం. -
బైకులు ఢీకొని ద్విచక్ర వాహనదారుడి దుర్మరణం
[ 11-05-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మరో బైకు ఢీకొన్న ఘటనలో ఒక వాహనదారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి ఎస్సై నరేష్ వివరాల ప్రకారం.. జహీరాబాద్ మండలం సత్వార్ సమీపంలో శుక్రవారం జహీరాబాద్ వైపు వస్తున్న బైకును వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. -
సైనికులు.. వజ్రాయుదం సందించేలా..
[ 11-05-2024]
కన్నవారికి.. ఉన్న ఊరికి దూరంగా ఉంటూ.. మాతృబ¡ూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. కంటి మీద కునుకు లేకుండా రాత్రి వేళ సైతం విధులు నిర్వహిస్తారు. -
ప్రీలాంచ్ పేరిట రూ.15 కోట్లకు మోసం
[ 11-05-2024]
‘హైవే ప్యారడైజ్’ పేరుతో ప్రీలాంచ్ ఆఫర్లు ప్రకటించి దాదాపు రూ.15 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి మోసగించిన తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన ఓబిలి పాపన్నగారి రామచంద్రారెడ్డిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
సొంతూళ్లకు కార్మికులు
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు సొంతూళ్లకు పయనమయ్యారు. రెండు రోజులుగా ఎక్కువ మంది తరలుతుండటంతో చాలా పరిశ్రమల్లోని ఉత్పత్తి బ్లాక్లు వెలవెలబోతున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నారు. -
పల్లెల్లో ఓటరు చైతన్యం
[ 11-05-2024]
గ్రామాలతో పోల్చితే పట్టణ వాసుల్లో చైతన్యం ఎక్కువ. ఓటింగ్ సమయంలో పరిస్థితి ఇందుకు భిన్నం. పట్టణాల్లో పోలింగ్ తక్కువగా నమోదవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు విలువ తెలియని వారు సైతం బాధ్యతగా తమ హక్కును అందరూ వినియోగించుకుంటున్నారు. -
హామీ ఇచ్చిన వైద్య కళాశాల ఏమైంది?
[ 11-05-2024]
‘చెప్పుకోవడానికి చేసిన పనులు పథకాలు లేక భాజపా అభ్యర్థి బండి సంజయ్ ఇంటింటికీ చిత్ర పటాలు పంపిణీ చేశారు.. పటాలు పేదల కడుపులు నింపుతాయా? పిల్లల బతుకులు. -
భాజపాది విభజన రాజకీయం
[ 11-05-2024]
తెలంగాణ విభజన హామీలు చేయకుండా విభజన రాజకీయాలు చేస్తున్న భాజపాను బొందపెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి
[ 11-05-2024]
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. రాబందులుగా పీక్కుతినే కేంద్రంలోని భాజపా, తెలంగాణలోని భారాస పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. -
సచిత్రం.. ఓటరు గైడ్ మార్గదర్శనం
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు చీటీలతో పాటు పంపిణీ చేస్తున్న గైడ్ చిన్న పుస్తకం సమగ్ర వివరాలతో సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించారు. బూత్ లెవల్ అధికార్లు ఇంటింటికి తిరుగుతూ అందించారు. -
రూ.75 వేల నగదు పట్టివేత
[ 11-05-2024]
జిల్లా సరిహద్దు అక్కన్నపేటలోని స్టాటికల్ సర్వేలెన్స్ చెక్పోస్టు వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.75వేల నగదును పట్టుకున్నట్లు ఎస్సై వివేక్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం