పెరుగుతుందా.. తగ్గుతుందా..!
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.
పోలింగ్శాతం ప్రభావంపై పార్టీల లెక్కలు
ఈనాడు, కామారెడ్డి, న్యూస్టుడే, జహీరాబాద్: లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పెరిగితే ఎవరికి లాభం, నష్టం? తగ్గితే ఏ పార్టీకి ప్రయోజనం అనే కోణంలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్శాతంపై ఎన్నికల యంత్రాంగం, అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
వేర్వేరు ఎన్నికల్లో..
అసెంబ్లీ, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగిన 2009, 2014లలో పోలింగ్ భారీగానే నమోదైంది. 2018లోనూ జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా తగ్గింది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ను విశ్లేషిస్తే పట్టణ ప్రాంతాలకు చెందినవారే చాలామంది ఓటింగ్లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. పట్టణాల్లో పోలింగ్శాతం పెంచేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు రూపొందించారు.
మారిన ప్రచార సరళి
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ప్రచారంలో తేడా కనిపిస్తోంది. పార్టీల అగ్రనేతల హడావుడే తప్ప ద్వితీయ, గ్రామస్థాయి నేతల్లో ప్రచారం చేపట్టాలనే ఉత్సాహం కనపడడం లేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశాలతో సరిపెడుతున్నారు. గతంలో మాదిరి పోస్టర్లు, కరపత్రాల ప్రచారానికి స్వస్తి చెప్పారు. సామాజిక మాధ్యమాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో..
స్థానిక సంస్థలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మేర పోలింగ్ తగ్గుతోంది. ఇదే విధంగా శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోకసభ ఎన్నికల్లో గణనీయంగా తగ్గుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఎల్లారెడ్డి, జుక్కల్, నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్షాధారంగానే అన్నదాతలు పంటలు పండిస్తుంటారు. వేసవిలో కూలీలకు పల్లెలతో పాటు పట్టణాల్లో ఉపాధి లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలో పలువురు నిరుపేదలు జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అడ్డాకూలీలుగా జీవనం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు ఓటింగ్లో పాల్గొనేలా పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చి గ్రామాలకు తరలించారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. దీనికి తోడు వేసవి సెలవులు రావడంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో పట్టణాలు, పల్లెల్లో పోలింగ్ తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జహీరాబాద్లో మూడు రంగులజెండా ఎగరాలి
[ 12-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోకు పార్టీ అగ్రనాయకురాలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
అభివృద్ధిని అడ్డుకొని..ఎలా ఓట్లడుగుతారు?
[ 12-05-2024]
‘నిధులన్నీ మెదక్ జిల్లాకు, గజ్వేల్ అభివృద్ధికే కేటాయిస్తున్నారని నాడు అడ్డు తగిలిన కాంగ్రెస్, భాజపా నాయకులు.. ఇవ్వాళ పార్లమెంటు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని.. ఈ ప్రాంతాల్లో ఓట్లు అడుగుతున్నారు? -
ప్రలోభాలకు లొంగొద్దు.. ధైర్యంగా ఓటేయండి
[ 12-05-2024]
ఓటర్లు ప్రలోభాలు, డబ్బులకు లొంగకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కును అమ్ముకోవద్దని, నిర్భయంగా, నిజాయతీతో ఓటు వేయాలని మెదక్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. -
ఎవరి మాట..మీటనొక్కించనుందో!
[ 12-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. -
తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్దే
[ 12-05-2024]
తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. -
మెతుకు సీమలో ఎగిరేది కాషాయ జెండానే: భాజపా
[ 12-05-2024]
మెదక్ సీమపై ఎగిరేది కాషాయ జెండానేనని భాజపా రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ ధీమా వ్యక్తం చేశారు -
అధికారంలోకి వస్తే పెరగనున్న వేతనాలు
[ 12-05-2024]
కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాహుల్గాంధీ ప్రధానమంత్రి కాగానే ఉపాధి హామీ కూలీలకు వేతనాలు పెరుగుతాయని మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. -
మూగబోయిన మైకులు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. ఓటర్ల నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు అన్ని విధాల భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీసు కమిషనర్ అనూరాధ వెల్లడించారు. కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్, జియోట్యాగింగ్ చేశామన్నారు. -
ఓటర్లను కదిలించు తల్లీ..
[ 12-05-2024]
అమ్మ.. అలుపు ఎరగకుండా శ్రమిస్తుంది. కుటుంబ ఉన్నతికి తపిస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. -
దివ్యస్ఫూర్తి.. శతాధిక కీర్తి
[ 12-05-2024]
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు పాత్ర కీలకం.. ఓటు హక్కు కలిగి ఉండటమే కాదు.. దాన్ని సద్వినియోగం చేసుకున్నపుడే సార్థకత చేకూరుతుంది. -
నిఘా నీడలో ఎన్నికలు
[ 12-05-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పోలింగ్ కేంద్రాల్లో అల్లర్లు, సమస్యలు ఉంటుండేవి. -
ఓటును అమ్ముకోకు.. ఆత్మాభిమానాన్ని చంపుకోకు
[ 12-05-2024]
ఓటుహక్కు ఉండి వేయలేకపోతే మనం భూమ్మీద ఉండి లేనట్లే లెక్క. ఏడాదికోసారి వచ్చే పండగలు బంధాలను కలుపుతాయి. -
ఓటర్లు సొంతూళ్లకు తరలేలా..
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సమాయత్తమైంది.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్