logo

మార్కెట్‌ నిర్వాహకులతో అదనపు కలెక్టర్‌ సమావేశం

మిర్యాలగూడ పట్టణంలోని పాతబస్టాండ్‌ కూరగాయలు, మటన్‌ చికెన్‌, వస్త్ర వ్యాపారులతో జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సమావేశం నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించారు

Published : 21 Jan 2022 02:35 IST

గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: మిర్యాలగూడ పట్టణంలోని పాతబస్టాండ్‌ కూరగాయలు, మటన్‌ చికెన్‌, వస్త్ర వ్యాపారులతో జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సమావేశం నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించారు. ప్రస్తుతం ఎన్నెస్పీ క్యాంపులో మటన్‌, కూరగాయల మార్కెట్‌ నిర్మాణానికి స్థలం కేటాయించామన్నారు. పాతబస్టాండ్‌ స్థలంలో సైతం దుకాణాలు నిర్మిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు. పట్టణాల్లో అన్నిరకాల వసతుల కల్పనకు నిర్ణయించినందున మార్కెట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వై.వెంకటేశ్వర్‌రావు, కమిషనర్‌ రవీందర్‌సాగర్‌, తహసీల్దార్‌ గణేశ్‌, తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని