తాగేదెలా?
జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మంచినీటి ట్యాంకుల శుభ్రతపై నిర్లక్ష్యం
చెర్యాల్లో నాచు ఇలా..
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్ (ఇస్మాయిల్ఖాన్పేట), సదాశివపేట, కంది (ఇంద్రకరణ్), జోగిపేట, హత్నూర, కోహీర్: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలి. స్థానిక పథకాల నీరు, భగీరథ తాగునీటిని ఒకే ట్యాంకులోకి ఎక్కించి.. ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా మూడుసార్లు ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాల్సి ఉండగా.. జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు.
అమలుకు నోచని నిబంధనలు
జిల్లాలో మిషన్ భగీరథ పథకం అమలులో భాగంగా 1,655 తాగునీటి ట్యాంకులు నిర్మించారు. వాటి ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా 1, 11, 21 తేదీల్లో ట్యాంకులను శుభ్రం చేయాలనే నిబంధన ఎక్కడా అమలు కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ నీటిని, అవే ట్యాంకుల ద్వారా స్థానిక బోర్ల నీటిని సరఫరా చేస్తున్నా.. క్లోరినేషన్ను విస్మరిస్తున్నారు. ఉపరితల, మినీ భాండాగారాలు నాచు పట్టి కనిపిస్తున్నా.. వాటిని శుభ్రం చేయడం లేదు. కొన్ని చోట్ల శిథిలమైన ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
అధికారులు ఏమంటున్నారంటే..
జిల్లాలో మంచి నీటి ట్యాంకులను నిర్దేశిత తేదీల్లో శుభ్రం చేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని మిషన్ భగీరథ ఈఈ ఎస్.కె.పాషా, జిల్లా పంచాయతీ శాఖ అధికారి సాయిబాబా పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు, పంచాయతీ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, నిబంధనలు పాటించాలని సూచించారు.
క్షేత్ర స్థాయి పరిస్థితి
- సంగారెడ్డి మండలం నాగాపూర్, కొత్లాపూర్, కల్పగూర్, అంగడిపేట, ఇర్గిపల్లి, ఇస్మాయిల్ఖాన్పేట, తాళ్లపల్లి, ఫసల్వాది, కుల్పగూర్, మహ్మద్ షాపూర్ తండా, గుడి తండా తదితర గ్రామాల్లో మంచినీటి ట్యాంకుల పరిశుభ్రతను పట్టించుకోవడం లేదు. పరిసరాలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. సదాశివపేట మండలం మద్దికుంట, నందికంది, ఇశ్రితాబాద్, చందాపూర్, ఆత్మకూర్, పొట్టిపల్లి, పెద్దాపూర్, నిజాంపూర్, వెంకటాపూర్ తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
- హత్నూర గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న మంచినీటి ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ఇనుప చువ్వలు తేలాయి.
- కంది మండలంలోని కవలంపేట, బేగంపేట, చెర్యాల్, చెర్లగూడెం తదితర గ్రామాల్లో నెలలో మూడు సార్లు ట్యాంకులు శుభ్రం చేయాలనే నిబంధన అమలు చేయడం లేదు.
- అందోలు మండలం పోతిరెడ్డిపల్లి తండాలో ట్యాంకు శిథిలావస్థకు చేరింది. జోగిపేటలోని ప్రభు మందిరం ఆలయం పక్కనున్న నీటి ట్యాంకుల్లో గతంలో కోతులు పడి మృతి చెందాయి. ఆ తర్వాత కూడా రక్షణ చర్యలు తీసుకోవడం లేదు.
- కోహీర్ మండలం మాచిరెడ్డిపల్లి, పిచేర్యాగడి, గుర్జువాడ తదితర గ్రామాల్లో మినీ ట్యాంకులు నాచు పట్టి దర్శనమిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదర్శంగా నిలిచిన సంగాయిపేట.. అక్కడ 100 శాతం పోలింగ్
[ 13-05-2024]
ఓటింగ్లో మెదక్ జిల్లాలోని సంగాయిపేట తండా వాసులు ఆదర్శంగా నిలిచారు. కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100శాతం పోలింగ్ నమోదైంది. -
ప్రజాస్వామ్య పండుగకు ఆహ్వానం
[ 13-05-2024]
స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి సోమవారం.. తేదీ 13.05.2024న మెదక్, జహీరాబాద్, చేవెళ్ల లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పెద్దలు (ఈసీ) నిర్ణయించారు. పార్లమెంట్లో కీలక ప్రతినిధిని ఎన్నుకునే మహత్తర అవకాశం ఈ శుభదినాన మీకు కల్పించాను. -
ఏ పార్టోడో చూడకు.. ఏ పాటోడో చూడు..
[ 13-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనదే. ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయం.. సమాజ ప్రగతికి దోహదపడు తుంది. పారదర్శకంగా ముందడుగు వేసే తీరు ఆదర్శంగా నిలుస్తుంది. -
ఓటు మరువకు
[ 13-05-2024]
ఈ ఎన్నికల్లో మహిళలు, యువత కదం తొక్కాలి. ఎప్పుడు ఎన్నికలు జరిగిన మహిళలు బారులుతీరి తమ హక్కునును వినియోగించుకుంటున్నారు. ఈ సారి ఆస్ఫూర్తిని చాటాల్సి ఉంది. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు, యువత స్ఫూర్తిని చాటాల్సి ఉంది. -
సిద్దిపేటలో భారాస నేత ఇంటికి తాళం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ సిద్దిపేటలోని అంబేడ్కర్నగర్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారాస యువజన నాయకుడు జువ్వన్న కనకరాజు ఇంట్లో మద్యం నిల్వ ఉందన్న సమాచారంతో తాళం వేసి ఉన్న ఇంటిని టూటౌన్ పోలీసులు ఆదివారం ఉదయం సీల్ చేశారు. -
మాక్ పోలింగ్తో షురూ
[ 13-05-2024]
ఎన్నికల రోజు పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. అంతకంటే రెండు గంటల ముందే ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లు ఓట్లు వేస్తారు. ఇదే మాక్ పోలింగ్. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని, ఈవీఎంలలో ఎలాంటి లోటుపాట్లు లేవని ఆయా పార్టీల ప్రతినిధులకు, ఓటర్లకు తెలియజెప్పడమే ఈ ప్రక్రియ ఉద్దేశం. -
మీ ఓటే.. భవితకు బాట
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా రాజకీయ పార్టీ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయగా... కీలక ఘట్టమైన పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. -
డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు
[ 13-05-2024]
సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ఓటుకు రూ.500, 1000 చొప్పున పంచుతున్నారని మెదక్ లోక్సభ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఆరోపించారు. -
పలు గ్రామాల్లో వడగళ్ల వర్షం
[ 13-05-2024]
పేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం పలు గ్రామాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలలు వీయడంతో సుమారు 4 గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. -
పటిష్ఠ బందోబస్తు
[ 13-05-2024]
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లాలోని రెండు నియోజకవర్గాలు మెదక్ పరిధిలో, మూడు నియోజకవర్గాలు జహీరాబాద్ పరిధిలో ఉన్నాయి. -
కాంగ్రెస్లో చేరికలు
[ 13-05-2024]
భారాసకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్లో చేరారు. అందోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గజేందర్రెడ్డితో పాటు భారాస నాయకులు సంగారెడ్డి పట్టణంలోని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇంట్లో మంత్రి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. -
చైతన్యం చాటుతాం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల కీలక ఘట్టం రానేరానే వచ్చింది. ఇప్పుడు ఓటర్లంతా చైతన్యం చాటాల్సిన అవసరముంది. నేడు లోక్సభ ఎన్నికల సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. -
ఎన్నికల క్రతువును నిర్వహించే ఉద్యోగులు
[ 13-05-2024]
శనివారం పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. పోలింగ్ సామగ్రి, ఉద్యోగులు, సిబ్బందిని తరలించేందుకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
మూడు పార్టీల శ్రేణుల వాగ్వాదం
[ 13-05-2024]
దుబ్బాక ధర్మాజీపేటలో భారాస కార్యకర్త సాయికుమార్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో తనిఖీ బృందం పట్టుకున్నారు. రూ.11,500 లభ్యమైంది. -
విధుల్లో అప్రమత్తత అవసరం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల పోలీసు అబ్జర్వర్ రామేశ్వర్సింగ్ పట్టణంలోని అంబిటస్ స్కూల్లోని పోలింగ్ కేంద్రం, చిన్నకోడూరు మండల కేంద్రం, తొగుట, వెంకట్రావుపేట, మిరుదొడ్డి మండలం అల్వాల, అక్బర్పేట-భూంపల్లి మండలం రుద్రారంలోని పోలింగ్ కేంద్రాలను ఆదివారం సందర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపా సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత
-
గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. కోల్కతాతో మ్యాచ్ రద్దు
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
-
మహిళ కిడ్నాప్ కేసు.. హెచ్డీ రేవణ్ణకు బెయిల్
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
కుప్పకూలిన భారీ హోర్డింగ్.. ఎనిమిది మంది మృతి