లోక్సభ ప్రచారంలో.. స్థానిక వ్యూహం
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు మాసాలకే జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు డిజిటల్ ప్రచారాన్ని మొదలుపెట్టారు.
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు మాసాలకే జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు డిజిటల్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థిపై వాడివేడి విమర్శలు సంధిస్తూ ఓటర్లను ఆకట్టుకునే నినాదాలతో ఆయా పార్టీలు ప్రచారాన్ని విస్తృతం చేశాయి. అధికారంలోకి వస్తే ఏమి చేస్తామనేది చెబుతూనే ప్రత్యర్థులపై సున్నితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యంగ్య చిత్రాలు, చురుక్కుమని గుచ్చుకునేలా నినాదాలతో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్విటర్(ఎక్స్), ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్ ప్లస్ వెబ్సైట్, డిజిటల్ మీడియా వేదికగా చేసుకొని అభ్యర్థులు ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదంతా ఒక ఎత్తైతే.. మరో వైపు పల్లెల్లో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది.
రీల్స్ పెట్టు.. సాయంత్రం సరకు పట్టు..
ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే తమ పార్టీ అభ్యర్థితో పాటు స్థానిక నాయకుడి ఫొటోతో రీల్స్ తయారు చేసి ఆరోజు గ్రూపులో పెడితే సాయంత్రం ఆ కార్యకర్తకు పండగే. రెండు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్, భాజపా, భారాస అభ్యర్థులు ఖరారు కావడంతో ఆయా పార్టీలు సామాజిక మాధ్యమాల గ్రూపులను ఏర్పాటు చేసి, పార్టీలో చురుగ్గా వ్యవహరించే నాయకులు, కార్యకర్తలతో వాట్సప్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రూపుల్లో ఎవరైనా కార్యకర్త ఆ పార్టీ స్థానిక నాయకుడిని పొగిడేలా ఫొటోతో రీల్స్ పెడితే ఆ మొత్తం బృందం విందు ఏర్పాట్లకు ఆయా నాయకులు రూ.10 వేల వరకు ముట్టచెబుతున్నట్టు సమాచారం. ఈ తరహా ప్రచారంతో ‘స్వామి కార్యము. స్వకార్యమూ’ పూర్తవుతున్నాయని ఆయా పార్టీల గ్రామ స్థాయి ఆశావహులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి పల్లెనా ‘ఫలానా’.. అన్న యువసేన ..
లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఉంటుందనే ప్రభుత్వ ప్రకటనతో ప్రతి గ్రామంలో ‘ఫలానా’.. అన్న యువ సేన.. అనే పేరుతో వాట్సప్ గ్రూపులు వెలుస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే, మండల, గ్రామ స్థాయి నాయకుడి పేరుతో చివరన అన్న యువసేన పదాన్ని జోడించి వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా పల్లె స్థాయిలో ప్రచారం పొందేందుకు వేదిక ఏర్పాటు చేసుకుంటున్నారు. పల్లెల్లో ఏర్పాటు చేస్తున్న వాట్సప్ గ్రూపులు మొత్తం రాబోయే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులే ఏర్పాటు చేస్తుండటం డిజిటల్ ప్రచార వేదికకు అద్ధం పడుతోంది.
నాంపల్లి, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ సామాగ్రి పంపిణీ
[ 12-05-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ సామాగ్రి ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. -
సమస్యాత్మక కేంద్రాలు.. పటిష్ఠ భద్రతకు ఏర్పాట్లు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. -
90శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడండి
[ 12-05-2024]
13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని 80 నుంచి 90 శాతం పోలయ్యే విధంగా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకుడు కళ్యాణ్కుమార్దాస్ పిలుపునిచ్చారు. -
వారే కీలకం..!
[ 12-05-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. ఓటు హక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. ఓటు నమోదు మొదలుకుని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం సమన్వయంతో శ్రమించాల్సి ఉంటుంది. -
నిర్వాసిత గ్రామం.. ఓటు వినియోగంలో ఆదర్శం
[ 12-05-2024]
పీఏపల్లి మండలంలోని మారుమూల గ్రామం బూడిదగట్టు ఓటర్లు ఓటు వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పోలింగ్ సిబ్బంది యాదృచ్ఛికీకరణ పూర్తి
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్లో శనివారం పోలింగ్ సిబ్బంది యాదృచ్ఛికీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పెద్దమనుషులుగా వచ్చి.. కొట్టి చంపారు
[ 12-05-2024]
నల్గొండ జిల్లా కేంద్రంలో భార్యా భర్తల మధ్య గొడవ హత్య వరకు దారి తీసింది.. నల్గొండ వన్టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన సమాచారం మేరకు.. గుంటూరు పట్టణానికి చెందిన సయ్యద్ వలి(40) ఆరేళ్ల క్రితం నల్గొండలోని బీటీఎస్ ప్రాంతంలోని శ్రీనివాస్నగర్లో ఉంటూ అడ్డా కూలీగా పనిచేస్తున్నారు. -
మాట ఆగింది.. మీట పిలుస్తోంది
[ 12-05-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. పోలింగ్కు మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో తమకే ఓటు వేసేలా గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
[ 12-05-2024]
జిల్లా వ్యాప్తంగా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిశితమైన నిఘా పెట్టామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ప్రచారం పర్వం ముగిసింది. పోలింగ్కు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన స్థలాల్లో ఏడు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు -
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
[ 12-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూత
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!