మోదీ.. బీసీ.. ట్రస్టు..
పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు.
న్యూస్టుడే, గజ్వేల్,మెదక్: పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో మెదక్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉండగా మిగతా ఆరింటిలో ప్రతిపక్ష పార్టీ భారాస ఎమ్మెల్యేలున్నారు. నియోజకవర్గంలో 18-40 ఏళ్ల వయసున్న ఓటర్లు 9.50 లక్షలు ఉన్నారు. ప్రధాన పార్టీ నేతలు వీరి అవసరాలను గుర్తించి ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. యువజన, మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
భాజపా: జాతీయభావం
ఎలాగైనా మెదక్ పార్లమెంటు సీటును గెలుచుకుని పాగా వేయాలని భాజపా గురిపెట్టింది. పార్లమెంటు పరిధిలో భాజపా ఎమ్మెల్యేలు లేకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా గట్టెక్కిస్తుందని నమ్మకంతో ఉన్నారు. వాగ్ధాటి ఉన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావును బరిలోకి దించిన భాజపా సర్వశక్తులు ఒడ్డుతోంది. రాబోయేది మళ్లీ మోదీ ప్రభుత్వమేనని భారాస, కాంగ్రెస్లకు ఓట్లేస్తే వృథా అవుతాయని చెబుతున్నారు. దేశంలో ప్రధానిగా మోదీ తప్ప మరెవ్వరున్నా రక్షణ ఉండదని, హిందువుల ఆరాధ్య దైవం రాముడికి గుడి కట్టించటమేకాక అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న భాజపానే గెలిపిస్తారని విశ్వసిస్తున్నారు.
కాంగ్రెస్: చేరికలకు ప్రోత్సాహం
కాంగ్రెస్ పథకాలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారని ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. ‘బీసీ బిడ్డను గెలిపించండి’ అని సామాజికవర్గాన్ని ప్రచారంలో ముందుకేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటే చోట మెదక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా చేరికలు, భారాసపై అసంతృప్తి, ప్రభుత్వంపై భరోసా ఓట్లు తీసుకొస్తాయని నేతలు చెబుతున్నారు. భారాస ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జిల్లా నేతలు ఎలక్షన్రెడ్డి, కేసీఆర్ సన్నిహితుడు మడుపు భూంరెడ్డి కారు దిగి హస్తం పార్టీలో చేరారు. పదుల సంఖ్యలో ఓటర్లలో పట్టున్న నేత అయినా సరే చేర్చుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరును ప్రస్తావిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
భారాస: మరోసారి పట్టు కోసం
సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలు తమకు కంచుకోటగా ఉన్నాయని భారాస భరోసాతో ఉంది. 2004 నుంచి మెదక్లో వరుసగా విజయం సాధిస్తున్న భారాస ఈసారీ పట్టు నిలుపుకోవాలని వ్యూహంతో ముందుకెళుతోంది. మెదక్ పార్లమెంటు పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలు భారాస ఖాతాలో ఉన్నందున భారీగా ఓట్లు రాబట్టుకునేందుకు అవకాశం ఉందని పార్టీ నేతలు నమ్ముతున్నారు. సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బరిలోకి దించిన భారాస విజయం కోసం పావులు కదుపుతోంది. రూ.100 కోట్ల ట్రస్టు ద్వారా సొంతంగా సేవా కార్యక్రమాలు చేస్తానని వెంకట్రామిరెడ్డి ప్రచారంలో చెబుతున్నారు. ఎలాగైనా గెలిపించాలని మాజీ మంత్రి హరీశ్రావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో లోపాలు ఎత్తిచూపి ఓట్ల లబ్ధి పొందాలనే వ్యూహంతో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండగలా.. కదిలొచ్చారు
[ 14-05-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. పండగలా కదిలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
నొక్కి.. వక్కాణించారు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు జోరుగా సాగింది. మెదక్, జహీరాబాద్, చేవెళ్ల లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల అధినేతలు ప్రచారం హోరెత్తించి మాటల తూటాలు పేల్చారు. -
సంగాయిపేట తండాలో శత శాతం పోలింగ్
[ 14-05-2024]
కొల్చారం మండలం సంగాయిపేట తండాలోని 62/ఏ పోలింగ్ కేంద్రంలో శత శాతం పోలింగ్ నమోదైంది. -
సమస్యాత్మక కేంద్రాల్లో ప్రశాంత పోలింగ్
[ 14-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. -
సీఎంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
బీవీఆర్ఐటీలో 5, గురుకులంలో 2
[ 14-05-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపును నర్సాపూర్లో జూన్ 4న నిర్వహించనున్నామని ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి తెలిపారు. -
భారాస, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల కాంగ్రెస్, భారాస పార్టీల కార్యకర్తలు, నాయకులు గొడవ పడ్డారు. -
కార్పొరేట్ విద్య.. అందిపుచ్చుకుంటే భవిత
[ 14-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి 7 జీపీఏకు పైగా ఫలితం సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ఉచితంగా అవకాశం కల్పిస్తుండటం విశేషం. -
పోలింగ్ శాతంపై తర్జనభర్జన
[ 14-05-2024]
కరీంనగర్ లోక్సభ పరిధి బెజ్జంకి మండలంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం నమోదులో అధికారులు తర్జనభర్జనకు గురయ్యారు. -
ఓటు వేసి వీడియో చిత్రీకరణ.. యువకులపై కేసు
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి చరవాణిలో స్వీయ వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
హల్దీ వాగులో దూకి వృద్ధుడి ఆత్మహత్య
[ 14-05-2024]
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు హల్దీ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం తూప్రాన్లో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
-
టీ20 ప్రపంచకప్ 2024.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఇవే...