పట్టు సాధించేలా..
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది.
రేపు అల్లాదుర్గంలో ప్రధానమంత్రి సభ
న్యూస్టుడే, మెదక్, అల్లాదుర్గం: కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్న సంకల్పంతో అగ్రనేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తూ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కేంద్ర మంత్రి అమిత్షా, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్ ప్రచారం చేపట్టగా.. ప్రధాని నరేంద్రమోదీ మెతుకుసీమలో పర్యటించనున్నారు. ఈ నెల 30 మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గం శివారులోని చిల్వేర్ వద్ద నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ కార్యకర్తలు, శ్రేణులను తరలించనున్నారు.
- మెదక్ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో రఘునందన్రావు బరిలో నిలిచారు. 2019 ఎంపీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసిన ఆయన మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. జహీరాబాద్ స్థానానికి నాలుగో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి సారి కాంగ్రెస్ గెలవగా, ఆ తర్వాత వరుసగా భారాస విజయం సాధించింది. రెండు సార్లు ఎంపీగా గెలిచిన బీబీపాటిల్ ఈసారి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు.
నెలన్నరలోనే రెండోసారి
ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలనే యోచనతో పార్టీ అగ్రనేతలు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యే సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. లక్ష మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు 30 ఎకరాలను చదును చేశారు. మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాలకు అందుబాటులో ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు. గత మార్చి 5న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులో జరిగిన భాజపా విజయ సంకల్పసభకు హాజరైన ప్రధానమంత్రి నెలన్నర రోజుల వ్యవధిలోనే మరోసారి ఉమ్మడి జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రధాని సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా.. పెద్దఎత్తున పార్టీ శ్రేణులను తరలించి, సభ విజయవంతానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థులు బీబీపాటిల్, రఘునందన్రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండగలా.. కదిలొచ్చారు
[ 14-05-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. పండగలా కదిలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
నొక్కి.. వక్కాణించారు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు జోరుగా సాగింది. మెదక్, జహీరాబాద్, చేవెళ్ల లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల అధినేతలు ప్రచారం హోరెత్తించి మాటల తూటాలు పేల్చారు. -
సంగాయిపేట తండాలో శత శాతం పోలింగ్
[ 14-05-2024]
కొల్చారం మండలం సంగాయిపేట తండాలోని 62/ఏ పోలింగ్ కేంద్రంలో శత శాతం పోలింగ్ నమోదైంది. -
సమస్యాత్మక కేంద్రాల్లో ప్రశాంత పోలింగ్
[ 14-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. -
సీఎంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
బీవీఆర్ఐటీలో 5, గురుకులంలో 2
[ 14-05-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపును నర్సాపూర్లో జూన్ 4న నిర్వహించనున్నామని ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి తెలిపారు. -
భారాస, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల కాంగ్రెస్, భారాస పార్టీల కార్యకర్తలు, నాయకులు గొడవ పడ్డారు. -
కార్పొరేట్ విద్య.. అందిపుచ్చుకుంటే భవిత
[ 14-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి 7 జీపీఏకు పైగా ఫలితం సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ఉచితంగా అవకాశం కల్పిస్తుండటం విశేషం. -
పోలింగ్ శాతంపై తర్జనభర్జన
[ 14-05-2024]
కరీంనగర్ లోక్సభ పరిధి బెజ్జంకి మండలంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం నమోదులో అధికారులు తర్జనభర్జనకు గురయ్యారు. -
ఓటు వేసి వీడియో చిత్రీకరణ.. యువకులపై కేసు
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి చరవాణిలో స్వీయ వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
హల్దీ వాగులో దూకి వృద్ధుడి ఆత్మహత్య
[ 14-05-2024]
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు హల్దీ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం తూప్రాన్లో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
-
టీ20 ప్రపంచకప్ 2024.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఇవే...
-
హోర్డింగ్ కుప్పకూలిన ఘటన.. వెలుగులోకి పలు కీలక విషయాలు