logo

రాజకీయ వారసత్వంతో కుందూరు జైవీర్‌ ఘనవిజయం

రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌, కాంగ్రెస్‌ ఉద్ధండ నాయకుడిగా పేరుగాంచిన కుందూరు జానారెడ్డి రెండో కుమారుడు కుందూరు జైవీర్‌.

Published : 04 Dec 2023 04:32 IST

గుర్రంపోడు, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌, కాంగ్రెస్‌ ఉద్ధండ నాయకుడిగా పేరుగాంచిన కుందూరు జానారెడ్డి రెండో కుమారుడు కుందూరు జైవీర్‌. గత ఉప ఎన్నికల్లో నోముల భగత్‌పై ఓటమి పొందిన అనంతరం ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపక సాగర్‌ టిక్కెట్‌ను తన రెండో కుమారుడు జైవీర్‌కు ఇప్పించుకున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్‌ అయిన జైవీర్‌ గత ఉప ఎన్నికల్లో తండ్రితో పాటు ప్రచారంలో వెన్నంటి ఉండి నియోజకవర్గంలో పరిచయాలు పెంచుకుని తనకంటూ యువతలో ఫాలోయింగ్‌ పెంచుకోగలిగారు. దీంతో కార్యకర్తలు సూచన మేరకు జానారెడ్డి తన పెద్దకుమారుడు రఘువీర్‌ను కాకుండా జైవీర్‌ను ఎంచుకున్నారు. టిక్కెట్‌ వస్తుందన్న నమ్మకంతోనే నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో కార్యకర్తలను ముందుగా కలిసి తాను పోటీలో ఉంటున్నట్లు సూచనలు పంపగలిగారు. జానారెడ్డి కూడా తనకు పరిచయమున్న నాయకులు, ముఖ్య కార్యకర్తలను పిలిపించుకుని తన కుమారుడికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ ప్రయత్నం ఫలించటంతో జైవీర్‌ నామినేషన్‌ వేసేటప్పుడు కూడా పెద్దసంఖ్యలో కార్యకర్తలతో హంగామా చేయగలిగారు. దీంతో పాటు ఊరూరా ప్రచారంలో పాల్గొని జనంతో మమేకమై వారి కష్ట సుఖాలను తెలుసుకుని వేదికలపై వాటిని ప్రస్తావించటమే కాక పాలక వర్గాన్ని విమర్శిస్తూ చక్కటి వక్తగా ఎదిగారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై అవగాహన పెంచుకున్న జైవీర్‌ కొద్దికాలంలోనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు