మీ మాటలకు మోసపోయాం!
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వేతనం రూ.15 వేలకు పెంచుతానంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు.
సీఎం హామీలు విస్మరించారంటూ వీఆర్ఏల ఆందోళన
కలెక్టరేట్ ఎదుట నిరసన(పాత చిత్రం)
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వేతనం రూ.15 వేలకు పెంచుతానంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. పైగా ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ విస్మరించారు.
- ఇది గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ)ఆవేదన.
న్యూస్టుడే, నెల్లూరు (కలెక్టరేట్): ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలను క్రమబద్ధీకరించి వేతనాలు పెంచాలంటూ అయిదేళ్లలో అనేకసార్లు ఉద్యమబాట పట్టినా జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోగా అక్రమ అరెస్టులతో అనేక ఇబ్బందులకు గురి చేసిందని వీఆర్ఏలు వాపోతున్నారు. జిల్లాలో సుమారు 1500 మంది వీఆర్ఏలు ఉన్నారు.
డీఏ తీసుకున్నారు
గత తెదేపా ప్రభుత్వం వీఆర్ఏలకు రూ.6వేల నుంచి రూ.10,500కు జీతం పెంచింది. డీఏ రూ.3వేలు చెల్లించింది. గతంలో వీఆర్ఏ నుంచి వీఆర్వోలుగా ఉద్యోగోన్నతులు, గ్రేడ్-1 వీఆర్వోగా ఇచ్చేవారు. దీనివల్ల బేసిక్ వేతనం రూ.22వేల వరకు వచ్చేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కరూపాయి కూడా పెంచలేదు. గతంలో పోరాడి సాధించుకున్న డీఏను రద్దు చేయడంతో పాటు.. తీసుకున్న డీఏను తిరిగి వీఆర్ఏల నుంచి రికవరీ చేశారు. దీంతో ఒక్కో వీఆర్ఏ రూ.12 వేల నుంచి రూ.14వేల వరకు తిరిగి ప్రభుత్వానికి చెల్లించారు. వీఆర్ఏ నుంచి వీఆర్వో ఉద్యోగోన్నతులు గ్రేడ్-2 ఇవ్వడం వల్ల కేవలం రూ.15 వేలతో పని చేస్తున్నారు. వీఆర్ఏల ఆందోళనలు, ఎన్నికలు నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి డీఏ రూ.500 పునరుద్ధరించి రూ.10,500తో పాటు రూ.500 డీఏ మాత్రమే ప్రస్తుతం అందిస్తున్నారు.
అయిదేళ్లుగా పట్టించుకోలేదు..
కె.పెంచలనరసయ్య, వీఆర్ఏల సంఘం నాయకులు
అధికారంలోకి రాగానే అర్హులెన వారికి ఉద్యోగోన్నతులు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారు. వీఆర్ఏలను అయిదేళ్లుగా పట్టించుకోలేదు. చాలీచాలని వేతనం ఇస్తున్నారు.
ఎన్నో పోరాటాలు చేశాం.. దేవర చెంచయ్య
అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి అయిదేళ్లలో ఏ హామీ నెరవేర్చలేదు. ఎన్నో పోరాటాలు చేశాం. నామినీగా పని చేస్తున్న వీఆర్ఏలకు రాత్రి కాపలా దారులు, అటెండర్లు, డ్రైవర్లు, వీఆర్వోలు ఉద్యోగాలు ఖాళీఉన్న చోట భర్తీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏ ఒక్క హామీ అమలు చేయలేదు.
భారంగా కుటుంబ పోషణ.. దాచూరి దుగ్గయ్య
చాలీచాలని వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. వీఆర్ఏలను జగన్ గుర్తించకపోగా విస్మరించారు. అయిదేళ్లుగా సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపట్టినా పట్టించుకోలేదు. ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచారం
[ 03-05-2024]
క్లస్టర్ ఇన్ఛార్జ్, తెదేపా సీనియర్ నాయకుడు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో 19వ వార్డు ఇన్ఛార్జ్ వేగూరి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సీనియర్ ఫ్యాకల్టీకి ఎస్వీ వర్సిటీ డాక్టరేట్
[ 03-05-2024]
కావలి పట్టణానికి చెందిన సురేఖ కుమారికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. -
పరిశ్రమలు రావాలంటే బాబు రావాలి
[ 03-05-2024]
కోవూరు మండల వలసలతో వైకాపా బక్కచిక్కుతుంటే తెదేపా బలపడుతోంది. -
నగరంలో నేడు చంద్రబాబు, పవన్కల్యాణ్ పర్యటన
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. -
జగన్.. ఏడి‘పింఛన్’!
[ 03-05-2024]
అవ్వా తాతల జీవితాల్లో ఆనందం, సంతోషం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. అందుకే వారి ఇంటి వద్దనే పింఛను డబ్బు పంపిణీ చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నామని పదే పదే చెప్పిన జగన్.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వారిని ఇబ్బంది పెట్టేందుకూ వెనుకాడటం లేదు. -
జిల్లా ఓటర్లు 19,44,874
[ 03-05-2024]
జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. నియోజకవర్గాల వారీగా ఓటుహక్కు వినియోగించుకునే వారి తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో గత జననవరి 22వ తేదీ నాటికి 19,08,498 ఉండగా- తాజా జాబితా ప్రకారం ఆ సంఖ్య పెరిగింది. -
వంతెన నిర్లక్ష్యం.. ఈ వంతున
[ 03-05-2024]
జిల్లాలో పలు రహదారులు, శిథిలమైన వంతెనలు భయపెడుతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో కాలం చెల్లిపోయాయి. వీటిపై రాకపోకలు ప్రమాదకరంగా సాగిస్తున్నారు. -
ఉక్కపోత.. ఇక్కట్ల కలబోత
[ 03-05-2024]
ఎండలు ఠారెస్తున్నాయి.. బయటకు రావాలంటే హడలెత్తుతున్నారు.. సామాన్య ప్రజలే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
[ 03-05-2024]
ఇటీవల జాకీర్హుస్సేన్ నగర్లో జరిగిన హత్య కేసులో నిందితులను నవాబుపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నవాబుపేట ఇన్స్పెక్టర్ ఎం.బాబి వివరాలు వెల్లడించారు. -
రూ.1.20 కోట్ల మద్యం స్వాధీనం
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లను తనిఖీ చేస్తున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.నాగమల్లేశ్వరరెడ్డి పేర్కొన్నారు. -
బకింగ్హామ్ కాలువపై శ్రద్ధేది ఏలికా..?
[ 03-05-2024]
కరేడు పంచాయతీ పరిధిలోని సముద్ర తీరంలో ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు హెచరీల నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే ఎనిమిది హెచరీల నిర్మాణాలు పూర్తయ్యాయి. -
జనంమెచ్చని స్మార్ట్ టౌన్షిప్
[ 03-05-2024]
మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తామంటూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎంఐజీ లేఅవుట్కు ప్రజల నుంచి స్పందన కరవైంది. -
పండుటాకులతో రాజకీయం
[ 03-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. యువకులే బయటకు వచ్చే పరిస్థితులు లేవు. గడప దాటితే కుప్పకూలే పరిస్థితి. ఈసమయంలో పింఛనుదారులకు ప్రభుత్వం నరకం చూపించింది. ఇంటికొచ్చి నగదు ఇచ్చే వీలున్నా బ్యాంకుల్లో జమ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం