గెలిచి వచ్చి అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి
గెలుపుతో స్వగ్రామానికి తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్ వేసిన అనంతరం తన స్వగ్రామం ఇందుపూరుకు వచ్చారు
వేమిరెడ్డిని సన్మానిస్తున్న గ్రామస్థులు
అల్లూరు, న్యూస్టుడే: గెలుపుతో స్వగ్రామానికి తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్ వేసిన అనంతరం తన స్వగ్రామం ఇందుపూరుకు వచ్చారు. దేవాలయాలు, మసీˆదులో పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామస్థులు సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు వేమిరెడ్డి కోటారెడ్డి, బీద గిరిధర్, దినీత్రెడ్డి, బండి శ్రీనివాసులురెడ్డి, అంబటి రాజేంద్ర, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డాక్యుమెంటరీ తీయాలి : కార్యక్రమంలో పాల్గొన్న జబర్దస్త్ నటుడు ఆర్పీ మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ తీయాలనుందన్నారు.
కాకర్ల భారీ ప్రదర్శన
ఉదయగిరి, దుత్తలూరు : ఉదయగిరి తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ సోమవారం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. వింజమూరులోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. ఆపై బొమ్మరాజుచెరువు వద్ద కార్యాలయం నుంచి ర్యాలీగా కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, నాయకులు పి.చెంచలబాబుయాదవ్, మేకపాటి శాంతికుమారి, మన్నేటి వెంకటరెడ్డితోపాటు తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు, అభిమానులతో కలిసి ఉదయగిరి బస్టాండు సెంటర్ చేరుకున్నారు. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా రమేష్ ప్రేమ్కుమార్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం అబ్దుల్ ఖాదర్ఖాన్ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు.
తెదేపాలో చేరికలు
లింగసముద్రం : రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని కందుకూరు ఉమ్మడి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం తిమ్మారెడ్డిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు నీలం బ్రహ్మరెడ్డి ఆధ్వర్యంలో వైకాపాను వీడి తెదేపా చేశారు. వారికి తెదేపా కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. కార్యక్రమంలో అడపా రంగయ్య, మధు, మాజీ ఎంపీపీ బాలకోటయ్య పాల్గొన్నారు. ్ర పెదపవనికి చెందిన పలువురు ముస్లింలు వైకాపాను వీడి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెదేపాలో చేశారు. ఈ కార్యక్రమంలో సాంబయ్య, నాయబ్ రసూల్, నాయబ్ పాల్గొన్నారు.
వైకాపా ఎంపీˆటీసీˆ సభ్యుడు..
బిట్రగుంట : బోగోలు మూడో ఎంపీˆటీసీˆ వల్లాకి స్వరూప (వైకాపా) తెదేపాలో చేరారు. సోమవారం కృష్ణారెడ్డి పార్టీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. తాళ్లూరు పంచాయతీ వార్డు సభ్యుడు కె.హజరత్తయ్య కూడా చేరారు.
ఆడంబరంగా పసుపులేటి నామినేషన్
కావలి : స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ సోమవారం ఆడంబరంగా నామినేషన్ వేశారు. పట్టణంలోని ట్రంకురోడ్డులో భారీ జనసమీకరణతో గుర్రంపై ర్యాలీగా వెళ్లారు. ఆయనతోపాటు సతీమణి సుగుణ కూడా రెండేసి సెట్ల నామినేషన్లు ఆర్వో వీకే శీనానాయక్కు అందజేశారు. జైభారత్ జాతీయ పార్టీ తరఫున ఎం.నరేంద్ర, స్వతంత్ర అభ్యర్థులుగా అనుమాలశెట్టి హరిప్రసాద్, రాచూరు వెంకట సుబ్బారావులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రావణ్ నామపత్రాల్లో తప్పులుండడంతో సవరించి తీసుకురావాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచారం
[ 03-05-2024]
క్లస్టర్ ఇన్ఛార్జ్, తెదేపా సీనియర్ నాయకుడు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో 19వ వార్డు ఇన్ఛార్జ్ వేగూరి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సీనియర్ ఫ్యాకల్టీకి ఎస్వీ వర్సిటీ డాక్టరేట్
[ 03-05-2024]
కావలి పట్టణానికి చెందిన సురేఖ కుమారికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. -
పరిశ్రమలు రావాలంటే బాబు రావాలి
[ 03-05-2024]
కోవూరు మండల వలసలతో వైకాపా బక్కచిక్కుతుంటే తెదేపా బలపడుతోంది. -
నగరంలో నేడు చంద్రబాబు, పవన్కల్యాణ్ పర్యటన
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. -
జగన్.. ఏడి‘పింఛన్’!
[ 03-05-2024]
అవ్వా తాతల జీవితాల్లో ఆనందం, సంతోషం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. అందుకే వారి ఇంటి వద్దనే పింఛను డబ్బు పంపిణీ చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నామని పదే పదే చెప్పిన జగన్.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వారిని ఇబ్బంది పెట్టేందుకూ వెనుకాడటం లేదు. -
జిల్లా ఓటర్లు 19,44,874
[ 03-05-2024]
జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. నియోజకవర్గాల వారీగా ఓటుహక్కు వినియోగించుకునే వారి తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో గత జననవరి 22వ తేదీ నాటికి 19,08,498 ఉండగా- తాజా జాబితా ప్రకారం ఆ సంఖ్య పెరిగింది. -
వంతెన నిర్లక్ష్యం.. ఈ వంతున
[ 03-05-2024]
జిల్లాలో పలు రహదారులు, శిథిలమైన వంతెనలు భయపెడుతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో కాలం చెల్లిపోయాయి. వీటిపై రాకపోకలు ప్రమాదకరంగా సాగిస్తున్నారు. -
ఉక్కపోత.. ఇక్కట్ల కలబోత
[ 03-05-2024]
ఎండలు ఠారెస్తున్నాయి.. బయటకు రావాలంటే హడలెత్తుతున్నారు.. సామాన్య ప్రజలే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
[ 03-05-2024]
ఇటీవల జాకీర్హుస్సేన్ నగర్లో జరిగిన హత్య కేసులో నిందితులను నవాబుపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నవాబుపేట ఇన్స్పెక్టర్ ఎం.బాబి వివరాలు వెల్లడించారు. -
రూ.1.20 కోట్ల మద్యం స్వాధీనం
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లను తనిఖీ చేస్తున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.నాగమల్లేశ్వరరెడ్డి పేర్కొన్నారు. -
బకింగ్హామ్ కాలువపై శ్రద్ధేది ఏలికా..?
[ 03-05-2024]
కరేడు పంచాయతీ పరిధిలోని సముద్ర తీరంలో ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు హెచరీల నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే ఎనిమిది హెచరీల నిర్మాణాలు పూర్తయ్యాయి. -
జనంమెచ్చని స్మార్ట్ టౌన్షిప్
[ 03-05-2024]
మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తామంటూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎంఐజీ లేఅవుట్కు ప్రజల నుంచి స్పందన కరవైంది. -
పండుటాకులతో రాజకీయం
[ 03-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. యువకులే బయటకు వచ్చే పరిస్థితులు లేవు. గడప దాటితే కుప్పకూలే పరిస్థితి. ఈసమయంలో పింఛనుదారులకు ప్రభుత్వం నరకం చూపించింది. ఇంటికొచ్చి నగదు ఇచ్చే వీలున్నా బ్యాంకుల్లో జమ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు