కల సాకారమయ్యేలా.. భరోసానిచ్చేలా..
ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు.
ములుగు అటవీ కళాశాలలో యువతకు ప్రత్యేక శిక్షణ
తేనెటీగల పెంపకంపై..
న్యూస్టుడే, ములుగు: ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు. ఇలాంటి వారికి చేయూత అందించేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. మరెక్కడా లేని విధంగా తొలిసారిగా చదువు మధ్యలో నిలిపివేసిన విద్యార్థుల కలలను సాకారం చేయాలన్న లక్ష్యంతో శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. ఇందుకు ములుగు అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం వేదికగా మారింది.
ఆరు నెలలు.. రూ.10 వేల భృతి
శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు ఆరు నెలల పాటు ఆయా అంశాల్లో మెలకువలన్నీ నేర్పిస్తారు. శిక్షణ పూర్తయ్యాక అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం నుంచి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. ఆరు నెలల కోర్సులో మూడు నెలల పాటు బోధన, మిగిలిన నెలల్లో క్షేత్రస్థాయి తర్ఫీదు ఉంటుంది. ప్రతి నెలా రూ.10 వేల చొప్పున గౌరవ భృతి ఇస్తున్నారు.
ఇప్పటికే రైతులకు విడతల వారీగా..
ఆయా అంశాల్లో శిక్షణ గతేడాదిలో ప్రారంభించారు. ముందుగా రైతులకు విడతల వారీగా మెలకువలు నేర్పించారు. పలువురు స్వయంఉపాధి సైతం పొందుతున్నారు. ఏడాది నుంచి మధ్యలో చదువు మానేసిన విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇందుకు రాష్ట్రం నుంచి యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రస్తుత పది మందికే అవకాశం కల్పించారు. మిగిలిన వారికి మరోసారి అవకాశం కల్పించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
మధ్యలో విద్యాభ్యాసం ఆపేసిన యువతకు ఇదో సదవకాశం. అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం తరఫున శిక్షణలు ఇచ్చి ధ్రువపత్రాలు అందిస్తాం. తద్వారా బ్యాంకుల్లో సైతం రుణం పొందవచ్చు. స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది.
ప్రొఫెసర్ ఎం.మమత, కార్యక్రమ సమన్వయకర్త
భరోసా కల్పించింది ధనుంజయ్
నేను ఆరు నెలల పాటు శిక్షణ పొందాను. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. నేను స్వయంగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టాను. ప్రస్తుతం ఉపాధి పొందుతూ మరి కొందరికి వీటి గురించి వివరిస్తున్నాను. ఇక్కడ నేర్చుకున్నవి ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ కార్యక్రమం నాకు ఎంతో భరోసా కలిగించింది.
మూడు అంశాల్లో..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో అటవీ కళాశాలలో ఇన్నోవేషన్, ఎంటర్ప్రిన్యూర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పది నుంచి డిగ్రీ వరకు చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. వీరిలో నుంచి కొందరిని ఎంపిక చేసి వారికి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
- వర్మీకంపోస్ట్ ఎరువుల తయారీ.. సేంద్రియ సాగులో వర్మికంపోస్ట్ కీలకం. దీని తయారీని నేర్పిస్తున్నారు. ఏయే పదార్థాలు ఎంత మోతాదులో కలపాలి, పంటలకు ఎలా ఉపయోగడతుంది, ఎలా, ఎక్కడ విక్రయించాలని తదితర అశాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీని వల్ల విద్యార్థులకు ఉపాధి లభించడంతో పాటు సొంతంగా సేంద్రియ సాగుకు వినియోగించుకోవచ్చు.
- తేనెటీగల పెంపకం.. మార్కెట్లో తేనెకు ఎల్లప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. డిమాండ్ కు తగ్గట్టుగా ఉత్పత్తి లేదు. ఈ తరుణంలో తేనెటీగల పెంపకంతో కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆదాయాన్ని పొందే తీరుతో పాటు తేనె ఎక్కడ విక్రయించాలి, తదితర అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు.
- నర్సరీలు.. ఇటీవల కాలంలో నర్సరీలకు డిమాండ్ పెరిగింది. ఇందుకు తగ్గట్టుగా ప్రత్యేకంగా నర్సరీల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. నర్సరీల ఏర్పాటు తీరు, మొక్కల పెంపకం, తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాస్వామ్య పండుగకు ఆహ్వానం
[ 13-05-2024]
స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి సోమవారం.. తేదీ 13.05.2024న మెదక్, జహీరాబాద్, చేవెళ్ల లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పెద్దలు (ఈసీ) నిర్ణయించారు. పార్లమెంట్లో కీలక ప్రతినిధిని ఎన్నుకునే మహత్తర అవకాశం ఈ శుభదినాన మీకు కల్పించాను. -
ఏ పార్టోడో చూడకు.. ఏ పాటోడో చూడు..
[ 13-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనదే. ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయం.. సమాజ ప్రగతికి దోహదపడు తుంది. పారదర్శకంగా ముందడుగు వేసే తీరు ఆదర్శంగా నిలుస్తుంది. -
ఓటు మరువకు
[ 13-05-2024]
ఈ ఎన్నికల్లో మహిళలు, యువత కదం తొక్కాలి. ఎప్పుడు ఎన్నికలు జరిగిన మహిళలు బారులుతీరి తమ హక్కునును వినియోగించుకుంటున్నారు. ఈ సారి ఆస్ఫూర్తిని చాటాల్సి ఉంది. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు, యువత స్ఫూర్తిని చాటాల్సి ఉంది. -
సిద్దిపేటలో భారాస నేత ఇంటికి తాళం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ సిద్దిపేటలోని అంబేడ్కర్నగర్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారాస యువజన నాయకుడు జువ్వన్న కనకరాజు ఇంట్లో మద్యం నిల్వ ఉందన్న సమాచారంతో తాళం వేసి ఉన్న ఇంటిని టూటౌన్ పోలీసులు ఆదివారం ఉదయం సీల్ చేశారు. -
మాక్ పోలింగ్తో షురూ
[ 13-05-2024]
ఎన్నికల రోజు పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. అంతకంటే రెండు గంటల ముందే ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లు ఓట్లు వేస్తారు. ఇదే మాక్ పోలింగ్. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని, ఈవీఎంలలో ఎలాంటి లోటుపాట్లు లేవని ఆయా పార్టీల ప్రతినిధులకు, ఓటర్లకు తెలియజెప్పడమే ఈ ప్రక్రియ ఉద్దేశం. -
మీ ఓటే.. భవితకు బాట
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా రాజకీయ పార్టీ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయగా... కీలక ఘట్టమైన పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. -
డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు
[ 13-05-2024]
సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ఓటుకు రూ.500, 1000 చొప్పున పంచుతున్నారని మెదక్ లోక్సభ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఆరోపించారు. -
పలు గ్రామాల్లో వడగళ్ల వర్షం
[ 13-05-2024]
పేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం పలు గ్రామాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలలు వీయడంతో సుమారు 4 గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. -
పటిష్ఠ బందోబస్తు
[ 13-05-2024]
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లాలోని రెండు నియోజకవర్గాలు మెదక్ పరిధిలో, మూడు నియోజకవర్గాలు జహీరాబాద్ పరిధిలో ఉన్నాయి. -
కాంగ్రెస్లో చేరికలు
[ 13-05-2024]
భారాసకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్లో చేరారు. అందోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గజేందర్రెడ్డితో పాటు భారాస నాయకులు సంగారెడ్డి పట్టణంలోని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇంట్లో మంత్రి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. -
చైతన్యం చాటుతాం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల కీలక ఘట్టం రానేరానే వచ్చింది. ఇప్పుడు ఓటర్లంతా చైతన్యం చాటాల్సిన అవసరముంది. నేడు లోక్సభ ఎన్నికల సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. -
ఎన్నికల క్రతువును నిర్వహించే ఉద్యోగులు
[ 13-05-2024]
శనివారం పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. పోలింగ్ సామగ్రి, ఉద్యోగులు, సిబ్బందిని తరలించేందుకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
మూడు పార్టీల శ్రేణుల వాగ్వాదం
[ 13-05-2024]
దుబ్బాక ధర్మాజీపేటలో భారాస కార్యకర్త సాయికుమార్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో తనిఖీ బృందం పట్టుకున్నారు. రూ.11,500 లభ్యమైంది. -
విధుల్లో అప్రమత్తత అవసరం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల పోలీసు అబ్జర్వర్ రామేశ్వర్సింగ్ పట్టణంలోని అంబిటస్ స్కూల్లోని పోలింగ్ కేంద్రం, చిన్నకోడూరు మండల కేంద్రం, తొగుట, వెంకట్రావుపేట, మిరుదొడ్డి మండలం అల్వాల, అక్బర్పేట-భూంపల్లి మండలం రుద్రారంలోని పోలింగ్ కేంద్రాలను ఆదివారం సందర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
-
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
-
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
వేసవి రద్దీ.. విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు