రాజకీయ వారసత్వంతో కుందూరు జైవీర్ ఘనవిజయం
రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్, కాంగ్రెస్ ఉద్ధండ నాయకుడిగా పేరుగాంచిన కుందూరు జానారెడ్డి రెండో కుమారుడు కుందూరు జైవీర్.
గుర్రంపోడు, న్యూస్టుడే: రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్, కాంగ్రెస్ ఉద్ధండ నాయకుడిగా పేరుగాంచిన కుందూరు జానారెడ్డి రెండో కుమారుడు కుందూరు జైవీర్. గత ఉప ఎన్నికల్లో నోముల భగత్పై ఓటమి పొందిన అనంతరం ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపక సాగర్ టిక్కెట్ను తన రెండో కుమారుడు జైవీర్కు ఇప్పించుకున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ అయిన జైవీర్ గత ఉప ఎన్నికల్లో తండ్రితో పాటు ప్రచారంలో వెన్నంటి ఉండి నియోజకవర్గంలో పరిచయాలు పెంచుకుని తనకంటూ యువతలో ఫాలోయింగ్ పెంచుకోగలిగారు. దీంతో కార్యకర్తలు సూచన మేరకు జానారెడ్డి తన పెద్దకుమారుడు రఘువీర్ను కాకుండా జైవీర్ను ఎంచుకున్నారు. టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతోనే నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో కార్యకర్తలను ముందుగా కలిసి తాను పోటీలో ఉంటున్నట్లు సూచనలు పంపగలిగారు. జానారెడ్డి కూడా తనకు పరిచయమున్న నాయకులు, ముఖ్య కార్యకర్తలను పిలిపించుకుని తన కుమారుడికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ ప్రయత్నం ఫలించటంతో జైవీర్ నామినేషన్ వేసేటప్పుడు కూడా పెద్దసంఖ్యలో కార్యకర్తలతో హంగామా చేయగలిగారు. దీంతో పాటు ఊరూరా ప్రచారంలో పాల్గొని జనంతో మమేకమై వారి కష్ట సుఖాలను తెలుసుకుని వేదికలపై వాటిని ప్రస్తావించటమే కాక పాలక వర్గాన్ని విమర్శిస్తూ చక్కటి వక్తగా ఎదిగారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై అవగాహన పెంచుకున్న జైవీర్ కొద్దికాలంలోనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల విధులకు గైర్హాజరు.. 48 మంది ఉద్యోగులపై కేసు నమోదు
[ 12-05-2024]
ఎన్నికల విధులకు గైర్హాజరైన 48 మంది ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పోలింగ్ సామాగ్రి పంపిణీ
[ 12-05-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ సామాగ్రి ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. -
సమస్యాత్మక కేంద్రాలు.. పటిష్ఠ భద్రతకు ఏర్పాట్లు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. -
90శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడండి
[ 12-05-2024]
13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని 80 నుంచి 90 శాతం పోలయ్యే విధంగా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకుడు కళ్యాణ్కుమార్దాస్ పిలుపునిచ్చారు. -
వారే కీలకం..!
[ 12-05-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. ఓటు హక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. ఓటు నమోదు మొదలుకుని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం సమన్వయంతో శ్రమించాల్సి ఉంటుంది. -
నిర్వాసిత గ్రామం.. ఓటు వినియోగంలో ఆదర్శం
[ 12-05-2024]
పీఏపల్లి మండలంలోని మారుమూల గ్రామం బూడిదగట్టు ఓటర్లు ఓటు వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పోలింగ్ సిబ్బంది యాదృచ్ఛికీకరణ పూర్తి
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్లో శనివారం పోలింగ్ సిబ్బంది యాదృచ్ఛికీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పెద్దమనుషులుగా వచ్చి.. కొట్టి చంపారు
[ 12-05-2024]
నల్గొండ జిల్లా కేంద్రంలో భార్యా భర్తల మధ్య గొడవ హత్య వరకు దారి తీసింది.. నల్గొండ వన్టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన సమాచారం మేరకు.. గుంటూరు పట్టణానికి చెందిన సయ్యద్ వలి(40) ఆరేళ్ల క్రితం నల్గొండలోని బీటీఎస్ ప్రాంతంలోని శ్రీనివాస్నగర్లో ఉంటూ అడ్డా కూలీగా పనిచేస్తున్నారు. -
మాట ఆగింది.. మీట పిలుస్తోంది
[ 12-05-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. పోలింగ్కు మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో తమకే ఓటు వేసేలా గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
[ 12-05-2024]
జిల్లా వ్యాప్తంగా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిశితమైన నిఘా పెట్టామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ప్రచారం పర్వం ముగిసింది. పోలింగ్కు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన స్థలాల్లో ఏడు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు -
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
[ 12-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు