logo

హైదరాబాద్‌ వీడి చేవెళ్లలో చేరి..

జిల్లా కేంద్రమైన వికారాబాద్‌, తాండూరు, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లు 2008 వరకు హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉండేవి.

Published : 28 Apr 2024 03:12 IST

జిల్లా కేంద్రమైన వికారాబాద్‌, తాండూరు, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లు 2008 వరకు హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. ఆ సంవత్సరంలో లోక్‌సభ స్థానాల పునర్విభజనలో భాగంగా తాండూరు, వికారాబాద్‌, చేవెళ్లలు హైదరాబాద్‌ నుంచి విడిపోయాయి. అప్పుట్లో కొత్తగా చేవెళ్ల కేంద్రంగా లోక్‌సభ నియోజకవర్గాన్ని ఏర్పాటుచేయగా.. ఇందులో తాండూరు, వికారాబాద్‌లను కలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ పరిధిలో ఉన్న పరిగి అసెంబ్లీ సెగ్మెంట్‌ను సైతం చేవెళ్ల కిందికే తీసుకొచ్చారు. 2009 నుంచి చేవెళ్ల స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇక్కడి ఓటేస్తున్నారు.

న్యూస్‌టుడే, తాండూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని