గెలుపు వ్యూహం..!
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది.
నల్గొండ, భువనగిరిలో పాగాకు భాజపా కసరత్తు
వచ్చే నెల మొదటి వారంలో చౌటుప్పల్లో ప్రధాని మోదీ సభ!
ఈనాడు, నల్గొండ, న్యూస్టుడే, భువనగిరి: ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది. రెండు స్థానాల్లో మాజీ ప్రజాప్రతినిధులైన శానంపూడి సైదిరెడ్డి, బూర నర్సయ్యగౌడ్ను బరిలో నిలిపారు. వారు ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, భారాసలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు.
నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార వ్యూహాలను ఖరారు చేస్తూ.. తాము గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న సమయంలో చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర, జాతీయ నాయకులను రప్పించి కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రెండు లోక్సభ స్థానాల అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా కేంద్ర మంత్రులు జై శంకర్, కిరణ్ రిజిజులను రప్పించి రెండు స్థానాల్లో తాము గెలుపుపై ఎంత దృష్టి పెడుతున్నారో స్పష్టం చేశారు. దేశ విదేశాంగ మంత్రి భాజపా అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి రావడం భువనగిరి చరిత్రలో అదే తొలిసారి.
చౌటుప్పల్లో మోదీ సభ..!
నల్గొండ, భువనగిరి స్థానాల్లో గెలుపునకు అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన సభ చౌటుప్పల్లో ఖరారైంది. మే నెల 3న లేదంటే 7, 8 తేదీల్లో ఒక రోజు సభ ఉండే అవకాశం ఉందని పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ ‘ఈనాడు’కు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాగా వేయాలని భావిస్తున్న భాజపా ఆ మేరకు మే నెల మొదటి వారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. రెండు లోక్సభల్లో కీలక ప్రాంతాలయిన నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, మిర్యాలగూడల్లో కేంద్ర మంత్రులు, జాతీయ నేతలతో రోడ్షోలు, సభల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. ప్రధాని మోదీ సభ అనంతరం భువనగిరిలో అమిత్షా లేదంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో రోడ్షో నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు జిల్లా స్థాయిలోనూ ఎప్పటికప్పుడు అభ్యర్థులు సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియా వారియర్స్తో పాటూ బూత్ స్థాయిలో అధ్యక్షుల నుంచి జిల్లా అధ్యక్షుల వరకు పార్టీ ప్రచార సరళిపై నివేదికల ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో పర్యవేక్షకులు తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలతో సమానంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి లోక్సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు పొందేలా కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి: కలెక్టర్
[ 13-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2061 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. -
ఈ రోజు మనదే..!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక క్రతువైన పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది -
స్వయంవరంలో.. ఆ ఇద్దరు
[ 13-05-2024]
ఇది ఐదేళ్ల ఒప్పంద వేడుక. దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు వధువులు (ఎంపీ స్థానాలు) స్వయంవరం ప్రకటించుకున్నారు -
గడప దాటిస్తే.. గండం గడిచినట్లే
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం రానే వచ్చింది. ఇన్నాళ్లుగా ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసిన ప్రచారం ఒక ఎత్తైతే.. పోలింగ్ రోజు ఓటర్లను ఇంటి గడప దాటించి పోలింగ్ కేంద్రానికి రప్పించి ఓట్లేయించడం ఇంకో ఎత్తు. కొన్నేళ్లుగా లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. -
ఎన్నికల కేసులో ఇరుక్కోకు తమ్ముడూ..!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ నేతలు చెప్పారనో.. ప్రలోభాలకు లొంగిపోయో ఎన్నికల వేళ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. -
ఆదర్శ కళాశాలలు పిలుస్తున్నాయ్..!
[ 13-05-2024]
ఆదర్శ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం ఈ నెల 9న ప్రకటన విడుదల చేసింది. -
మనోళ్లు ఓటేసేదిక్కడే!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. -
పకడ్బందీగా... ప్రణాళికగా
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు: ఎస్పీ
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు -
పదండి..ఓటేద్దాం..!
[ 13-05-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. తుది ఏర్పాట్లను పూర్తి చేసింది -
పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
[ 13-05-2024]
భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్కు ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్, ఆర్వో హన్మంతు కె.జెండగే పరిశీలించారు -
అంతా గుట్టుగా..!
[ 13-05-2024]
రసవత్తర పోరుకు వేదికగా మారిన భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టిపెట్టాయి
తాజా వార్తలు (Latest News)
-
‘ఇక నేను పెళ్లి చేసుకోవాలి’: రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్
-
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
-
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
-
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?